ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: వీడియో ఇదిగో, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పీఠంపై ఉన్న జగన్ పేరును తొలగించిన అధికారులు, పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరని వైసీపీ నేతలు మండిపాటు

Hazarath Reddy

విజయవాడ స్వరాజ్య మైదానంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ న్యాయ మహాశిల్పం పీఠంపై ఏర్పాటు చేసిన మాజీ సీఎం జగన్‌ పేరును అర్ధరాత్రి లైట్లు ఆపేసి తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసుల సమక్షంలోనే నగరపాలక సిబ్బంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన‌ జగన్ పేరు తొలగించడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, కడపలో మహిళలు షాపులో చీరలను ఎంత స్మార్ట్‌గా దొంగిలించారో మీరే చూడండి

Hazarath Reddy

ఏపీలోని కడపలో ఓ వస్త్ర దుకాణంలో బట్టలు దొంగిలించినందుకు ఐదుగురు మహిళలపై కేసు నమోదైంది. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీలో మహిళలు వారు ధరించిన చీరల వెనుక దొంగిలించిన చీరలను దాచిపెట్టారు. వీడియోలో, ఐదుగురు మహిళలు షాప్‌లోకి ప్రవేశించి.. చీరలను చూడటం ప్రారంభించారు.

Alla Nani Quits YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా వెళుతున్నానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) రాజీనామా చేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Andhra Pradesh: మన్యం జిల్లాలో అభివృద్ధి ఎక్కడ? రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న వందలాది మంది కూలీలు

Hazarath Reddy

అల్లూరీ సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీలో భారీ వర్షాలు..వి.అర్.పురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. నాటుకు వెళ్లిన కూలీలు భారీ వర్షానికి తిరిగి వస్తుండగా, సాయంత్రం వరకు వేచి చూసిన వాగు ఉధృతి తగ్గకపోవడంతో ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు.

Advertisement

Chandrababu Dance Video: చంద్రబాబు డ్యాన్స్ వీడియో ఇదిగో, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహిళలతో కలిసి నృత్యం చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం.. అనంతరం డప్పు వాయించారు

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య, భార్య వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం

Arun Charagonda

విజయనగరం జిల్లా రాజాం మండలం ఇల్లంనాయుడులో విషాదం చోటు చేసుకుంది. ఘంటసాల సత్యాధర్, భార్య తనని వదిలి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Andhra pradesh Shocker: సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన రైతు, ఓటీపీ మెస్సెజ్‌ లింక్ ఓపెన్‌ చేయడంతో జరిగిన నష్టం, 1930కి కాల్, రంగంలోకి పోలీసులు

Arun Charagonda

ఓ రైతు టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ లోని పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన యలమంచిలి బాబ్జి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌లో సేవింగ్‌ అకౌంట్‌ ఉండగా ఈనెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌కి ఓటీపీ మేసేజ్‌లు వచ్చాయి.

Nag Panchami 2024: నేడు నాగ పంచమి.. ఈ పర్వదినంనాడు మీ బంధువులకు, స్నేహితులకు, లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి

Rudra

నేడు నాగ పంచమి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు తన బాల్యంలో కాళీయనాగుని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు.

Advertisement

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినులతో ఇంగ్లీష్ టీచర్ అసభ్యకర ప్రవర్తన, చెప్పులతో చితకబాదిన తల్లితండ్రులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడి మోడల్ స్కూల్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ అడ్డదారి తొక్కాడు. స్కూలులో పనిచేసే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మండిపడిన తల్లిదండ్రులు అతగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. చెప్పులతో ఎడాపెడా వాయించి పడేశారు.

Andhra Pradesh Rain Update: ఏపీకి మరో మూడు రోజులు అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక, దంచికొడుతున్న వానలు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు పరిసరాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాలపై విస్తరించి ఉన్న మరో ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Pawan Kalyan Meets CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ భేటీ, ఎందుకో తెలుసా?

Arun Charagonda

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లాలో ఏనుగులు గ్రామాల్లోకి వస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అంతేగాదు ఏనుగుల దాడిలో పలువురు ప్రాణాలు కొల్పోయే పరిస్థితి వచ్చింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త కిడ్నాప్, బొలెరో వాహనంలో కత్తులతో వచ్చి మరీ..

Hazarath Reddy

పల్నాడుజిల్లాలోని బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా ప్రత్యర్థులు తీసుకెళ్లారు. ఆటోను అడ్డగించి నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు.

Advertisement

Prakasam Barrage Gates Lifted: వీడియో ఇదిగో, ప్రకాశం బ్యారేజ్‌ 70 గేట్లు ఎత్తివేత, కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

Hazarath Reddy

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది.కృష్ణా నది దిగువన ప్రకాశం బ్యారేజీ వద్ద బుధవారం వరద ఉద్ధృతి నెలకొంది. బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లను ఎత్తారు. రాత్రి తొమ్మిదింటికి ఎగువ నుంచి 1,51,948 క్యూసెక్కులకు వరద పెరిగింది. 50 గేట్లను మూడు అడుగులు, మిగతా 20 గేట్లను రెండు అడుగులు మేర ఎత్తారు.

Andhra Pradesh Horror: ఏలూరు జిల్లాలో మరో దారుణ హత్య, భార్యను నరికి చంపి ఇంటి ముందే కత్తితో కూర్చున్న భర్త, విడాకుల గొడవలో బలైన ఇల్లాలు

Hazarath Reddy

సాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

Bitthiri Satthi: భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై స్పందించిన బిత్తిరి సత్తి (వీడియో)

Rudra

భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై బిత్తిరి సత్తి స్పందించారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Shyam Prasad Reddy: ప్రముఖ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఇంట విషాదం.. సతీమణి వరలక్ష్మి కన్నుమూత

Rudra

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌ టైన్స్‌ మెంట్‌ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీసులు డబ్బుతో పాటు ఫోన్ లాక్కున్నారంటూ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్

Hazarath Reddy

తన ఫోన్ పోలీసులు తీసుకున్నారని ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన వ్యక్తి హల్ చల్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మావుళ్ళు అనే వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి స్థానికులను భయభ్రాంతలకు గురి చేశాడు. తన సెల్ ఫోన్, డబ్బులు పోలీసులు తీసుకున్నారంటూ అవి ఇస్తేగాని దిగనంలూ మావుళ్ళు డిమాండ్ చేశారు. పోలీసులు అతన్ని బతిమాలి క్రిందకు దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Andhra Pradesh Horror: ఏపీలో ఆగని హత్యలు, చీరాలలో నడిరోడ్డుపై యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

కారులో వచ్చిన గుర్తు తెలియని కొందరు యువకులు బైకును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తితో దాడి చేయగా రోడ్డుపై రక్తపు గాయలతో పడివున్న ఆరిఫ్ ను చీరాల ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతిచెందారు.

Road Accident in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, నుజ్జునుజ్జు అయిన ఇద్దరి మృతదేహాలు

Hazarath Reddy

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ చివరి రోడ్డుపై చివరి మలుపు వద్ద ద్విచక్క వాహనం అదుపుతప్పడంతో దానిపై వెళుతున్న ఇద్దరు కిందపడ్డారు. కిందపడ్డ వారిపై నుంచి వెనకనుంచి వస్తున్న బస్సు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాపిక్ జాం అయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి.

Pendem Dorababu Resigns YSRCP: వైసీపీకి షాకిచ్చిన ఇద్దరు నేతలు, పిఠాపురంలో పెండెం దొరబాబు రాజీనామా, అనంతపురంలో పైలా నర్సింహయ్య గుడ్ బై

Hazarath Reddy

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తన పదవికి రాజీనామా చేశారు.

Advertisement
Advertisement