Cricket

T20 World Cup 2022: ఉత్కంఠ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం, బంగ్లా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు, లిటన్‌ దాస్‌ శ్రమ వృధా, బ్యాటింగ్‌లో మరోసారి దుమ్మురేపిన విరాట్ కోహ్లీ

Hazarath Reddy

ఉత్కంఠభరిత పోరులో బంగ్లాపై భారత్ విజయం సాధించింది. వరుణుడు బంగ్లాదేశ్ ఆశల మీద నీళ్లు చల్లాడు. వర్షం వల్ల ఆట ఆగిపోవడంతో బంగ్లా బ్యాటర్లలో ఊపు తగ్గింది. దీంతో వర్షం తరువాత ఆట తిరిగి ప్రారంభం కాగానే ఊపు మీదున్న లిటన్‌ దాస్‌ 60 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో బంగ్లాకు పరాజయం తప్పలేదు.

T20 World Cup 2022: మ్యాచ్ ఆగితే భారత్ సెమీస్ అవకాశాలు క్లిష్టమే, డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌నే విజేత, ఆట తిరిగి ప్రారంభం కావాలని కోరుకుంటున్న భారత అభిమానులు

Hazarath Reddy

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి.టీమిండియా నిర్ధేశించిన 185 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 7వ ఓవర్‌ అనంతరం ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

T20 World Cup 2022: ఒక్క బంతికి 14 పరుగులు పిండిన కెఎల్ రాహుల్, అందులో రెండు సిక్సర్లు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌లో రాహుల్‌ తన మునుపటి ఆటను ప్రదర్శించాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సరిగ్గా 50 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే షోరిఫుల్‌ ఇస్లామ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో రాహుల్‌ ఒక్క బంతికే 14 పరుగులు బాదడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది

T20 World Cup 2022: భారత బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లా బ్యాటర్ లిటన్‌ దాస్‌, ఏడు ఓవర్లలో 69 పరుగులు సాధించిన బంగ్లాదేశ్, వర్షం వల్ల ఆగిపోయిన మ్యాచ్, మళ్లీ కొనసాగే అవకాశం

Hazarath Reddy

ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిట్టన్‌ దాస్‌ 59, హొస్సేస్‌ షాంటో ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం బంగ్లాదేశ్‌ 17 పరుగులు వెనుకబడి ఉంది. ఇప్పటికే బంగ్లా ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్ల ఆట ముగియడంతో వర్షం ఎంతకు తగ్గకపోతే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో విజేతను ప్రకటించనున్నారు.

Advertisement

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు, మహేలా జయవర్థనేని అధిగమించిన భారత క్రికెటర్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌ల చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొడుతూనే ఉన్నాడు. 1016 పరుగులతో ఉన్న మహేలా జయవర్థనేని భారత క్రికెటర్ అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.

T20 World Cup 2022: వైరల్ వీడియో, బౌలర్ 155 కిమీ వేగంతో బంతిని విసిరితే బ్యాటర్ దాన్ని 94 మీటర్ల దూరానికి కొట్టాడు, ఫిలిప్స్‌ సిక్స్ వీడియో వైరల్

Hazarath Reddy

టి20 ప్రపంచకప్‌లో బట్లర్‌ సేన న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొంది, సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకున్న సంగతి విదితమే.ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ కొట్టిన సిక్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

T20 World Cup 2022: గెలిస్తే సెమీస్‌కు, ఓడితే లెక్కలు చూసుకోవాల్సిందే, నేడు బంగ్లాతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022(సూపర్‌-12)లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్‌ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టు సెమీస్‌ ఛాన్స్‌లను సంక్లిష్టం చేసుకుంటుంది.

T20 World Cup 2022: వైరల్ వీడియో, బంగ్లాదేశ్ మీద గెలుపు కోసం ప్రాక్టీస్‌లో కుస్తీలు పడుతున్న భారత ఆటగాళ్లు

Hazarath Reddy

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధమైంది. టోర్నీలో భారత్‌కి ఇది నాలుగో మ్యాచ్‌. ఆదివారం పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో ఓడిన తర్వాత బంగ్లాతో తలపడనున్నందున ఎలాగైనా గెలవాలని కసిగా పెట్టుకుంది

Advertisement

T20 World Cup 2022: న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి, 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన ఇంగ్లండ్

Hazarath Reddy

ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. సూపర్-12 దశలో భాగంగా జరిగిన నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 20 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

T20 World CUP 2022: సెమీస్ రేసులోకి వచ్చేసిన శ్రీలంక, డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

Hazarath Reddy

బ్రిస్బేన్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.దీంతో టీ20 ప్రపంచకప్‌-2022లో శ్రీలంక సెమీస్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

T20 World Cup 2022: వరల్డ్‌కప్‌ గెలిచేందుకు రాలేదు, టీమిండియాను ఓడించడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాం, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

సెమీస్‌కు రేసులో నిలవాలంటే రేపు అడిలైడ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ (T20 World Cup 2022) ఇరు జట్లకు కీలకం కానుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది.

India vs New Zealand: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు రెస్ట్, న్యూజిలాండ్‌ టూర్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా, వన్డే జట్టు కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌, పూర్తి లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత నవంబర్‌ 18 నుంచి 30 వరకు టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా భారత్‌ 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం భారత జట్టును సెలెక్షన్‌ కమిటీ ఇవాళ (అక్టోబర్‌ 31) ప్రకటించింది.

Advertisement

T20 World Cup 2022: 42 ర‌న్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా, రేపు ఇంగ్లండ్‌,న్యూజిలాండ్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కీల‌కం

Hazarath Reddy

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఇవాళ జ‌రిగిన గ్రూప్ వ‌న్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 42 ర‌న్స్ తేడాతో ఐర్లాండ్‌పై విజ‌యం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆ గ్రూపులో రెండ‌వ స్థానంలోకి వెళ్లింది. 180 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఐర్లాండ్ 18.1 ఓవ‌ర్ల‌లో 137 ర‌న్స్‌కు ఆలౌటైంది.

T20 World Cup 2022: కళ్లు చెదిరే ఫీల్డింగ్ వీడియో వైరల్, వెన‌క్కి ఎగిరి ఎడ‌మ చేతితో బంతి సిక్స్ పోకుండా ఆపిన ఐర్లాండ్ ఫీల్డ‌ర్ బారీ మెక్‌కార్తి

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ ఫీల్డ‌ర్ బారీ మెక్‌కార్తి అద్భుత‌మైన ఫీల్డింగ్ స్కిల్స్‌ను ప్ర‌ద‌ర్శించాడు. బౌండ‌రీ లైన్ వ‌ద్ద గాలిలో బంతిని ప‌ట్టి సిక్స‌ర్ వెళ్ల‌కుండా అడ్డుకున్నాడు.విషయంలోకి వెళ్తే 15వ ఓవ‌ర్‌లో స్టోయినిస్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు.

T20 World Cup 2022: చెత్త ఫీల్డింగ్‌తో కొంపలు ముంచారంటూ టీమిండియాపై ట్విట్టర్లో ఫైర్, ఆ ఒక్క క్యాచ్‌ పట్టి ఉంటే మ్యాచ్‌ మలుపు తిరిగేది కోహ్లీ అంటూ నెటిజన్ ట్వీట్

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. తొలుత బ్యాటింగ్‌లో విఫలమైన భారత్‌.. అనంతరం ఫీల్డింగ్‌లో కూడా చేతులేత్తేసింది. ఇందుకు ఫలితంగా దక్షిణాఫ్రికా చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది.

T20 World Cup 2022: భారత్ రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే పాకిస్తాన్ ఇంటికి, టీ20 ప్రపంచ కప్‌లో దాయాది దేశం సెమీస్ ఆశలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా (T20 World Cup 2022) దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓటమి చెందిన సంగతి విదితమే. అయితే ఈ భారత్ పరాజయం (South Africa beat India on Sunday) పాకిస్తాన్‌ సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసింది.

Advertisement

Virat Kohli: నా స్వంత హోటల్ గదిలోనే నాకు రక్షణ లేదు, సంచలన వీడియో షేర్ చేసిన విరాట్ కోహ్లీ, వ్యక్తిగత స్థలాన్ని ఎక్కడ ఆశించగలను అంటూ పోస్ట్

Hazarath Reddy

ఈ వీడియో భయంకరంగా ఉంది మరియు ఇది నా గోప్యత గురించి నాకు చాలా మతిస్థిమితం లేని అనుభూతిని కలిగించింది. నేను నా స్వంత హోటల్ గదిలో గోప్యతను కలిగి ఉండలేకపోతే, నేను నిజంగా వ్యక్తిగత స్థలాన్ని ఎక్కడ ఆశించగలను?? ఈ రకమైన మతోన్మాదం మరియు గోప్యతపై సంపూర్ణ చొరబాటుతో నేను సమ్మతించను.

Virat Kohli Creates Record: విరాట్ కోహ్లీ ఖాతాలో మరో కొత్త రికార్డ్, చేసింది 12 పరుగులే అయినా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన కింగ్ కోహ్లీ, టీ-20 వరల్డ్ కప్‌లో వెయ్యి పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రికార్డు

Naresh. VNS

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 12 రన్స్ చేయడం ద్వారా విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. కోహ్లి (1001) కి ముందు శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్దనే (Jayawardene ) (1016) ఒక్కడే ఉన్నాడు. జయవర్దనే 31 ఇన్నింగ్స్ లు ఆడగా.. కోహ్లీ 24 ఇన్నింగ్స్ లలోనే ఈ మైలురాయి చేరుకున్నాడు

India vs South Africa: సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, చేతులెత్తేసిన రోహిత్ సేన, వరల్డ్ కప్ లో తొలి ఓటమి

kanha

ఆస్ట్రేలియాలో జరుగుతున్న t20 లీగ్ మ్యాచ్లో భారత్ సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

T20 World Cup: భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ నేడే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు కోసం పాక్ అభిమానుల ప్రార్థనలు.. భారత్, జింబాబ్వే చేతుల్లో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్థాన్.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై భారత్ గెలిస్తే పాక్‌కు సెమీస్ అవకాశాలు.. నేడు నెదర్లాండ్స్‌ తో జరిగే మ్యాచ్ లో పాక్ ఓడితే ఇంటికే

Sriyansh S

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని పాక్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Advertisement
Advertisement