ఆంధ్ర ప్రదేశ్

Vivekananda Reddy Murder Case: హైకోర్టులో అవినాష్‌రెడ్డికి ఊరట, ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐకి కోర్టు ఆదేశాలు, గంటన్నరకు పైగా సాగిన వాదనలు

Hazarath Reddy

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల తర్వాత.. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

Vivekananda Reddy Murder Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్, ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ మళ్లీ వాయిదా, ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరిన సీబీఐ

Hazarath Reddy

వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను సీబీఐ మళ్లీ వాయిదా వేసింది. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగుతుండడంతో రేపు(బుధవారం) ఆయన్ని విచారించాలని సీబీఐ నిర్ణయించుకుంది.

Annavaram Online Services: అందుబాటులోకి అన్నవరం దేవస్థానం ఆన్‌లైన్ సేవలు.. స్వామి వారి ప్రత్యక్ష, పరోక్ష సేవల టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే వెసులుబాటు

Rudra

అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఆన్‌లైన్ సేవలు ప్రారంభించింది. వీటి ద్వారా భక్తులు స్వామి వారి ప్రత్యక్ష, పరోక్ష సేవలు అంటే.. వ్రతాలు, కల్యాణాలు, హోమాలు, ఇతర పూజలు, దర్శనాలు, ప్రసాదం, కల్యాణకట్ట, అన్నదానం టికెట్లు, వసతి గదులు, కల్యాణ మండపాల బుకింగ్ వంటి వాటిని ముందుగానే చేసుకోవచ్చు.

HC Says Ejaculation Not Necessary: బాధితురాలి ఆ పార్టులో వీర్యం లేనంత మాత్రాన రేప్ జరగలేదని భావించలేం, ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Hazarath Reddy

అత్యాచారం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిందితుడికి వేసిన శిక్షను సమర్థిస్తూ, పోక్సో చట్టంలోని సెక్షన్ 3 కింద నిర్వచించిన 'చొచ్చుకొనిపోయే లైంగిక వేధింపుల' నేరాన్ని రుజువు చేయడానికి అవసరమైనదంతా కేవలం లైంగిక దాడి మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేర్కొంది.

Advertisement

CM Jagan in Iftar Dinner: ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్, ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సుమారు 15 వేల మంది హాజరయ్యారు.

Vivekananda Reddy Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ వాయిదా, రేపు ఉదయం 10. 30 గంటలకు రావాలంటూ మరో నోటీసు పంపిన సీబీఐ అధికారులు

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఆయనను మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని సీబీఐ అధికారులు పిలిచారు.

Vivekananda Reddy Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసు, 2019 నుంచి నేటి వరకు ఏం జరిగింది, నాలుగేళ్లు దాటినా ఇంకా బయటకు రాని అసలు నిజం

Hazarath Reddy

2019 ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య (Vivekananda Reddy Murder)రాష్ట్రంలో పెను సంచలనం రేపిన సంగతి విదితమే. వివేకానందరెడ్డి హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌తో ఇప్పుడు వైఎస్సార్‌సీపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది.

Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేసిన అవినాష్‌ రెడ్డి, నేడు సీబీఐ విచారణకు కడప ఎంపీ

Hazarath Reddy

వివేకానంద రెడ్డి హత్య కేసులో (Vivekananda Reddy Murder Case) కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను (anticipatory bail petition) చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ అనుమతించింది

Advertisement

Boy Dies of Heart Attack: చిన్న పిల్లలను వణికిస్తున్న గుండెపోటు, పల్నాడు జిల్లాలో హార్ట్ ఎటాక్‌తో 8వ తరగతి విద్యార్థి మృతి, 45 రోజుల్లో ఇది రెండో ఘటన

Hazarath Reddy

పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పిడుగురాళ్ల పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌కు చెందిన ఓ ఎనిమిదివ తరగతి విద్యార్థి గుండెపోటుతో శనివారం రాత్రి మృతిచెందాడు.

Vivekananda Reddy Murder Case: అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు.. నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న విచారణ

Rudra

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు విచారణ దూకుడుగా సాగుతున్నది. విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ (CBI) నుంచి నోటీసులు (Notices) అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) హైదరాబాద్ (Hyderabad) పయనమయ్యారు.

Kurnool District: రోడ్డు ప్రమాదంలో అలూరు మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి

kanha

కర్నూలు : రోడ్డు ప్రమాదంలో ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి దుర్మరణం.. గద్వాల జిల్లా బీచుపల్లి సమీపంలో టైర్ పగిలి పల్టీ కొట్టిన కారు.. తీవ్ర గాయాలపాలై కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.

YS Viveka Case: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సీబీఐ కోర్టు.. భాస్కర్‌ రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు

kanha

మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ విధిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. రిమాండ్ అనంతరం భాస్కర్‌ రెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.

Advertisement

Elephant Herd Chaos At Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్ చల్.. భయాందోళనలో భక్తులు.. వీడియో ఇదిగో..

Rudra

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో ఇదిగో..

Vivekananda Reddy Murder Case: వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి అరెస్ట్.. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించిన సీబీఐ

Rudra

మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న ఏపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక ముందడుగు పడింది. కేసు విచారణలో ఇటీవల దూకుడు పెంచిన సీబీఐ ఈ తెల్లవారుజామున వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది.

Road Accident In Annamayya District: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం.. పక్షవాతానికి చికిత్స కోసం వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రమాదం

Rudra

ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లాలో (Annamayya) గత అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు(Chittoor)-కడప (KAdapa) జాతీయ రహదారిపై రామాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది.

Fire Accident In Hyderabad: కుషాయి గూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం

Rudra

హైదరాబాద్ లోని కుషాయిగూడ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. కట్టెల మండీలో చెలరేగిన మంటలతో కలపపూర్తిగా దహనమవ్వడంతో పాటు పక్కనే ఉన్న ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో ముగ్గురు కాలిపోయారు.

Advertisement

Elephants At Tirumala Ghat: వణికిపోతున్న శ్రీవారి భక్తులు, తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు హల్‌చల్‌, ఎప్పుడు దాడికి దిగుతాయో అని పరుగులు

VNS

తిరుమల మొదటి ఘాట్ రోడ్ (Tirumala Ghat) లో ఏనుగులు (Elephants) హల్ చల్ చేశాయి. ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసింది. గుంపులో ఐదు మదపటేనుగులు (Elephants at Tirumala Ghat), ఒక గున్న ఏనుగు ఉన్నాయి. దీంతో ఘాట్ రోడ్ లో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు

Drone Over Srisailam Temple: శ్రీశైలంలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. ఆలయంపై ఆకాశంలో డ్రోన్ చక్కర్లు.. సత్రాలపై కూడా ఎగిరిన డ్రోన్.. డ్రోన్ ఎగరేసిన వ్యక్తుల కోసం భద్రతా సిబ్బంది గాలింపు

Rudra

దక్షిణ కాశీగా పేరొందిన శ్రీశైలం దేవస్థానంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆలయం పరిధిలో అర్ధరాత్రి డ్రోన్ కలకలం రేపింది. ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొట్టడంతో దేవస్థానం సిబ్బంది అవాక్కయ్యారు.

JEE Main Result 2023: 29న జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. నేటితో ముగియనున్న చివరి విడత మెయిన్ పరీక్షలు

Rudra

జేఈఈ మెయిన్ ఫలితాల(JEE Main Result 2023) పై తాజాగా ఓ అప్టేట్ వచ్చింది. ఈనెల 29వ తేదీన ఆ ఫలితాలు విడుదల కానున్నాయి. చివరి విడత మెయిన్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ఎగ్జామ్స్ శనివారంతో ముగియనున్నాయి.

Vizag Steel Plant Privatisation: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన, ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన మోదీ సర్కారు

Hazarath Reddy

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపినట్టు వచ్చిన వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement