ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Politics: దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవండి, ఆ ముగ్గురికి సవాల్ విసిరిన మాజీ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

Hazarath Reddy

ఏపీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే పులివెందులలో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.

CM Jagan Palnadu Tour: పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపిన సీఎం జగన్, వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు

Cyclone Midhili Update: ఏపీకి మిధిలీ తుపాను గండం, బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, భారీ వర్షాలతో తమిళనాడు విలవిల

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.

IMD Warning: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుకు వెదర్‌ అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరికలు జారీచేసిన ఐఎండీ

VNS

బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావం పలు ప్రాంతాల్లో భారీ గాలులతోపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని వాతావరణశాఖ అధికారులు (IMD) వెల్లడించారు. అల్పపీడన ప్రభావం వల్ల బుధ, గురువారాల్లో సముద్ర తీరప్రాంతాల్లో భారీగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారిణి సునంద చెప్పారు.

Advertisement

Btech Ravi Arrested: కడపలో అర్ధరాత్రి ఉద్రిక్తత, టీడీపీ నేత బీటెక్ రవి అరెస్ట్‌, 14 రోజుల రిమాండ్‌ విధింపు, కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు, ఇంతకీ ఏ కేసులో అరెస్టు చేశారంటే?

VNS

కడప రిమ్స్ ఆస్పత్రితో వైద్య పరీక్షల అనంతరం రవిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. గతంలో యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు టీడీపీ నేత నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద రవి ఆందోళన చేశారని, పోలీసులకు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

HC on Pension: ఏపీలో పెన్షన్ల విధానంపై హైకోర్టు సంచలన తీర్పు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల విధానంపై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పెన్షన్ల చెల్లింపు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉన్న వ్యవహారాల్లో నిర్దిష్టంగా ఫలానా విధంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానాలు ఆదేశించలేవని పేర్కొంది.

Nampally Fire: నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనలో 9 మంది మృతి, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

ahana

హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఓ భవనంలో నవంబర్ 13 తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి . భవన సముదాయంలో ఉంచిన రసాయనాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు.

Visakhapatnam: వీడియో ఇదిగో, మద్యం ఇవ్వలేదని ఏకంగా వైన్‌ షాప్‌ను తగలబెట్టాడు, మంటల్లో పూర్తిగా కాలిపోయిన షాపు, రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం

Hazarath Reddy

మద్యం ఇవ్వలేదని వైన్‌ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్‌ షాప్‌ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్‌ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.

Advertisement

Rush in Tirumala: దీపావళి రోజు శ్రీవారిని దర్శించకున్న 75 వేల మంది భక్తులు.. ఒక్కరోజులో హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పట్టిందంటే??

Rudra

దీపావళి పండుగ సందర్భంగా కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశున్ని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. పండుగ నాడు మొత్తం 74,807 మంది భక్తులు శ్రీ అలిమేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.

Cheddi Gang Roaming in Tirupathi: తిరుపతివాసులారా అలర్ట్.. నగరంలో మళ్లీ తిరుగుతున్న చెడ్డీగ్యాంగ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరిక.. రాత్రివేళ కాలింగ్ బెల్‌‌ కొట్టినా, తలుపు తట్టినా స్పందించవద్దంటూ సూచన.. (వీడియో ఇదిగో)

Rudra

ఏపీలో ఇటీవల భయభ్రాంతులకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ మరోమారు కలకలం రేపింది. తిరుపతి, దాని శివారు ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ సంచరిస్తున్నట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Telangana Voters List: తెలంగాణ ఓటర్లు 3.26 కోట్లు.. పురుషులు 1.62.. మహిళలు 1.63 కోట్లు.. రాష్ట్రంలో పెరిగిన మహిళా ఓటర్లు.. ఓటరు తుది జాబితా ప్రకటన

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం.

Chandra Mohan No More: ప్రముఖ నటుడు చంద్ర మోహన్‌ కన్నుమూత.. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

Rudra

ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు.

Advertisement

Roja Kabaddi Video: వీడియో ఇదిగో, తొడగొట్టి కబడ్డీ ఆడిన మంత్రి రోజా, స్కూల్ డేస్‌ నుంచీ కబడ్డీ తనకెంతో ఇష్టమని వెల్లడి

Hazarath Reddy

కాకినాడ ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి రోజా విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు. అయితే రోజాకు గ్రౌండ్‌ కొత్త కాదు. కబడ్డీ కొత్త కాదు.

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు, చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 15కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది.

TTD SED Tickets: నేడు శ్రీవారి 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌ లైన్‌ లో.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

Lord Krishna Temple in Pulivendula: వీడియో ఇదిగో, పులివెందులలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్, పలు భవనాలకు శంకుస్థాపన

Hazarath Reddy

పులివెందులలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుడి ఆలయాన్ని ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన శిల్పారామాన్ని ప్రారంభించిన అనంతరం, శ్రీస్వామి నారాయణ్ గురుకుల పాఠశాల నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారు.

Advertisement

AP Fibernet Case: ఫైబర్‌నెట్‌ కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా, దీపావళి సెలవుల తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీర్పు వెలువరిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

ఫైబర్‌ నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ వాయిదా పడింది. ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది

AP Fibernet Case: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, సెక్షన్‌ 17-ఎ కేసులో ఇంకా వెలువడని తీర్పు, టీడీపీ అధినేత కేసు అప్‌డేట్స్ ఇవే

Hazarath Reddy

ఏపీ ఫైబర్‌నెట్‌ స్కాం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సంగతి విదితమే. తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

Andhra Pradesh Election 2024: ముసుగు తీసేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను నరసాపురం నుంచి ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Disproportionate Assets Case: అక్రమాస్తుల కేసు, సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, పిల్‌కు నంబర్‌ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు

Hazarath Reddy

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ హరిరామజోగయ్య పిటిషన్ వేశారు. ఎన్నికలు జరిగే లోపల ఈ కేసులపై తీర్పులను వెలువరించాలని పిటిషన్ లో ఆయన కోరారు.

Advertisement
Advertisement