ఆంధ్ర ప్రదేశ్

CM Jagan Speech in Yemmiganur: మాది పేదవాళ్ల పార్టీ, అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం, ఎమ్మిగనూరు సభలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

మేమంతా సిద్ధం బస్సు యాత్ర మూడో రోజు కొనసాగింది. 3వ రోజు కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర కొనసాగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు

Andhra Pradesh Elections 2024: అనంతపురంలో టీడీపీ ఆఫీసును తగలబెట్టిన కార్యకర్తలు, ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో మండిపడుతున్న అనుచరులు

Hazarath Reddy

అనంతపురంలో తెలుగుదేశం పార్టీ తీరుపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా అనంతపురం అర్బన్ టికెట్‌ను దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌కి కేటాయించడంతో కేడర్ భగ్గుమంది. ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్నాడని మండిపడుతూ టీడీపీ ఆఫీస్‌ను ప్రభాకర్ చౌదరి అనుచరులు ధ్వంసం చేశారు

Andhra Pradesh Elections 2024: భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు, ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ తుది జాబితా ఇదిగో..

Hazarath Reddy

పెండింగ్‌లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకూ అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది.

BTech Student Suicide in Vizag: విశాఖలో మేడపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య, ఫ్యాకల్టీ వేధింపులే కారణమంటూ సూసైడ్ లేఖ

Hazarath Reddy

ఏపీలోని విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చైతన్య కాలేజీలో చదువుతున్న రూపశ్రీ అనే బిటెక్ విద్యార్థిని మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాకల్టీ లైంగిక వేధింపులే కారణమని సూసైడ్ లెటర్ రాసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Andhra Pradesh Elections 2024: మీతో ఒక్క ఫోటో కావాలన్నా, వికలాంగ దంపతుల కోరికను మన్నించి వారితో కూర్చుని ఫోటో దిగిన సీఎం జగన్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

జగనన్న అందిస్తున్న సాయం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. జగనన్న మేలు మా జీవితంలో మరిచిపోలేమంటూ వికలాంగ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా మీతో ఒక్క ఫోటో కావాలన్నా అని అడిగిన వికలాంగ దంపతులను ఆప్యాయంగా పలకరించి జగన్ వారితో ఫోటో దిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Road Accident: ఏపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 మంది మృతి, రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో జరిగిన తొలి ప్రమాదంలో రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మహిళలు మృతి చెందారు. టంగుటూరు టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు

Andhra Pradesh Elections 2024: అనపర్తిలో సైకిల్‌ని మంటల్లో పడవేసి నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలు, టికెట్ బీజేపీకి కేటాయించడంపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి విభేధాలు భగ్గుమన్నాయి. కూటమిలో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటు బీజేపీ అభ్యర్థి ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద పడుకుని భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మ

Hazarath Reddy

బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకున్న భూపతి రాజు శ్రీనివాసవర్మ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగానికి గురైన ఆయన్ని కార్యకర్తలు ఓదార్చారు. ఆయన ఎక్స్ లో షేర్ చేసిన పోస్టులో 30 సంవత్సరాల కష్టానికి ఫలితమే ఈ గుర్తింపు అంటూ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement

CM Jagan on Drugs Seized in Visakhapatnam Port: విశాఖ పోర్టులో డ్రగ్స్ సీజ్‌పై స్పందించిన సీఎం జగన్, నిందితులు టీడీపీ వారైనప్పటికీ వైసీపీపై బురదజల్లుతున్నారని మండిపాటు

Hazarath Reddy

విశాఖపట్నం పోర్టుపై సీబీఐ దాడులు చేసి మత్తుమందు కలిపిన డ్రై ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు కోడలు, ఏపీ బీజేపీ అధినేత్రి డి.పురందేశ్వరి బంధువుకు చెందిన సరుకు కంపెనీ కావడంతో ‘ఎల్లో బ్రదర్స్‌’ షాక్‌కు గురయ్యారు

CM Jagan on Viveka Murder: చిన్నాన్న వివేకాను చంపినోడిని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

కుట్రలు, మోసాలు చేయడంలో చంద్రబాబుకి 45 ఏళ్ల అనుభవం ఉంది. వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతిదారుణంగా చంపారు. ఆ హంతకులెవరో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో

Andhra Pradesh Elections 2024: మీ అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు, మీరంతా సిద్ధమేనా అంటూ ప్రొద్దుటూర్‌ సభలో గర్జించిన సీఎం జగన్, ఏపీ ముఖ్యమంత్రి స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

వైఎస్సార్‌ జిల్లా కుటుంబ సభ్యులు ఎప్పుడూ నా వెన్నంటే ఉన్నారు. 58 నెలల పాలనలో ప్రతీ రంగంలోనూ మార్పులు తీసుకొచ్చాం.2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసిన ఘనత మనది. మద్దతుపలికే ఇంతటి ప్రజాసైన్యం మధ్య యాత్రను చేపట్టా. మీ అంతా సిద్ధమేనా? అని అన్నారు.

Andhra Pradesh Elections 2024: చేనేత కార్మికులకు 500 యూనిట్ల ఉచిత కరెంట్, చంద్రబాబు మరో సంచలన ప్రకటన, ప్రజాగళంలో వైసీపీపై విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టిన టీడీపీ అధినేత

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. నగరి,పలమనేరు ప్రజాగళం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు

Advertisement

Andhra Pradesh Elections 2024: విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, ఏపీలో బీజేపీ నుంచి పోటీ చేసే 10 మంది అసెంబ్లీ అభ్యర్థులు లిస్టు ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

Nellore Cow Sold for Rs.40 Crores: బ్రెజిల్‌లో రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు, ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డు

Hazarath Reddy

వయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ (Viatina-19 FIV Mara Imoveis) అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు బ్రెజిల్‌ వేలంలో.. ఏకంగా 4.8 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట.

Andhra Pradesh Elections 2024: రేణిగుంటలో జగన్ ఫోటోతో చీరలు, వాచీలు, రూ. 50 కోట్ల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు

Hazarath Reddy

తిరుపతి జిల్లాలోని రేణిగింటలో YSRCP నేతకు చెందినదని ఆరోపిస్తున్నగోడౌన్‌పై పోల్ అధికారులు దాడి చేసి రూ. 50 కోట్ల విలువైన చీరలు, స్పీకర్‌లు, కుక్కర్లు,.. భారీ మొత్తంలో చేతి గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై జగన్ ఫోటో ముద్రించి ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికార YSRCP ఉచితాలను పంపిణీ చేస్తోందని TDP ఆరోపించింది.

Andhra Pradesh Elections 2024: రేపటి నుండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్న సీఎం జగన్, ఇచ్ఛాపురం వరకు 21 రోజుల పాటు బస్సు యాత్ర

Hazarath Reddy

2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సుయాత్రతో ప్రచార భేరి మోగించనున్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: జనసేన ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం రూ. 10 కోట్లు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ తన సొంత పార్టీ జనసేన కోసం తన సొంత డబ్బు రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు విరాళం చెక్కులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవీ రత్నంకు అందజేశారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, చంద్రబాబుపై నరసాపురం ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు, నమ్ముకున్నోడికి సీటు ఇప్పించలేదు. మిమ్మల్ని ఎలా నమ్ముతారంటూ..

Hazarath Reddy

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్‌కు సంబంధించిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న రఘురామకృష్ణరాజు.. తన సీటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీటు ఇవ్వాలి.. విజయనగరం వదిలేయండి. టీడీపీ నాకు సీటు ఇవ్వాలి

Andhra Pradesh Elections 2024: సైకిల్ గుర్తుకి ఓటు వేయమని చెప్పగానే వెళ్లిపోయిన జనం, నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నిండు సభలో చేదు అనుభవం ఎదురైంది. సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అడగ్గానే జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేమిరెడ్డి ఎక్కడికి వెళ్లిపోతున్నారు ఉండండి అనడం వీడియోలో కనిపిస్తోంది.

Andhra Pradesh Elections 2024: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాలనాయుడు, మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధ, అధికారికంగా ప్రకటించిన వైసీపీ

Hazarath Reddy

అనకాపల్లి లోక్‌సభ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి పేరును వైఎస్సార్‌సీపీ అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్‌సీపీ.. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement