RR Vs PBKS: రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం, పంజాబ్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం, అర్ధసెంచరీలతో మెరిసిన యశస్వీ, పడిక్కల్

ఐపీఎల్ 2023 (IPL 2023)లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు స‌జీవంగా ఉన్నాయి. అయితే.. మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల బ‌ట్టి రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరేది లేనిది తెలుస్తుంది.

RR Vs PBKS: రాజస్థాన్ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం, పంజాబ్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం, అర్ధసెంచరీలతో మెరిసిన యశస్వీ, పడిక్కల్
Rajasthan Royals bowlers celebrate after victory (Photo Credits: IPL/Twitter)

Dharmashala, May 19: ఐపీఎల్ 2023 (IPL 2023)లో భాగంగా ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో (Punjab Kings) జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (Rajasthan Royals) విజ‌యం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు స‌జీవంగా ఉన్నాయి. అయితే.. మిగిలిన జ‌ట్ల ఫ‌లితాల బ‌ట్టి రాజ‌స్థాన్ ప్లే ఆఫ్స్‌కు చేరేది లేనిది తెలుస్తుంది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో ((Rajasthan Royals) ) య‌శ‌స్వి జైస్వాల్‌(50; 36 బంతుల్లో 8 ఫోర్లు), ప‌డిక్క‌ల్‌(51; 30 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌గా ఆఖ‌ర్లో షిమ్రాన్ హెట్మెయర్(46; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రియాన్ ప‌రాగ్‌(20; 12 బంతుల్లో 1ఫోర్‌, 2సిక్స‌ర్లు) దూకుడుగా ఆడారు.

పంజాబ్ కింగ్స్ బౌల‌ర్ల‌లో ర‌బాడ రెండు వికెట్లు తీయ‌గా, సామ్‌క‌ర‌న్‌, అర్ష్‌దీప్ సింగ్‌, నాథ‌న్ ఎల్లిస్‌, రాహుల్ చాహ‌ర్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో సామ్ క‌ర‌న్‌(49 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), జితేశ్ శ‌ర్మ‌(44; 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), షారుక్ ఖాన్‌(41 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ధాటిగా ఆడారు.

IPL 2023: కోహ్లీ సెంచరీతో ఫ్యాన్స్‌కు పండగ, వాళ్లిద్దర్నీ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్న ఆర్‌సీబీ అభిమానులుచ మీమ్స్ ఇవిగో.. 

మిగిలిన వారిలో లివింగ్ స్టోన్‌(9), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(2)లు విఫ‌లం కాగా.. ధావ‌న్‌(17), అథర్వ తైదే(19) ప‌ర్వాలేద‌నిపించారు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో న‌వ‌దీప్ సైనీ మూడు వికెట్లు తీయ‌గా, బౌల్ట్‌, జంపా చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

(The above story first appeared on LatestLY on May 19, 2023 11:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).