Asia Cup 2023 Schedule Announced: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..
క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు.
క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా వన్డే కప్-2023 షెడ్యూల్ విడుదలైంది. పాకిస్తాన్, శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా ప్రకటించారు. ట్విటర్ వేదికగా బుధవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగష్టు 30న ఆరంభం కానున్న ఈ ఈవెంట్ సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది.
పాకిస్తాన్లోని ముల్తాన్ వేదికగా పాకిస్తాన్- నేపాల్ మ్యాచ్ మొదలై.. శ్రీలంకలోని కొలంబోలో ఫైనల్తో ఈ మెగా ఈవెంట్కు తెరపడనుంది. ఇక దాయాదులు భారత్- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీ వేదికగా తలపడనున్నాయి. ఇక ఆ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్తో అదే వేదికపై మ్యాచ్ ఆడనుంది.
కాగా ఆసియా వన్డే కప్-2023 గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్తో పాటు నేపాల్ ఉండగా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ దశలో మొత్తం ఆరు మ్యాచ్లు జరుగనున్నాయి. ఇందులో రెండు గ్రూపుల నుంచి తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.
Here's ANI Tweet
Schedule for the Men's ODI Asia Cup 2023 announced. India to take on Pakistan on 2nd September at Kandy in Sri Lanka.
In the inaugural match on 30th August, Pakistan and Nepal face each other in Multan. pic.twitter.com/9m70fd7Nm6
— ANI (@ANI) July 19, 2023
గ్రూప్-ఏ టాపర్గా నిలిచిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో సెప్టెంబరు 6న సూపర్-4లో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబరు 15న సూపర్-4 చివరి మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాప్-2 జట్లు సెప్టెంబరు 17నాటి ఫైనల్కు అర్హత సాధిస్తాయి.
ఇక ఈ టోర్నీ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ చేజిక్కించుకోగా.. టీమిండియా పాక్ పర్యటనకు సుముఖంగా లేని నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ను ఆశ్రయించారు. ఇందులో భాగంగా పాక్లోని ముల్తాన్లో ఒక మ్యాచ్.. లాహోర్లో మూడు మ్యాచ్లు జరుగనుండగా.. శ్రీలంకలోని క్యాండీలో మూడు, కొలంబోలో 6 మ్యాచ్లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. కాగా గతేడాది జరిగిన ఆసియా టీ20 టోర్నీ ఫైనల్లో పాక్ను ఓడించి శ్రీలంక విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.
(The above story first appeared on LatestLY on Jul 19, 2023 08:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

