ఆంధ్ర ప్రదేశ్

Amaravati Inner Ring Road Case: అమరావతి రింగ్‌రోడ్డు కేసు, చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో TDP అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు.

Amaravati Inner Ring Road Case: అమరావతి రింగ్‌రోడ్డు కేసు, నారా లోకేష్ సీఐడీ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సీఐడీ విచారణను అక్టోబరు 10కి వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో లోకేశ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది

Skill Development Scam Case: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు దక్కని ఊరట, క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా, కోర్టులో వాదనలు ఇవిగో..

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఇవాళ జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించింది.

Skill Development Scam Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు స్కామ్‌ కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తన పేరును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది

Advertisement

Times Now-ETG Survey: టైమ్స్‌ నౌ తాజా సర్వే ఫలితాలు ఇవిగో, ఏపీలో మళ్లీ జగన్ సర్కారే, తెలంగాణలో కారు జోరు, కేంద్రంలో మళ్లీ ఎన్టీయే ప్రభంజనం అంటున్న సర్వే..

Hazarath Reddy

దేశంలో 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికార ఎన్డీయే మరోసారి ఘన విజయం సాధిస్తుందని జాతీయ వార్తా సంస్థ Times Now-ETG Survey తాజా సర్వేలో వెల్లడయ్యింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి ఏకంగా 307 స్థానాలు గెలుచుకుంటుందని తెలియజేసింది

Australia Parrot: రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు.. ఎలా కనిపెట్టారంటే??

Rudra

ఆస్ట్రేలియాకు చెందిన రాక్టో అనే 4 నెలల వయసున్న తన చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందని, ఆ చిలుకను రూ.1.30 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతడి చిలుకను ఒక్క రోజులో జూబ్లీహిల్స్ పోలీసులు పట్టితెచ్చి ఇచ్చారు.

Andhra Pradesh Assembly Elections 2023 వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి 160 సీట్లు గెలవబోతున్నాయి, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి

Hazarath Reddy

ప్రస్తుతం ఉన్న నేతల్లో చంద్రబాబు నిజాయతీపరుడని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ‘‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌కు ప్రయత్నించి ఉంటే ఎప్పుడో వచ్చేది. ఫైబర్‌నెట్‌లోనూ ఎలాంటి అవినీతి జరగలేదు. టీడీపీ, జనసేన పొత్తుతో రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది

Andhra Pradesh: వీడియో ఇదిగో, నువ్వు ఎవరెవరి దగ్గర పడుకున్నావో తెలుసంటూ మంత్రి రోజాపై దారుణంగా కామెంట్లు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే, అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

Hazarath Reddy

మాజీ మంత్రి బండారు సత్యారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాను దూషించారని బండారు సత్యారాయణ పై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. బండారు సత్యరాయణను గుంటూరు తరలిస్తున్న పోలీసులు.

Advertisement

Andhra Pradesh Politics: త్వరలో టీడీపీ రెండుగా చీలిపోతుంది, సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Hazarath Reddy

పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని తెలిపారు. త్వరలోనే టీడీపీ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చని అన్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి మద్దతిస్తున్న ‘బలమైన' వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందని, బాబు దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు

Dasara Holidays in AP: ఏపీలో ఈ నెల 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, ఈ నెల 3 నుంచి 6 వరకు పరీక్షలు

Hazarath Reddy

ఏపీలో ఈ నెల 14 నుంచి 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలు నిర్వహించనుంది

NIA Rides in Telugu States: ఏపీ, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు.. పౌరహక్కుల నేతల ఇండ్లలో సోదాలు

Rudra

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌ తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Tirumala Temple Closed: తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. 28న శ్రీవారి ఆలయం మూసివేత.. నేడు ఎస్ఎస్‌డీ టోకెన్ల రద్దు.. కారణం ఇదే!

Rudra

ఈ నెలాఖరులో తిరుమల దర్శనానికి ప్లాన్ చేసుకునే భక్తులకు అలర్ట్. 29న తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 8 గంటలపాటు మూతపడనుంది.

Advertisement

Pawan Kalyan Varahi Yatra: సీఎం జగన్‌ అందుకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు! నా సినిమాలు ఆపాలనుకుంటే...ఆపండి, అవనిగడ్డలో సీఎం జగన్‌పై పవన్‌ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

VNS

ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం వారి దగ్గర డబ్బులు ఉండకూడదు అని సీఎం జగన్ (CM Jagan) భావించడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఆరోపించారు. అలాగే, తన సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గించడానికి కారణం తన దగ్గర డబ్బులు ఉండకూడదు అని భావిస్తున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.

TTD Rush: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... స్వామివారి సర్వదర్శనానికి 30 గంటల సమయం.. సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ

Rudra

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొన్నిరోజులుగా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది.

Dasara Holidays: ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. 13 తారీఖు నుంచి 25 వరకూ దసరా సెలవులు.. అక్టోబర్ 26 నుంచి స్కూళ్లు పునఃప్రారంభం

Rudra

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 25 తారీఖు వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది.

Tirumala Sarvadarshan: తిరుమలలో ఐదురోజుల పాటూ సర్వదర్శనం టోకెన్లు రద్దు, శ్రీవారి దర్శనానికి ఏకంగా 48 గంటలు సమయం, పెరటాసి అమవాస్య నేపథ్యంలో భారీగా పెరిగిన రద్దీ

VNS

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ లో ఐదు రోజులు సర్వదర్శనం (Tirumala Sarvadarshan) టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసింది. సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. అధిక రద్దీ కారణంగా అక్టోబర్ 1,7,8,14,15వ తేదీల్లో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు రద్దు చేసినట్లు టీటీడీ (TTD) పేర్కొంది.

Advertisement

TDP Protest: మోత మోగించిన టీడీపీ, చంద్రబాబు అరెస్టుపై 5 నిమిషాల పాటూ సౌండ్‌తో నిరసన, రాజమండ్రిలో బ్రాహ్మణీ, ఢిల్లీలో లోకేష్‌

VNS

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కోడలు నారా బ్రాహ్మణి (Brahmani) సాయంత్రం మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడి అరెస్టుకు (CBN Arrest) నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆ పార్టీ నేత నారా లోకేశ్ కార్యాలయంలో 7 గంటల నుంచి 5 నిమిషాల పాటు బ్రాహ్మణితో పాటు పలువురు మహిళలు ఢమరుకం, డోలు వాయిస్తూ, విజిల్ వేస్తూ మోతమోగించారు.

Vizag Beach Mystery: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె.. చూసేందుకు ఎగబడిన జనం.. అందులో విలువైన సంపద ఉండే అవకాశం ఉందని చర్చ

Rudra

విశాఖపట్టణం తీరానికి ఇటీవల ఓ పెద్ద పురాతన పెట్టె ఒకటి కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్ ఓ పెద్ద మిస్టరీగా మారింది. తీరానికి ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో దానిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

2000 Note Exchange Deadline: రూ.2 వేల నోటు మార్పిడికి నేడే ఆఖరు.. నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి.. రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా? పూర్తి వివరాలు ఇదిగో..

Rudra

ఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది.

Aarogya Suraksha: ఏపీ ప్రభుత్వం మరో సంచలన కార్యక్రమం, అందరికీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం

Hazarath Reddy

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. 45 రోజులపాటు ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement