గత రెండు ఏళ్ల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) రెండు దేశాలె మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది.
ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ ఒప్పందం యుద్ధంతో దెబ్బతిన్న గాజా ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నట్లు పోస్టులో పేర్కొన్నారు. యుద్ధంతో దెబ్బతిన్న గాజా ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని మేము ఆశిస్తున్నామని ప్రధాని మోదీ తన ఎక్స్ ట్వీట్లో పేర్కొన్నారు.
Here's Update
BREAKING: The Gaza ceasefire between Israel and Hamas is now in effect - Arab media
— Insider Paper (@TheInsiderPaper) October 9, 2025
We welcome the agreement on the first phase of President Trump's peace plan. This is also a reflection of the strong leadership of PM Netanyahu.
We hope the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza will bring respite to them and pave the way…
— Narendra Modi (@narendramodi) October 9, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)