రాష్ట్రీయం

Bhatti Vikramarka On Hyderabad Development: బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం..హైదరాబాద్ నగర విస్తరణకు చర్యలు తీసుకుంటాం అన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Arun Charagonda

హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు తీసుకుంటాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణరంగం విస్తరిస్తుందన్నారు. బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం అని తెలిపారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామన్నారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.

Vijaya Dairy Chairman Jagan Mohan Reddy: అఖిల ప్రియ రౌడీ రాజకీయానికి భయపడం, చంద్రబాబు మెప్పుకోసమే కొత్త నాటకాలు అని విజయ డైరీ ఛైర్మన్ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపాటు

Arun Charagonda

నంద్యాల జిల్లా విజయ డైరీలో భూమా అఖిల ప్రియ చేసిన హంగామా పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విజయ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి. విజయ డైరీ అన్నది స్వతంత్ర సంస్థ అన్న విషయం కూడా అఖిలప్రియ మర్చిపోయిందన్నారు. అఖిలప్రియ రౌడీ రాజకీ యానికి ఇక్కడ భయప డేవారు లేరు అన్నారు.

Kadiyam Srihari: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ధర్నా, తొలి నుండి పార్టీలో ఉన్న వారిని పట్టించుకోవడం లేదని ఫైర్..కడియంకు వ్యతిరేకంగా నినాదాలు

Arun Charagonda

కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతుదారులు ఆందోళన చేశారు. పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాకుండా.. కడియం శ్రీహరి వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

Hanuman Temple Vandalized: వీడియో ఇదిగో, చిత్తూరు జిల్లాలో ఆంజేనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో ములకలచెరువులో గ్రామానికి కాస్త దూరంగా శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. అయితే ఆలయాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి.. గేట్లు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీహెచ్పీ నేతలు చెప్పారు.

Advertisement

Telangana: విద్యార్థిని చితక బాదిన క్లాస్ టీచర్..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..వీడియో చూసి అంతా కన్నీటి పర్యాంతం

Arun Charagonda

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెం మానస వికాస స్కూల్లో విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. ఏమైందని తల్లి అడగగా, క్లాస్ టీచర్.. విచక్షణ రహితంగా కొట్టాడంటూ కన్నీరు పెట్టుకున్నాడు బాలుడు.సీసీ టీవీలో దృశ్యాలు రికార్డు కాగా వీడియో చూసి కన్నీటి పర్యాంతమయ్యారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

APSRTC Driver Dies of Heart Attack: చీరాలలో తీవ్ర విషాదం, బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు, పొలాలలోకి దూసుకెళ్లిన బస్సు, డ్రైవర్ మృతి

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లాలో డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా కర్లపాలెం వద్ద డ్రైవర్‌ సాంబశివరావుకు గుండెపోటు వచ్చింది. బస్సు వేగాన్ని తగ్గించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Tirupati: శవాన్ని దహనం చేయాలంటే ప్రాణాలకు తెగించాల్సిందేనా, తిరుపతి జిల్లాలో ఆ ఊరి ప్రజలకు ఇన్ని ఇబ్బందులా...వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుపతి జిల్లా సత్యవేడు :ప్రాణాలకు తెగించినా పట్టించుకోవడం లేదు అధికార యంత్రాంగం. వర్షా కాలంలో చని పోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు...స్మశానానికి వెళ్లాలంటే అరునానది సమీపంలోనీ కాలువలో ఈదుకుంటూ శవాన్ని భుజాలపై మోసుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని రోజులైనా ఆ గ్రామ ప్రజల కష్టాలు మాత్రం తీర్చే నాయకుడే లేకుండా పోయాడని వాపోతున్నారు ప్రజలు.

Andhra Pradesh Rains: ఏపీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు, నెల్లూరును ముంచెత్తిన వానలు

Hazarath Reddy

ఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Advertisement

Hydra: హైదరాబాద్‌లో స్థలం కొనాలనుకుంటున్నారా..ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో  స్థలం ఉందని భయపడుతున్నారా?, అయితే మీరు కొనాలనుకునే లేదా ఉన్న స్థలం ఎఫ్‌టీఎల్‌-బఫర్‌జోన్‌లో ఉందా ఇలా తెలుసుకోండి!

Arun Charagonda

హైడ్రా..ఈ పేరు వింటేనే అక్రమార్కులు భయపడే స్థితికి వచ్చేశారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ కొనాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల భయాలను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది.

Devisri Prasad Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్, 19న జరిగే సంగీత కార్యక్రమానికి ఆహ్వానం.వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లను మర్యాదపూర్వకంగా కలిశారు సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించారు దేవిశ్రీ ప్రసాద్.

Jagtial: మంత్రగాళ్లను చంపేస్తాం..జగిత్యాలలోని గ్రామంలో వెలసిన పోస్టర్లు,భయాందోళనలో గ్రామస్థులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల - మేడిపెల్లి మండలం కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను చంపబోతున్నామని వార్నింగ్ ఇస్తూ పోస్టర్లు వెలిశాయి. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం అంటూ పోస్టర్ వేశారు. భయాందోళనలో గ్రామస్థులు, విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Hyderabad Rains: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు,హైదరాబాద్‌లో ఉదయం నుండే భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాయుగుండం ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.

Advertisement

Telangana Govt Relieved IAS Officers: ఆ ఐదుగురు ఐఏఎస్ ల‌ను రిలీవ్ చేసిన రేవంత్ స‌ర్కార్, ఏపీలో రిపోర్ట్ చేయాల్సింది ఈ రోజే.. లంచ్ మోష‌న్ దాఖ‌లు చేయ‌నున్న ఐఏఎస్ లు

VNS

ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి (Amrapali), రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి కరణ, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ లను కేంద్ర ఉత్తర్వులు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్ లను రివీవ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీవోపీటీ (DOPT) ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్ లతోపాటు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.

Private Liquor Shops in AP: ఏపీలో ఇవాల్టి నుంచి ప్రైవేట్ మ‌ద్యం షాపులు ప్రారంభం, కోరుకున్న బ్రాండ్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్దం, వారం పాటూ తాత్కాలిక లైసెన్స్ ఇచ్చిన స‌ర్కార్

VNS

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో (Andhra Pradesh) ఇవాల్టి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు (Private liquor shops) ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని దక్కించుకున్న వారు.. నేటి నుంచే వ్యాపారం మొదలు పెట్టనున్నారు. వారంతా తొలి విడత లైసెన్సు రుసుముల కింద ప్రభుత్వానికి రూ.330 కోట్లు చెల్లించారు.

BJP MLA Rakesh Reddy: వీడియో ఇదిగో, హిందువుకు మగతనం లేదు, హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా చీము, నెత్తురు లేనోళ్లే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vikas M

బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.

Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ లోకల్ MMTS రైలులో ప్రమాదకర స్టంట్స్ చేసిన పిల్లలు, ఏ మాత్రం బెడిసికొట్టినా ప్రాణాలు గాలిలోకే..

Vikas M

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది హైదరాబాద్ MMTS రైలుకి సంబంధించినది. ఈ వీడియోలోకాచిగూడ నుండి చందానగర్ కు వెళ్తున్న లోకల్ MMTS రైలులో పిల్లలు స్టంట్లు చేస్తూ కనిపించారు.

Advertisement

YS Jagan: వీడియో ఇదిగో, జగన్‌తో సెల్ఫీ దిగాలని సెక్యూరిటీని తోసుకుంటూ దూసుకొచ్చిన అభిమాని, తరువాత ఏమైందంటే..

Hazarath Reddy

బెంగళూరు నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి జగన్ మోహన్ రెడ్డి చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్‌కు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, దేవినేని అవినాష్, లేళ్ల అప్పి రెడ్డి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Kakani on Jamili Elections: చంద్రబాబు ప్రభుత్వం ఉండేది రెండేళ్లే, జమిలీ ఎన్నికలు వస్తే ఇంటికి వెళ్ళక తప్పదని తెలిపిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, టీడీపీ నేతలు చెప్పినట్టుగా చేయవద్దని అధికారులకు హెచ్చరిక

Hazarath Reddy

జమిలి ఎన్నికలపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు జరిగేట్టయితే, టీడీపీ ఇక రెండేళ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని అన్నారు

Weather Forecast: ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం ముప్పు, పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్, నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది.

Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసుపై స్పందించిన ఏపీ డీజీపీ, అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వెల్లడి

Hazarath Reddy

బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీసు జారీ అయింది. దీంతో ఆయనను ఢిల్లీ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

Advertisement
Advertisement