ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Elections 2024: పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్, అధికారికంగా ప్రకటించిన జనసేన అధినేత
Hazarath Reddyఎట్టకేలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీపై క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్‌ ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్‌ చెప్పుకొచ్చారు.
National Law University in Kurnool: కర్నూలులోనే ఏపీ హైకోర్టు, నేషనల్‌ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్, న్యాయ రాజధానికి మంచి జరగాలని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyకర్నూలు జిల్లా, కల్లూరు మండలం, లక్ష్మీపురం జగన్నాథగట్టులో "లా యూనివర్సిటీ" పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. భూమి పూజతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. లా వర్సిటీ పైలాన్ ఆవిష్కరించారు. 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో ఇద్దరు జడ్జిలుగా ప్రమాణస్వీకారం, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
Hazarath Reddyఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు నేడు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.వీరిద్దరూ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తూ న్యాయమూర్తులుగా నియమించబడ్డారు.
YSR EBC Nestham: మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుధ్దానికి వస్తున్నాయి. వైఎస్సార్‌ ఈబీసీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లెలో వైఎస్సార్‌ ఈబీసీ నిధుల్ని లబ్ధదారుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం 4,19,583 మంది ఖాతాల్లో నేడు రూ. 629.37 కోట్ల రూపాయలు సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
Andhra Pradesh Elections 2024: గంటాకు రెండో జాబితాలో దక్కని చోటు, గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ, 34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జీబితా విడుదల
Hazarath Reddyఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Andhra Pradesh Elections 2024: ఈ నెల 16న మొత్తం అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్న సీఎం జగన్, అనంతరం ఎన్నికల ప్రచారంలోకి..
Hazarath Reddyవచ్చే ఎన్నికల కోసం ఏపీలో అధికార వైసీపీ పార్టీ(YCP) అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది. ఈనెల 16న ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌(YSR Ghat) వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(CM Jagan) అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు
Andhra Pradesh Shocker: టెన్త్ క్లాస్ విద్యార్థిపై బెల్ట్‌తో దాడి చేసిన కొందరు యువకులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyఏపీ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కొందరు యువకులు నిన్న జెడ్పీ హైస్కూల్ బయట టెన్త్ స్టూడెంట్ హేమంత్ కుమార్ పై దాడి చేశారు. బెల్ట్‌తో దారుణంగా కొట్టడంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Geethanjali Suicide Case: గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌, పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మిగతా వారి కోసం వెతుకులాట
Hazarath Reddyసోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో బలవనర్మణానికి పాల్పడిన గీతాంజలి కేసులో తొలి అరెస్ట్‌ జరిగింది. పసుమర్తి రాంబాబు అనే వ్యక్తిని తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడు అంటూ వార్తలు వస్తున్నాయి.
Ganta Srinivasarao: మాజీ మంత్రి గంటా దారెటు, ఇవాళ ముఖ్య అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్న గంటా శ్రీనివాసరావు, టీడీపీలో కొనసాగుతారా? లేదా? ఉత్కంఠ
VNSచంద్రబాబు మాత్రం గంటాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బుధవారం కూడా ఆయన చంద్రబాబును కలిశారు. తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. గంటా శ్రీనివాస్‌ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.
MLA Hafeez Khan on CAA: కేంద్రం తీసుకువచ్చిన సీఏఏను అంగీకరించలేం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కీలక ప్రకటన, వీడియో ఇదిగో
Hazarath Reddyపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కీలక ప్రకటన చేశారు. సీఏఏ చట్టం ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉందని దాన్ని అంగీకరించబోమన్నారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ చట్టం వలన ముస్లిం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్‌ కూడా మాకు అనునిత్యం అండగా నిలుస్తున్నారు.
TDP Chilakaluripet Sabha: బొప్పూడిలో భూమి పూజ చేసిన నారా లోకేష్, ఈ నెల 17న మూడు పార్టీల భారీ బహిరంగ సభ, హాజరుకానున్న ప్రధాని మోదీ
Hazarath Reddyఈ నెల 17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం బొప్పూడి చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సభా ప్రాంగణం వద్ద భూమిపూజ చేశారు.
2018 Group-1 Mains Cancellation: 2018 గ్రూప్‌-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు, ఉద్యోగులు ఆందోళన చెందవద్దని తెలిపిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddy2018లో ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు (AP High Court) కీలక తీర్పు వెలువరించింది. జవాబు పత్రాలను మాన్యువల్‌ (చేతితో దిద్దడం) విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు
YCP 12th List: వైసీపీ తాజా అభ్యర్థుల 12వ లిస్టు ఇదిగో, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్, చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు
Hazarath Reddyరానున్న ఎన్నికల కోసం ఇప్పటికే 11 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం..మంగళవారం రాత్రి మరో జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో కేవలం ఇద్దరు అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు. చిలకలూరిపేట ఇన్ఛార్జీగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక ఇన్ఛార్జీగా గుడివాడ అమర్ నాథ్ పేరును ప్రకటించారు.
Geethanjali Suicide Case: గీతాంజలిని రైలు నుంచి తోసేసిన ఆ ఇద్దరు ఎవరు, ఎక్స్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ, కౌంటర్ విసురుతున్న వైసీపీ సోషల్ మీడియా
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గీతాంజలి మృతి చుటూ తిరుగుతున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ నేతలు చేసిన ట్రోల్స్ వల్లనే గీతాంజలి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే టీడీపీ కూడా ఎదురుదాడికి దిగింది. గీతాంజలి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రాంతంలోనిది అంటూ ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
Geethanjali Suicide Case: గీతాంజలి మృతిపై స్పందించిన నటి పూనమ్ కౌర్, ఆ పసి పిల్లలకు న్యాయం చేయండి అంటూ ట్వీట్
Hazarath Reddyగీతాంజలి ఆత్మహత్య ఘటనపై నటి పూనమ్‌ కౌర్‌ స్పందించింది.. గీతాంజలికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేసింది. గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలి ఎందుకు సూసైడ్‌ చేసుకునే పరిస్థితి వచ్చింది? ఓ పార్టికి చెందిన ఆన్‌లైన్‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె చనిపోయిందా? అమ్మాయిల మీద పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం వారికి బాగా అలవాటు.
Geethanjali Suicide Case: గీతాంజలి మృతిపై క్లారిటీ ఇచ్చిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక ఆత్మహత్య, ఎవరిని వదిలిపెట్టేది లేదని వెల్లడి
Hazarath Reddyసోషల్ మీడియా ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే 28 ఏళ్ల మహిళా ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ వెల్లడించారు.
Telangana Vehicle Registration: ఇకపై TS కాదు TG..తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ మార్చుతూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ
sajayaదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్రం పేరులోని అక్షరాల అబ్రివేషన్‌ను మాత్రమే రిజిస్ట్రేషన్ సీరీస్‌గా వాాడుతుండగా, గత ప్రభుత్వం Telangana State రెండు వేర్వేరు పదాల తొలి అక్షరంతో TS గా నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని TG గా మార్చుతూ కేంద్రం మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Geethanjali Suicide Case: గీతాంజలి ఆత్మహత్య ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Hazarath Reddyతెనాలి మహిళ గీతాంజలి ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేవారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురించేసిందని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Director Varma Slams Nara Lokesh: నువ్వు మూర్ఖుడివే అనుకున్నా.. మూగవాడివి అని ఇప్పుడు తెలిసింది, లోకేష్‌ గ్రాఫిక్స్‌ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన వర్మ
Hazarath Reddyముఖ్యమంత్రి జగన్‌ సభలో జనాలే లేరంటూ. అదంతా గ్రాఫిక్స్‌ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ మీద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనదైన స్టైల్లో పంచులు విసిరారు. లోకేష్‌ను ఉద్దేశిస్తూ..'మీ అజ్ఞానానికి అవధులు లేవు.. మీకు సినిమా పరిశ్రమలో చాలా మంది స్నేహితులు ఉన్నారు.
Andhra Pradesh: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు, రామచంద్రయ్య, వంశీ కృష్ణయాదవ్‌పై వేటు వేసిన శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) కౌన్సిల్ చైర్మెన్ వేటు వేశారు.వైసీపీ నుండి ఎన్నికై వేరే పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రకటించారు