Cricket

Suryakumar Yadav's Catch Controversy: వివాదానికి ఈ వీడియోతో ఫుల్‌స్టాప్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ లేటెస్ట్ వీడియో ఇదిగో, బౌండరీలైన్‌కు కొద్ది దూరంలో..

Vikas M

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో వివాదాస్పదమైన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌కు సంబంధించి తాజాగా సరికొత్త యాంగిల్‌కు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ కాలు బౌండరీకి తగిలిందని, అది అసలు అవుటే కాదని చాలామంది వాదించారు. రీప్లేల్లోనూ సూర్య కాలు బౌండరీలైన్‌కు తాకినట్టు అస్పష్టంగా కనిపించింది.

Rohit Sharma on Suryakumar Yadav's Catch: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు, వదిలేసి ఉంటే జట్టు నుంచి పీకేసేవాడినంటూ..

Vikas M

వరల్డ్ కప్‌-2024 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ ని బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఒడిసిపట్టుకున్న సంగతి విదితమే. ఈ క్యాచ్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. భారత్ మరోసారి ప్రపంచకప్ చేజిక్కుంచుకునేందుకు కారణమైంది.

Mohammed Siraj: వీడియో ఇదిగో, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం, భారత్ మాతాకీ జై అనే నినాదాలతో బ్రహ్మరథం పట్టిన క్రికెట్ అభిమానులు

Hazarath Reddy

టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అతనికి క్రికెట్ అభిమానులు భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య స్వాగతం పలికారు.

Indian Deaf Cricket Team: ఇంగ్లండ్‌పై టీ 20 సీరిస్ కైవసం చేసుకున్న భారత జాతీయ బధిర క్రికెట్ జట్టు, చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించి తమిళనాడుకు తిరిగి వచ్చిన కెప్టెన్ వీరేంద్ర సింగ్ నేతృత్వంలోని భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులకు చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ జూన్ 18న ప్రారంభమై జూన్ 27న ముగిసింది. 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 5-2తో విజయం సాధించింది.

Advertisement

Fan Climbs Tree to Film Team India Victory Parade: చెట్టెక్కిన అభిమానం.. టీమిండియా విక్టరీ పరేడ్ లో అనూహ్య ఘటన.. మీరూ చూడండి!

Rudra

టీ20 వరల్డ్‌ కప్‌ విజయానంతరం భారత క్రికెట్‌ జట్టు గురువారం ముంబైలో విన్నింగ్‌ పెరేడ్‌ ఘనంగా జరిగింది. భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు పెద్దయెత్తున ఎగబడ్డారు.

Fake T20 World Cup Trophy: టీమిండియా చేతిలో ఉండేది డూప్లికేట్ ప్రపంచకప్ ట్రోఫీ, అసలైన వరల్డ్ కప్ ట్రోఫీ ఎక్కడుందో తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే..

Vikas M

టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమ్ ఇండియా తిరిగి వచ్చింది, కానీ అది నిజమైన ట్రోఫీ కాదనే విషయం మీకు తెలుసా.. అవును భారత ఆటగాళ్ల చేతిలో ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు. దాని డూప్లికేట్.. మరి డూప్లీకేట్ ట్రోఫీ ఎందుకు అందించారనే విషయంపై చాలా మందికి అనుమానం రావొచ్చు

Team India Victory Parade: బీసీసీఐ నుంచి 125 కోట్ల రూపాయల చెక్కును అందుకున్న టీమిండియా, వాంఖడే స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల మధ్య కన్నుల పండుగగా టీమిండియా విక్టరీ పరేడ్

Vikas M

ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత టీమిండియా ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది.

Team India Dance Video: వీడియో ఇదిగో, వాంఖడే స్టేడియంలో చిందేసిన టీమిండియా ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులతో నిండిపోయిన స్టేడియం

Vikas M

మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖెడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఇతర భారత క్రికెటర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Rohit Sharma-Kohli Lifting Trophy: వీడియో ఇదిగో, అభిమానుల కోసం ట్రోఫీని పైకి ఎత్తిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ద్వయం

Vikas M

భారత క్రికెట్ జట్టు విజయ పరేడ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ICC T20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ముంబైలో అభిమానుల సముద్రం ముందు పైకి ఎత్తి అభిమానులకు కానుకగా అందించారు. ఇద్దరు సీనియర్ క్రికెటర్లు అభిమానులతో సంబరాలు చేసుకునే మూడ్‌లో ట్రోఫిని అభిమానులకు చూపించారు.

Team India Victory Parade: దయచేసి మెరైన్ డ్రైవ్‌ వైపు వెళ్లొద్దని ప్రజలను కోరిన ముంబై పోలీసులు, జన సునామిగా మారిన వాంఖడే స్టేడియం

Hazarath Reddy

ఇండియన్ క్రికెట్ టీమ్ విక్టరీ పరేడ్ కోసం వాంఖడే స్టేడియం దగ్గర అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో మెరైన్ డ్రైవ్‌ వైపు వెళ్లకుండా ఉండాలని ముంబై పోలీసులు ప్రజలను కోరారు. X (గతంలో ట్విటర్‌గా ఉండేవి)ని తీసుకుని, ముంబై పోలీసులు ఒక వీడియోను పంచుకున్నారు, మెరైన్ డ్రైవ్‌ వైపు దయచేసి ప్రయాణించవద్దని పౌరులను కోరారు.

Team India Victory Parade: వీడియో ఇదిగో, ముంబై మెరైన్ డ్రైవ్ వద్ద పోటెత్తిన జన సముద్రం, టీమిండియాకు గ్రాండ్ వెల్ కం చెప్పిన అభిమానులు

Hazarath Reddy

తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.

Team India Meets PM Modi Video: కంగ్రాట్స్ టీమిండియా అంటూ అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, భవిష్యత్తులో మరిన్ని టైటిల్స్ గెలవాలని కోరిన భారత ప్రధాని

Hazarath Reddy

లోక్‌కల్యాణ్ మార్గ్‌ 7లో భారత క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం అల్పాహారం కోసం న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. గంటపాటు జరిగిన సమావేశంలో టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టును ప్రధాని మోదీ అభినందించారు.

Advertisement

Team India Meets PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీతో భేటీ అయిన టీమిండియా ప్లేయర్లు, రోహిత్ సేనకు అభినందనలు తెలిపిన భారత ప్రధాని

Hazarath Reddy

లోక్‌కల్యాణ్ మార్గ్‌ 7లో భారత క్రికెట్ జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు గురువారం అల్పాహారం కోసం న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. గంటపాటు జరిగిన సమావేశంలో టీ20 ప్రపంచకప్‌ విజేత జట్టును ప్రధాని మోదీ అభినందించారు.

Rohit Sharma Dance Video: రోహిత్‌ శర్మ డ్యాన్స్ వీడియో ఇదిగో, స్థానిక మహిళలతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్, ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్న భారత జట్టు

Hazarath Reddy

Team India To Meet PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీతో మరి కాసేపట్లో టీమిండియా భేటీ, అనంతరం అల్పాహార విందు, ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌‌కు చేరుకున్న భారత జట్టు

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు భారత క్రికెట్ జట్టు లోక్ కళ్యాణ్ మార్గ్‌ 7కు చేరుకుంది. రెండో టీ20 టైటిల్ గెలిచిన తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమిండియా ఈరోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

Team India At Delhi: న్యూఢిల్లీకి చేరుకున్న వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నర్స్, ఎయిర్ పోర్టు ద‌గ్గ‌ర కోలాహలం, స్వదేశంలో అడుగు పెట్టిన వెంట‌నే రోహిత్, కోహ్లీ ఏం చేశారో చూడండి!

VNS

టీమిండియా స్వదేశానికి (Indian Cricket Team) చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌ సాధించిన టీమిండియాకు (Indian Cricket Team) ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ కప్ (World Cup) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు.

Advertisement

Hardik Pandya: ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ ప్యాండ్యా, వనిందు హసరంగను వెనక్కునెట్టేసిన టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌

Vikas M

ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా టీ20 వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ ప్యాండ్యా ప్రపంచ నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. శ్రీలంకు చెందిన వనిందు హసరంగను వెనక్కునెట్టి నెంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు

Team India Leaves Barbados: వీడియో ఇదిగో, బార్బ‌డోస్‌ నుండి ఎట్టకేలకు బయలుదేరిన టీమిండియా, ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి..

Vikas M

టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటికీ బెరిల్ హరికేన్ కారణంగా బార్బ‌డోస్‌లో చిక్కుకున్న టీమిండియా ఎట్ట‌కేల‌కు తిరిగి స్వదేశానికి ప‌య‌న‌మైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక ఛార్టర్ ఫ్లైట్‌లో బార్బడోస్ నుంచి రోహిత్ సేన ఢిల్లీకి బయలుదేరింది

Rohit Sharma: బార్బ‌డోస్‌ పిచ్‌లోని మ‌ట్టిని తినడానికి గల కారణాన్ని వివరించిన రోహిత్ శర్మ, ఎప్పటికి తనకు గుర్తుండిపోవాలన్న ఉద్దేశంతోనే..

Vikas M

పిచ్ మ‌ట్టిని తినాల‌ని ముందుగా అనుకోలేదు. కానీ, ఆ క్ష‌ణం ఎందుకో అలా చేయాల‌నిపించింది. మ్యాచ్ అనంత‌రం పిచ్ ద‌గ్గ‌రికి వెళ్లాను. మాకు ట్రోఫీ అందించిన పిచ్ అది. అందుక‌ని ఆ మైదానాన్ని, ఆ పిచ్‌ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. అందుక‌నే ఈ విజ‌యానికి జ్ఞాప‌కంగా పిచ్ మట్టిని టేస్ట్ చేశాను’ అని రోహిత్ వెల్ల‌డించాడు.

ICC T20 World Cup 2026: T20 ప్రపంచ కప్ 2026 ఫార్మాట్‌ను ప్రకటించిన ఐసీసీ, నేరుగా అర్హత సాధించనున్న మొత్తం 12 జట్లు, ఎనిమిది జట్లకు క్వాలిఫైయింగ్‌ టోర్నీ

Vikas M

ఐసీసీ 2026 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ను ఫార్మాట్‌ను ప్రకటించింది. ఈ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్‌ కప్‌ తరహాలోనే టోర్నీ జరుగనున్నది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్‌ కప్‌లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది.

Advertisement
Advertisement