రాష్ట్రీయం

TSRTC Waives Reservation Fees: దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. 8 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకుంటే రిజర్వేషన్‌ ఫీజు మినహాయింపు

Rudra

దూరప్రాంత ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 8 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకుంటే రిజర్వేషన్‌ ఫీజును మినహాయిస్తున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

KCR Sensational Comments: నిరోద్ లు అమ్ముకోమ్మ‌ని కాంగ్రెస్ నేత‌లంటే ఈసీకి క‌నిపించ‌దా? నా యాత్ర‌తో కాంగ్రెస్, బీజేపీల‌కు గుండెల్లో వ‌ణుకు పుడుతోంద‌న్న కేసీఆర్, ఈసీ నిషేదం ముగిసిన త‌ర్వాత తొలి రోడ్ షో

VNS

నా బ‌స్సు యాత్ర‌తో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెలు వ‌ణుకుతున్నాయ‌ని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR Sensational Comments) స్ప‌ష్టం చేశారు. ఇద్ద‌రు కుమ్మ‌క్కై న‌న్ను నిలువ‌రించాల‌ని నా ప్ర‌చారంపై నిషేధం విధించారు అని కేసీఆర్ తెలిపారు.

Graduate BRS MLC Candidate: ఎమ్మెల్సీ అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల స్థానం నుంచి బ‌రిలోకి దిగేది ఆయ‌నే!

VNS

న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ఏనుగుల‌ రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2023, న‌వంబ‌ర్ 4వ తేదీన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో రాకేశ్ రెడ్డి గులాబీ కండువా క‌ప్పుకున్నారు.

Heavy Rain In Tirumala: మండుతున్న ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం, తిరుమ‌ల కొండ‌పై కుండ‌పోత వ‌ర్షం, గాలి దుమారంతో విరిగిప‌డ్డ చెట్లు

VNS

తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలివానతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో వాతారణం చల్లబడింది. మాడు పగిలేలా ఉన్న మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం వర్షం కురవడంతో రిలీఫ్ పొందారు.

Advertisement

Hyderabad Shocker: దారుణం, ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసి ఘోరంగా హింసించిన భార్య, ఘట్కేసర్ పరిధిలో ఘటన

Hazarath Reddy

మేడ్చల్ - ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది.భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా, కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య మూడు రోజుల క్రితం పట్టుకొచ్చి గొలుసులతో కట్టి ఇంట్లో బంధించింది.

Heatwave Alert in Telugu States: 6వ తేదీ తర్వాత వాతావరణం చల్లబడుతుందని తెలిపిన ఐఎండీ, నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు, ఏకంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు

Hazarath Reddy

భగభగ మండే ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 18 జిల్లాలో ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది

Andhra Pradesh: స్కూటీని మందు షాపుగా మార్చిన వృద్ధుడు, 100 క్వార్టర్ల తెలంగాణ మందును ఏపీకి తీసుకెళుతూ నందిగామలో పట్టుబడిన గోపయ్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్టీఆర్ - నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలిస్తుండగా పోలీసులకు చిక్కాడు. స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలిస్తుండగా పోలీసుల చేతికి దొరికాడు. నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న పోలీసులు.. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మందు సీసాలు స్వాధీనం.

Viveka Murder Case: వివేకా హత్య కేసు, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు, అవినాష్‌రెడ్డిపై దస్తగిరి వేసిన పిటిషన్‌ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

Advertisement

Leopard in RGIA Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో కలకలం రేపిన చిరుత ఎట్టకేలకు బోనులోకి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ RGIA విమానాశ్రయం సమీపంలో దారితప్పిన చిరుతపులి ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున బోనులో చిక్కుకుంది. చిరుతపులి కోసం అటవీ శాఖ అధికారులు గత 5 రోజులుగా వెతుకుతున్నారు, చిరుతను ట్రాప్ చేయడానికి 5 బోనులు మరియు 20 కెమెరాలను ఏర్పాటు చేశారు.

Kinnera Mogulaiah: ప్రభుత్వం నుంచి ఆగిపోయిన గౌరవ వేతనం, పొట్ట కూటి కోసం కూలి అవతారం ఎత్తిన పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య

Hazarath Reddy

పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మొగులయ్య రోజువారి కూలీగా మారారు. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందరూ సానుకూలంగా స్పందించినప్పటికీ వారు ఏమీ చేయడం లేదని ఆయన చెప్పారు. మొగులయ్య హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌లోని ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించాడు.

Telangana Elections 2024: వీడియో ఇదిగో, స్పెషల్ జాకెట్ ధరించి రూ. 20 లక్షల నగదును తరలిస్తున్న వ్యాపారిని పట్టుకున్న పోలీసులు

Hazarath Reddy

ఖమ్మం - పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్‌పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా, వ్యక్తి రెండు చొక్కాలు తొడుక్కుని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో 20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని దాచాడు. ఖమ్మం రూరల్ సీఐ ఆ వ్యక్తి దగ్గర నుండి అ నగదును మరియు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Rain Alert For Telangana: వ‌డ‌గాల్పుల‌తో బెంబేలెత్తుతున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్, వ‌ర్షాల‌పై కీలక స‌మాచార‌మిచ్చిన ఐఎండీ

VNS

ఈ నెల 6న రాష్ట్రం నుంచి పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం (Rains In Telangana) నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.

Advertisement

Andhra Pradesh Elections 2024: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు, 14 సమస్యాత్మక నియోజకవర్గాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్, విజయవాడలో ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

మే 13న లోక్ సభ, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 64 శాతం పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు.

Amit Shah Fake Video Case: అమిత్ షా ఫేక్ వీడియో కేసు, తెలంగాణలో 5 మంది కాంగ్రెస్ నేతలు అరెస్ట్

Hazarath Reddy

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్‌కు చెందిన ఐదుగురు సభ్యులను తెలంగాణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసుల బృందం తెలంగాణలో కూడా ఉంది. అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Heatwave Alert: మూడు రోజులు బయటకు రాకండి, ఏపీతో పాటు ఈ రాష్ట్రాలకు తీవ్ర హీట్‌వేవ్ హెచ్చరిక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

భారత వాతావరణ శాఖ (IMD) అనేక రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్, ఈశాన్య ఐదు రాష్ట్రాల్లో ఈరోజు, మే 2 న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మే నెలలో మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Orange Alert For Telangana: 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్ర‌త‌లు, తెలంగాణలో 13 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, వారం రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రం అంతటా ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంప‌రేచ‌ర్ న‌మోదు అయ్యింది. రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు, కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 6కి వాయిదా, కోర్టులో వాదనలు ఎలా సాగాయంటే..

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ (CBI) కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇదిగో, ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజి స‌ర్కిల్ వ‌ర‌కు రోడ్‌షో

Hazarath Reddy

ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి బీజేపీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఎన్‌డీఏ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌డానికి ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల‌ 7, 8 తేదీలలో రోడ్ షో, సభలు నిర్వహించనున్నారు.

Andhra Pradesh Elections 2024: జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాగేసుకునేవాడు కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వివరణ ఇచ్చిన సీఎం జగన్

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Andhra Pradesh Elections 2024: జగన్‌కు అండగా నిలవండి, ఏపీ ముస్లిం ఓటర్లను కోరిన అసదుద్దీన్ ఒవైసీ, చంద్రబాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతమే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని వైసీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు.

Advertisement
Advertisement