రాష్ట్రీయం

Attack on Bandi Sanjay with Eggs: వీడియో ఇదిగో, బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడి, పోలీసు బందోబస్తు నాకు ఏమీ వద్దని కోరిన కరీంనగర్ ఎంపీ

Hazarath Reddy

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ వరంగల్‌ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్‌ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడికి చేశారు.

Kadiyam Srihari Slams CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మగతనం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్, నీ మగ తనాన్ని నిరూపించుకోమని సవాల్

Hazarath Reddy

తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మరి కొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంటోంది. నిన్న చేవెళ్ల జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీఆర్ఎస్ నేతలను, కేటీఆర్ ను మగాడివైతే వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలిపించి చూపించు అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Gollapally Surya Rao Resigns TDP: రాజోలులో టీడీపీకి షాక్, పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

టీడీపీకి మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ TDP ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు పార్టీకి రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనామా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.

Accident Caught on Cam: ఈ రోడ్డు ప్రమాదంలో తప్పెవరది? సిగ్నల్ లేని చోట రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొట్టిన బొలెరో వాహనం, అక్కడికక్కడే మృతి, సీసీటీవీ ఫుటేజీ వీడియో ఇదిగో..

Hazarath Reddy

సోషల్ మీడియాలో తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ద్విచక్రవాహనంలో రోడ్డు దాటుతుండగా యువకుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం అక్కడున్న సీసీటీవీ పుటీజీలో రికార్డు అయింది.

Advertisement

Magunta Srinivasulu Reddy Resigns YCP: వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు ఎంపీ బరిలో కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి ఉంటారని వెల్లడి

Hazarath Reddy

ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైసీపీకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.

Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, మరో 12 మందికి గాయాలు

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోతేకు దగ్గరలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Telangana Inter Exams 2024: ఇంటర్ పరీక్షలకు తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని వెనక్కి పంపిన అధికారులు, కంటతడి పెట్టుకున్న అమ్మాయి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని పావని 9:09 నిమిషాలకు రాగా.. అధికారులు వెనక్కు పంపించగా అమ్మాయి కంటతడి పెట్టుకుంది.

Quthbullapur Fire Accident: కుత్బుల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో చెల‌రేగిన మంట‌లు, స‌కాలంలో స్పందించ‌డంతో త‌ప్పిన ప్రాణన‌ష్టం (వీడియో ఇదుగో)

VNS

మేడ్చ‌ల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లో (Quthbullapur) భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో రాత్రి మంట‌లు చెల‌రేగాయి. అవి కాస్తా అపార్ట్ మెంట్ మొత్తం వ్యాపించ‌డంతో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. అయితే మంట‌లు చెల‌రేగిన వెంట‌నే అందులో ఉన్న‌వాళ్లు బ‌య‌ట‌కు ప‌రుగులు తీయ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది.

Advertisement

Telangana weather Alert: తెలంగాణ‌లో దంచికొడుతున్న ఎండ‌లు, నేటి నుంచి పెరుగ‌నున్న‌ మూడు డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు, మార్చి రెండో వారం నుంచి ఎండాకాలం షురూ

VNS

తెలంగాణలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు (Temperatures) మరింత పెరుగుతాయని పేర్కొన్నది.

Telangana Intermediate Board Exams: తెలంగాణలో మొద‌లైన ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌లు, మార్చి 19వ‌ర‌కు వ‌రుస ఎగ్జామ్స్, విద్యార్ధులు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లివే!

VNS

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board Exams) ఏర్పాట్లు చేసింది. పరీక్షల పర్యవేక్షణ కోసం 1521 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు. 27,900 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష విధుల్లో ఉండబోతున్నారు.

CM Revanth Reddy Slams KTR: వీడియో ఇదిగో, కేటీఆర్ సన్నాసి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు మొగోడివైతే ఒక్క సీటు గెలిపించి చూపించు అని సవాల్

Hazarath Reddy

చేవెళ్లలో జన జాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో పాటు ఆ పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డా... నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుంటాం బిడ్డా' అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Andhra Pradesh Elections 2024: వచ్చే 45 రోజుల్లో ఏపీలో ఎన్నికలు, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, 175కి 175 స్థానాలు గెలవాల్సిందేనని వైసీపీ కార్యకర్తలకు సూచన

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వేడీ మొదలైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో ఈ రోజు సాయంత్రం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం ‘మేం సిద్ధం- మా బూత్ సిద్ధం’ సమావేశంలో (booth-level worker meets) ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 45 రోజుల్లో ఎన్నికలు (Andhra Pradesh Elections 2024) జరగబోతున్నాయి

Advertisement

Mahalakshmi Scheme in Telangana: సోనియా గాంధీ హామీ ఇస్తే శిలాశాసనం, తప్పక అమలు చేసి తీరతామని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మహాలక్ష్మి, గృహ జ్యోతి ప్రారంభం

Hazarath Reddy

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme in Telangana) ద్వారా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను రాష్ట్ర సచివాలయంలో ఆయన ప్రారంభించారు.

Andhra Cricket Controversy: రాజకీయ రంగు పులుముకున్న హనుమ విహారి-ఆంధ్రా క్రికెట్ వివాదం, అతనికి అండగా ఉంటామని తెలిపిన చంద్రబాబు, వైఎస్ షర్మిల

Hazarath Reddy

వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు.హనుమ విహారిని వేధించారని అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు

Andhra Pradesh Elections 2024: మహాసేన రాజేష్‌కి టికెట్‌ ఇవ్వడంపై మండిపడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, టీడీపీ నేత హరీష్‌ మాధుర్‌ కారు ధ్వంసం

Hazarath Reddy

కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ-జనసేన సమావేశం రసాభాసగా మారింది. మహాసేన రాజేష్‌కి పి గన్నవరం టికెట్‌ కేటాయింపుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజేష్‌ గోబ్యాక్‌’ అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

Mahalakshmi Scheme Guidelines: తెల్లరేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే రూ. 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

అర్హులైనవారికి రూ 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్‌ను రేవంత్ సర్కారు విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ‘మహాలక్ష్మి’లో మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

Advertisement

Fact Check on Floating Bridge Washed Away: విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందనేది అబద్దం, తప్పుడు ప్రచారాన్ని ఖండించిన VMRDA, అలల ఉధృతి అధికంగా ఉంటే జాయింట్ తొలగింపు చేస్తామని క్లారిటీ

Hazarath Reddy

బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందంటూ సోషల్ మీడియాలో సృష్టించిన కథనాలన్నీ ఫేక్ అని VMRDA క్లారిటీ ఇచ్చింది . ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్వహణలో భాగంగా జరిగిన మాక్ డ్రిల్ అది అని విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్ మెంట్ (VMRDA) కమిషనర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

Telangana: కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ఇన్వర్టర్స్ నుండి రివర్స్ పవర్, విద్యుత్ స్తంభం పై నుండి పడ్డ ఔట్ సోర్సింగ్ హెల్పర్, తలకు బలమైన గాయాలు

Hazarath Reddy

నారాయణపేట - జిల్లా కేంద్రంలోని సరాఫ్ బజార్ ప్రాంతంలో లైన్‌మెన్‌కు చెప్పకుండా ఔట్ సోర్సింగ్ హెల్పర్ అల్లావుద్దీన్ కరెంటు స్తంభం ఎక్కి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నాడు. పవర్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ ఆ ఏరియాలో ఉండే ఇన్వర్టర్స్ నుండి రివర్స్ పవర్ రావడంతో ప్రమాదం జరిగింది.

Andhra Pradesh Elections 2024: ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు రూ.5000 ఇస్తాం, సంచలన ప్రకటన చేసిన మల్లిఖార్జున ఖర్గే

Hazarath Reddy

ఏపీలో కాంగ్రెస్ గెలిస్తే ప్రతి నెలా, ప్రతి కుటుంబానికి రూ.5000 ఇస్తామని పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ సపోర్ట్ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.5,000 ఇస్తామని ఆయన అన్నారు.

Gajuwaka Fire Video: విశాఖ గాజువాకలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన మూడు ఫ్లోర్లు, భారీగా ఆస్తి నష్టం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ ఇంజిన్లు

Hazarath Reddy

విశాఖలోని గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి.

Advertisement
Advertisement