Indian-Origin Motel Manager Killed in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్య, పాయింట్ బ్లాంక్లో భారత వ్యాపారిని గన్తో తలపై కాల్చి చంపిన దుండగుడు
అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్బర్గ్లోని రాబిన్సన్ టౌన్షిప్లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారి రాకేశ్ ఎహగబన్ (51) దారుణ హత్యకు గురయ్యారు. పిట్స్బర్గ్లోని రాబిన్సన్ టౌన్షిప్లో మోటెల్ నిర్వాహకుడిగా పనిచేస్తున్న ఆయన శుక్రవారం సాయంత్రం మోటెల్ బయట జరిగిన గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో నిందితుడు కాల్పులు జరిపి ప్రాణాలు తీసేశాడు. గొడవ ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడానికి రాకేష్ అడిగినపుడు, నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆయనపై కాల్చాడు. ఈ ఘటనతో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం సంఘటన మోటెల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వ్యక్తి స్టాన్లీ యుజెన్ వెస్ట్ (37)గా గుర్తించారు. అతడు కాల్పుల తర్వాత మోటెల్ నుండి పరారయ్యాడు. పోలీసులు అతడిని పిట్స్బర్గ్లోని ఈస్ట్ హిల్స్ ప్రాంతంలో పట్టుకున్నారు. ఈ సమయంలో నిందితుడు పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురుదాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం, యుజెన్ వెస్ట్ గత రెండు వారాలుగా రాకేశ్ నిర్వహిస్తున్న మోటెల్లో అద్దెకు ఉంటున్నాడు. నిందితుడిపై హత్య, హత్యాయత్నం, ఆయుధ చట్ట ఉల్లంఘన వంటి అభియోగాలు మోపారు. పోలీసులు ఇంకా సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Indian-Origin Motel Manager Killed in US Video:
4846
[Breaking News] #1124
Bardoli's Rayam resident Rakesh Patel shot dead in Pittsburgh motel while aiding a gunman; second Indian-origin manager killed in US within a month, October 7, 2025. NRI community demands PM intervention for Gujarati safety abroad. Follow for updates.… pic.twitter.com/Apsan7gdGi
— Sayaji Samachar Network (@SayajiSamacharX) October 7, 2025
Sensitive content
అమెరికాలో పాయింట్ బ్లాంక్లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగుడు
పిట్స్బర్గ్లో వ్యాపారి రాకేశ్ పటేల్(50)ను పాయింట్ బ్లాంక్లో గన్తో తలపై కాల్చిన స్టేన్లీ వెస్ట్ అనే వ్యక్తి
ఈ నెల 3న ఘటన.. అమెరికాలోని ఓ హోటల్లో పార్ట్నర్గా ఉన్న సూరత్కు చెందిన రాకేశ్… pic.twitter.com/M2dhOyQ5BF
— Telugu Scribe (@TeluguScribe) October 7, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 07, 2025 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

