రాష్ట్రీయం
ACB Raid in Hyd: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్‌ జ్యోతి లంచం కేసు, రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అనంతరం అరెస్ట్
Hazarath Reddyఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా రూ.65 లక్షల నగదు, మూడున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోనూ కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Hyderabad Traffic Police: మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా, ట్రాఫిక్ రూల్స్‌పై హైదరాబాద్ పోలీసుల సంధర్భోచిత ట్వీట్ ఇదిగో.,
Hazarath Reddyహైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్విటర్‌లో ట్రాఫిక్ రూల్స్ మీద ఓ ట్వీట్‌ చేశారు. రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ ఫేమస్ డైలాగ్ అందులో యాడ్ చేశారు. హెల్మెట్ లేని వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ.. మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’ అంటూ క్యాప్షన్ రాశారు.
Andhra Pradesh Elections 2024: వైరల్ అవుతున్న ఏపీ ఎన్నికల షెడ్యూల్‌ అంతా ఫేక్, ఎవరూ నమ్మవద్దని తెలిపిన రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫేక్‌న్యూస్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.ఏపీ సీఈవో పేరుతో ఫేక్ షెడ్యూల్ ప్ర‌చారంలో ఉంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తాజాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.
CM Jagan Hugs RK Video: వీడియో ఇదిగో, ఆర్కేని ఆత్మీయంగా కౌగిలించుకున్న సీఎం జగన్, మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు పనిచేస్తానని హామీ
Hazarath Reddyమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆత్మీయంగా కౌగిలించుకున్నారు
Andhra Pradesh Horror: నెల్లూరు జిల్లాలో దారుణం, భార్య కళ్ల ముందే భర్తను 25 సార్లు కత్తితో పొడిచిన దుండగులు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Hazarath Reddyనెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాడిపూడి పెంచల ప్రసాద్‌ అనే యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను హతమార్చినట్లు తెలుస్తోంది.
Tirupati IIT & Visakha IIM: తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంల ప్రాంగణాలను ప్రారంభించిన మోదీ, వర్చువల్‌గా హాజరైన సీఎం జగన్, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌
Hazarath Reddyవిభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), తిరుపతి జిల్లాలో నెలకొల్పిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఐసర్‌ ప్రాంగణాలను ప్రధాని మోదీ జమ్మూ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు
Alla Ramakrishna Reddy Joins YSRCP: ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి, వైసీపీలో చేరిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు, ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడి
Hazarath Reddyమంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు, ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు.
Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyగత ఏడాది రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్‌ కండువా కప్పి ఆర్కేను పార్టీకి ఆహ్వానించారు.
Medaram Jathara 2024: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్, కిటకిటలాడుతున్న బస్సులు, జన సంద్రమైన మేడారం, ప్రయాణికుల అసౌకర్యంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
Hazarath Reddyఒక మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులను దాదాపుగా తరలించిన నేపథ్యంలో.. ప్రయాణికులు ఇబ్బందులు (inconvenience of RTC passengers) పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ (TSRTC Managing Director Sajjanar) విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh Elections 2024: వైఎస్సార్‌సీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ గెలుపు బాధ్యతల్ని అప్పగిస్తారని వార్తలు..
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది నెలల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ నుండి గెలిచి ఆ తర్వాత రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) మళ్లీ వైసీపీలో చేరనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ACB Raids in Telangana: ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక లంచాలకు అలవాటు, రూ. 84 వేలు తీసుకుంటూ అడ్డంగా ఏసీబీ అధికారులకు దొరికిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌
Hazarath Reddyమాస‌బ్‌ట్యాంక్‌లోని ట్రైబ‌ల్ వెల్ఫేర్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న కే జ‌గ జ్యోతి ఏసీబీ ధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. ఓ కాంట్రాక్ట‌ర్ నుంచి రూ. 84 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు
Hyderabad: ఈ మహిళ పాలిట దేవుడైన డ్రైవర్, కదులుతున్న బస్సు ఎక్కుతూ కిందపడిన మహిళ, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyహైదరాబాద్ లో ఓ మహిళ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో ఓ మహిళ బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు అకస్మాత్తుగా బయలుదేరింది.
Telangana Fire: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, మంటల ధాటికి పేలిన 5 గ్యాస్‌ సిలిండర్లు, అగ్నికి ఆహుతైన 50 పూరిళ్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyకరీంనగర్‌లో జగిత్యాల రహదారిలోని సుభాష్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు
Andhra Pradesh: వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా 5వ విడత నిధులు విడుదల, రూ. 78.53 కోట్ల సాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లో వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్
Hazarath Reddyసంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు వెళుతున్న ఏపీ సర్కారు నేడు వైఎస్సార్‌ కల్యాణమస్తు (YSR Kalyanamasthu), వైఎస్సార్‌ షాదీ తోఫా సాయానికి సంబంధించిన 5వ విడత నిధులను విడుదల చేసింది. మంగళవారం వైఎస్సార్‌ కల్యాణమస్తు.. వైఎస్సార్‌ షాదీ తోఫా ఐదో విడత నిధుల్ని బటన్‌ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో సీఎం (CM YS Jagan Mohan Reddy) జమ చేశారు
Hyderabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడిన కారు, ఇద్దరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని నార్సింగి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో వాహనంలో ఐదుగురు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Car Caught Fire Video: కూకట్‌పల్లిలో కదులుతున్న కారులో మంటలు, భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ లో కారులో మంటలు చెలరేగాయి. కూకట్‌పల్లి జేఎన్‌టీయూ దగ్గర కదులుతున్న కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్థానికులు భయంతో పరుగులు తీసారు. వెంటనే మరికొందరు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ACB Raid in Hyderabad: రూ. 84 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన మహిళా ఇంజినీర్.. ఆపై కన్నీళ్లపర్యంతం.. (వీడియో)
Rudraహైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తోన్న జగత్ జ్యోతి లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. పంటి చికిత్సకు వెళ్తే ఏకంగా ప్రాణం పోయింది.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడి ఇంట్లో విషాదం.. డెంటల్‌ దవాఖాన నిర్వాహకులపై కేసు.. అసలేం జరిగింది??
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. పంటి చికిత్స కోసం డెంటల్‌ దవాఖానకు వెళ్లిన యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు చనిపోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, పెళ్ళి చేసుకుందామని నమ్మించి మైనర్ బాలికపై అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyఅమీర్‌పేటలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ (19) అనే నిందితుడు పటాన్‌చెరుకు చెందిన 16 ఏళ్ల యువతితో సోషల్‌ మీడియా ద్వారా స్నేహం చేశాడు. అతను ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేసి, కొన్ని నెలల క్రితం ఆమెను ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
KA Paul Slams Nara Lokesh: జనసేన పార్టీని కుక్కతో పోల్చిన కేఏ పాల్, ఎవడికి కావలిరా నీ అపాయింట్మెంట్ అంటూ నారా లోకేష్ మీద ఫైర్, విశాఖ నుంచి ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడి
Hazarath Reddyప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ జనసేన పార్టీపై దాని అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ యువనేత నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్ల కోసం జనసేన టీడీపీకి కుక్కలాగా అమ్ముడుపోయిందన్నారు. ‘ఎవడికి కావాలిరా నీ అపాయింట్‌మెంట్’ అంటూ నారా లోకేష్‌పై కేఏ పాల్ విరుచుకుపడ్డారు