ఆంధ్ర ప్రదేశ్

BRS Meeting In AP: ఏపీలో త్వరలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న కేసీఆర్.. సభ‌ ఎక్కడ నిర్వహించేదీ త్వరలోనే ప్రకటన

Rudra

ఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు ఆయన స్వయంగా హాజరుకానున్నారు. సభ ఎక్కడ? ఎప్పుడు? నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే వెల్లడించనున్నారు.

YSRCP: బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన జగన్, యువజన విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు, పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించిన వైఎస్సార్సీపీ, లిస్ట్ ఇదిగో..

Hazarath Reddy

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

Visakha Dairy Chairman Dies: విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు మృతి, సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన రావు, రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రి ఏర్పాటు

Hazarath Reddy

విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

Chandrababu Kuppam Tour: నా ఇంటికి నన్ను రానివ్వకుండా అడ్డుకుంటారా, సైకో సీఎంను తన జీవితంలో తొలిసారి చూస్తున్నా, రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని చంద్రబాబు మండిపాటు

Hazarath Reddy

తన సొంత నియోజకవర్గంలో తనను పర్యటించకుండా, ర్యాలీ నిర్వహించకుండా, సభ పెట్టకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తన కుప్పం పర్యటన గురించి నెల రోజుల క్రితమే డీజీపీకి లేఖ ఇచ్చామని చెప్పారు.

Advertisement

Chandrababu Kuppam Tour: కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు, నాకే రూల్స్‌ చెబుతారా అంటూ మండిపాటు, సభకు అనుమతి లేదంటూ కుప్పం పోలీసులు ఇచ్చిన నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన టీడీపీ అధినేత

Hazarath Reddy

చంద్రబాబు కుప్పం పర్యటనలో (Chandrababu Kuppam Tour) ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఏపీ ప్రభుత్వం రోడ్డు మీద సమావేశాలు జరుపుకోవడం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు సభకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబు పోలీసులపై మండిపడ్డారు.

Andhra Pradesh: అధిక శబ్దం చేస్తూ బైక్ తోలితే మీ బండి పోలీస్ స్టేషన్‌కే, అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన ఏపీ పోలీసులు

Hazarath Reddy

నెల్లూరు నగరంలో అధికశబ్దం చేస్తూ తిరుగుతున్న 173 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు వాహన యజమానులకు జరిమానా విధించి.. స్వాధీనం చేసుకున్న సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు

Chandrababu Kuppam Tour: ఉద్రిక్తంగా మారిన చంద్రబాబు కుప్పం పర్యటన, లాఠీఛార్జ్ చేసిన పోలీసులు, నిబంధల ప్రకారమే ఎవరికైనా సభకు అనుమతులు ఉంటాయని తెలిపిన కుప్పం పోలీసులు

Hazarath Reddy

కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు వాదులాటకు దిగారు. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరీవాణి శ్రీనివాసులు పోలీసులపై దౌర్జన్యం చేయడంతో వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

CM Jagan in Action: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రామ,వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం జగన్ ఆమోదం, గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి సమీక్ష

Hazarath Reddy

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష జరిపారు.

Advertisement

Granules Investments in AP: ఏపీలో మరో కంపెనీ రూ. 2000 వేల కోట్ల పెట్టుబడులు, కాకినాడ వద్ద భారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్న ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌

Hazarath Reddy

సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీలో పెట్టుబడులు దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. పలు కంపెనీలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా ఔషధ తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌ (Granules) ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద భారీ ప్లాంటును (Kakinada Green Plant) ఏర్పాటు చేయనుంది.

Polavaram Project Cost Row: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.20,744 కోట్లు ఖర్చు, వార్షిక నివేదికలో పేర్కొన్న కేంద్ర జలశక్తి శాఖ,ఇప్పటిదాకా రూ.13,226.04 కోట్లు విడుదల చేసిన కేంద్రం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు అయిన ఖర్చు (Polavaram Project Cost Row) వివరాలను కేంద్ర జలశక్తి వెల్లడించింది. డిసెంబర్‌ 15, 2022 వరకూ పోలవరం ప్రాజెక్టుకు రూ.20,744 కోట్లు ఖర్చయిందని వార్షిక నివేదికలో జలశక్తి శాఖ (Ministry of Jal Shakti ) పేర్కొంది

Chandrbabu Naidu: చంద్రబాబు కుప్పం సభకు అనుమతి నిరాకరణ, నోటీసులకు వివరణ ఇవ్వనందుకు పర్మిషన్‌ ఇవ్వడంలేదంటూ ప్రకటన

VNS

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. రాత్రి 10.30 గంటల వరకు సరైన సమాధానం రాలేదన్నారు.

YSRCP Coordinators For Constituencies: పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ నియామకం, రెండు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ

Hazarath Reddy

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

AP Shocker: ఏపీలో దారుణం, ఆ భాగంలో రక్తం కారుతున్నా వదలని కామాంధుడు, శ్మశానంలోకి లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడది అర్థరాత్రి కాదు కదా.. పగలు కూడా బయట తిరగలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన (AP Shocker) చోటు చేసుకుంది. బహిర్భూమికని బయటకు వెళ్లిన బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి (Minor girl raped) పాల్పడ్డాడు.

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలపై నిషేధం, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర హోంశాఖ

Hazarath Reddy

రహదారులపై సమావేశాలతో ప్రాణ నష్టం జరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Govt Bans Rallies) నిషేధించింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్‌ రహదారులపైన, మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని (Meetings on Public Roads) స్పష్టంచేసింది.

YSR Pension Kanuka: మీకిచ్చిన హామీని మీ బిడ్డ నిలబెట్టుకున్నాడు, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలను గమనించాలని పిలుపునిచ్చిన సీఎం జగన్, రాజమండ్రి టూర్ లైవ్ అప్ డేట్స్ ఇవే..

Hazarath Reddy

పింఛన్లు పెంచుకుంటూ పోతామన్న హామీని మీ బిడ్డగా నిలబెట్టుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజమండ్రిలో పింఛన్‌ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

Free Electricity For Farmers: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తు, దళితబిడ్డలకు దళితబంధు.. సీఎం కేసీఆర్‌ స్పష్టం

Rudra

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తునిస్తామని.. దళితబిడ్డలకు దళితబంధు పథకాన్ని అమలుచేస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్‌కు అధికారమిస్తే.. రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశంగా మారుస్తామని ప్రకటించారు.

Advertisement

Weather Updates: ఉత్తర కోస్తాలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

Rudra

ఉత్తర కోస్తాలోని పలు చోట్ల నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావవరణ శాఖ తెలిపింది. రాయలసీమలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది.

BRS Makes Foray Into AP: ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు, BRSలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారధి

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు (Former BJP Leader Ravela Kishore Babu), తోట చంద్రశేఖర్, పార్థసారధి బీఆర్‌ఎస్‌లోకి చేరారు. సీఎం కేసీఆర్‌ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు

Guntur Stampede: చంద్రబాబు ప్రచార పిచ్చికి పేదలు బలి, మరణాలన్నిటికి చంద్రబాబు బాధ్యత వహించాలి, బాధితులను పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి రజిని

Hazarath Reddy

గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి విడదల రజనీ. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.

Guntur Stampede: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే ప్రమాదం, తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన ఎమ్మెల్యే కొడాలి నాని, చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్

Hazarath Reddy

గుంటూరు తొక్కిసలాట ఘటన చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకువచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Advertisement