రాష్ట్రీయం

New IPS Officers For Telugu States: తెలుగు రాష్ట్రాలకు 9 మంది కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, ఏపీకి ముగ్గురు, తెలంగాణకు ఆరుగురు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు 9 మంది కొత్త ఐపీఎస్‌ అధికారుల్ని కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు.. తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఈ అధికారులంతా 2022 బ్యాచ్‌కు చెందిన వాళ్లు.

Security Guard Stuck in Lift: లిఫ్టులో చిక్కుకుని విలవిలలాడిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డు, రెండు కాళ్లు బయట బాడీ లోపల..

Hazarath Reddy

Sankranti Celebrations: వీడియో ఇదిగో, అల్లుడికి 300 రకాల వంటలు వడ్డించిన అత్తింటివారు

Hazarath Reddy

సోమవారం మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో సాయి గోపాల్ కుటుంబం వారి కొత్తగా పెళ్లయిన కూతురు రిషిత మరియు అల్లుడు దేవేంద్రకు 300 ఆహార పదార్థాలను వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Sankranti Celebrations: వీడియోలు ఇవిగో, కోడిపందాల బెట్టింగ్, ఎన్టీఆర్ జిల్లాలో రక్తమొచ్చేలా తన్నుకున్న ఇరు వర్గాలు, పోలీసులు రావడంతో పరార్..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాల బెట్టింగ్ సందర్భంగా గ్రూప్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన వారిని చెదరగొట్టారు

Advertisement

Woman Dies of Cardiac Arrest: షాకింగ్ వీడియో ఇదిగో, భోగి వేడుకల్లో కోలాటం వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ, గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన రాజమణి (40) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

World Economic Forum 2024: అదానీ గ్రూప్‌తో రూ.12,400 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం, దావోస్‌లో మూడో రోజు కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Hazarath Reddy

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు.

Kishan Reddy Cleaning Temple Video: వీడియో ఇదిగో, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చెత్తను ఊడ్చి చేతులతో ఎత్తేసిన కిషన్ రెడ్డి, స్వయంగా విగ్రహ మూర్తుల్ని శుద్ధి చేసిన కేంద్ర మంత్రి

Hazarath Reddy

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్ బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.

Hyderabad Fire: కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం, డ్రమ్స్ కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఈ రోజు తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. నేతాజీన‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి. కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంతంలో పొగ‌లు ద‌ట్టంగా అలుముకున్నాయి.

Advertisement

Power Cuts in Hyderabad: నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు హైదరాబాద్‌లో రెండు గంటలు కరెంట్ కోతలు, వివరాలు http://tssouthernpower.com వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని విద్యుత్ అధికారులు సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు రోజూ రెండు గంటలు కరెంట్ కోతలు (Two hours of power cuts in Hyderabad) అమల్లోకి రానున్నాయని విద్యుత్ అధికారులు ప్రకటించారు. వార్షిక నిర్వహణ, మరమ్మత్తు పనుల్లో భాగంగా ఈ కోతలను అమలు చేస్తున్నట్లు TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు

SC on Hate Speech in Rallies: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ర్యాలీలో ద్వేషపూరిత ప్రసంగాలు జరగకుండా చూడండి, జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

హిందూ జనజాగృతి సమితి, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు టి రాజా సింగ్‌లు నిర్వహించే ర్యాలీలలో విద్వేషపూరిత ప్రసంగాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసిన తరువాత, మహారాష్ట్రలోని యవత్మాల్ మరియు రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని జిల్లా మేజిస్ట్రేట్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది.

GVL Rode Rickshaw Video: వీడియో ఇదిగో, విశాఖ వీధుల్లో రిక్షా తొక్కిన జీవీఎల్, రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించిన బీజేపీ ఎంపీ

Hazarath Reddy

విశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రిక్షావాలాను కూర్చోబెట్టి రిక్షా తొక్కారు.తర్వాత రిక్షావాలాకు కొంత డబ్బు కూడా ఇచ్చి వాళ్లతో ముచ్చటించారు

Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం, ఇల్లు శుభ్రం చేద్దామని పిలిచి భార్య తల నరికి మొండెం వేరు చేసి పరారైన భర్త, పోలీసుల అదుపులో నిందితుడు..

Hazarath Reddy

హైదరాబాద్ లో అబ్దుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.అనుమానంతో పాటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా హత్యచేసి తల, మొండెం వేరు (Beheads Her Over Suspicion of Affair) చేశాడు.

Advertisement

PM Modi Inaugurates NACIN: పాల సముద్రంలో నాసిన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయిందని తెలిపిన భారత ప్రధాని

Hazarath Reddy

ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది... రాముడు సామాజిక జీవితంలో పాలన మరియు సుపరిపాలనకు ప్రతీక, ఇది మీ సంస్థకు కూడా గొప్ప ప్రేరణగా మారుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.నాసిన్‌ను రిమోట్‌ నొక్కి భారత ప్రధాని ప్రారంభించారు.

PM Modi on Lord Ram: ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయిందని తెలిపిన ప్రధాని మోదీ, నాసిన్‌ను రిమోట్‌ నొక్కి ప్రారంభించిన భారత ప్రధాని

Hazarath Reddy

ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది... రాముడు సామాజిక జీవితంలో పాలన మరియు సుపరిపాలనకు ప్రతీక, ఇది మీ సంస్థకు కూడా గొప్ప ప్రేరణగా మారుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.నాసిన్‌ను రిమోట్‌ నొక్కి భారత ప్రధాని ప్రారంభించారు.

PM Modi Address in AP: పాలసముద్రంలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, పన్నుల రూపంలో చెల్లించే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపిన ప్రధాని

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని పాలసముద్రంలో జరిగిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ పన్నుల రూపంలో చెల్లించే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఐటీ చెల్లింపుల విధానాన్ని సరళతరం చేశామని తెలిపారు. పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటీకేడు పెరుగుతుందని అన్నారు.

PM Modi at NACIN:  వీడియో ఇదిగో, నాసిన్ క్యాంపస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ, మరి కాసేపట్లో అకాడమీని ప్రారంభించనున్న భారత ప్రధాని 

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా, పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు నార్కోటిక్స్ (NACIN) యొక్క కొత్త అత్యాధునిక క్యాంపస్‌ను సందర్శించిన ప్రధాని మోదీ. అక్కడి విషయాలను ప్రధాని మోదీకి వివరించిన అధికారులు

Advertisement

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా, ఏపీ పీసీసీ చీఫ్ నియామకం తర్వాత షర్మిల ఆసక్తికర ట్వీట్

Hazarath Reddy

షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

PM Modi in Lepakshi Temple: వీడియో ఇదిగో, శ్రీ రామ జయ రామ అంటూ భగవంతునికి భజన చేసిన ప్రధాని మోదీ, లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

Hazarath Reddy

వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని మోదీకి ఆలయ అధికారులు ప్రత్యేకంగా చూపించారు.

PM Modi in Lepakshi Temple: వీడియో ఇదిగో, లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోదీ, శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ..

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో ప్రధానమంత్రి ‘శ్రీ రామ.. జయ రామ’ అని చప్పట్లు కొడుతూ.. వేదపండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు.

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల, అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

Advertisement
Advertisement