ఆంధ్ర ప్రదేశ్

Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, నేల బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్, డ్రైవర్‌, క్లీనర్ మృతి, మవరం టోల్‌ప్లాజా సమీపంలో మరో రోడ్డు ప్రమాదం, తండ్రి, ఓ చిన్నారి మృతి

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోటబోమ్మాళి మండలం పాకీవలస వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ వ్యాన్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న నేల బావిలో (Laguage van plunged into well) పడిపోయింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్‌, క్లీనర్ మృతి (Srikakulam Road Accident) చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Guntur Coronavirus: సీఐ అయితే మాస్క్ ధరించవా, హడావిడిలో మర్చిపోయాను సార్, తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావుకు మాస్క్ లేని కారణంగా జరిమానా విధించిన ఎస్పీ అమ్మిరెడ్డి, స్వయంగా మాస్క్ తొడిగిన గుంటూరు అర్బన్‌ ఎస్పీ

Hazarath Reddy

అందరూ తప్పని సరిగా (Covid-19 regulations) మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలే అని ప్రశ్నించగా సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అనిచెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లి మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా (Guntur police fine its own traffic CI) విధించి, స్వయంగా మాస్కు తొడిగారు. కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.

HYD Water Supply Row: అలర్ట్ టైం..ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్, పైపులైన్‌ విస్తరణ పనుల్లో భాగంగా వాటర్ నిలిపివేత, నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్‌ బోర్డు అధికారులు సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్‌ 1న నీటి సరఫరా బంద్‌ చేయనున్నట్లు (No water supply to some parts of Hyderabad) వాటర్‌బోర్డు అధికారులు ప్రకటించారు.

Coronavirus in AP: ఏపీలో 24 గంటల్లో 997 మందికి కోవిడ్ పాజిటివ్, ఐదుగురు మృతితో 7,210కి చేరుకున్న మరణాల సంఖ్య, పెరుగుతున్న కేసులతో వణుకుతున్న చిత్తూరు జిల్లా

Hazarath Reddy

ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా, 997 మందికి పాజిటివ్ (Coronavirus in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 152, విశాఖ జిల్లాలో 139, కృష్ణా జిల్లాలో 110 కరోనా కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 282 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు (New Covid Deaths) మరణించారు.

Advertisement

Coronavirus in AP: చిత్తూరును వణికిస్తున్న కరోనా, అత్యధిక కేసులు ఆ జిల్లా నుంచే, రాష్ట్రంలో 24 గంటల్లో 997 మందికి కోవిడ్ పాజిటివ్, ఐదుగురు మృతితో 7,210కి చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31,325 కరోనా పరీక్షలు నిర్వహించగా, 997 మందికి పాజిటివ్ (Coronavirus in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 152, విశాఖ జిల్లాలో 139, కృష్ణా జిల్లాలో 110 కరోనా కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు వెల్లడయ్యాయి.

Tirupati By-Election 2021: తిరుపతిలో ఫ్యాను గెలుపు తధ్యమా..మెజార్టీ ఎంత ఉండబోతోంది? అధికార ప్రతిపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు, వీడియోలు 7557557744 నంబర్‌కు వాట్సాప్ చేస్తే అకౌంట్‌లో పదివేలు వేస్తామనంటున్న అచ్చెన్నాయుడు, నామినేషన్లు దాఖలు చేసిన మూడు పార్టీల అభ్యర్థులు

Hazarath Reddy

వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ వైసీపీ నేతలు ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ శ్రేణులకు సూచించారు. వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలని అన్నారు.

Vizag Road Accident: నాన్నా నన్ను బయటకు తీయండి..బస్సు చక్రాల కింద పడి యువతి కన్నీటి రోదన, విశాఖ ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ వద్ద ఘో రోడ్డు ప్రమాదంలో యువతి మృతి, తండ్రికి గాయాలు, న్యాయం చేయాలని రోడ్డెక్కిన బంధువులు

Hazarath Reddy

విశాఖ పట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీఈడీలో చేరేందుకు తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుమార్తెను మృత్యువు ( Visakhapatnam, Road Accident) రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. ఆదివారం ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

Andhra Pradesh Shocker: మద్యం తాగి వస్తావా..కోపంతో భార్యను చంపేసిన భర్త, అరకు ప్రాంతంలో దారుణ ఘటన, తూర్పుగోదావరి జిల్లాలో పకోడి బండి వద్ద ఘర్షణ, కారు ఢీకొట్టడంతో యువకుడుమృతి

Hazarath Reddy

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య మందు తాగిందన్న క్షణికావేశంలో భర్త దాడి చేయడంతో ఆమె దుర్మరణం పాలైన ఘటన (Andhra pradesh Shocker) విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో పాచిపెంట మండలం మాతుమూరు సమీపంలో ఈ ఘటన (Vijayangaram Shocker) కలకలం రేపింది.

Advertisement

AP Coronavirus: ఏపీలో కరోనా డేంజర్ బెల్స్, అయినా ప్రజల్లో నిర్లక్ష్యం, నిన్న ఒక్కరోజే మాస్కులు ధరించని వారి నుంచి రూ.17.34 లక్షలు వసూలు, తాజాగా 1,005 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

కరోనా మళ్లీ విస్తరిస్తుండడంతో ఏపీలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మాస్కులు పెట్టుకోవడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవారికి జరిమానా వడ్డించారు. నిన్న ఒక్కరోజే 18,565 మందికి జరిమానాలు విధించడం ద్వారా రూ.17.34 లక్షలు వసూలు చేశారు.

Covid in AP : ఏపీలో కరోనా కల్లోలం, తాజాగా 1,005 మందికి కోవిడ్ పాజిటివ్, ప్రస్తుతం 5,394 యాక్టివ్ కేసులు, ఇద్దరు మరణంతో 7,205కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో కొత్త కేసుల సంఖ్య తాజాగా 1000 దాటింది. గడచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు చేయగా 1,005 మందికి పాజిటివ్ (Covid in AP) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 225 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 184, విశాఖ జిల్లాలో 167, కృష్ణా జిల్లాలో 135 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 324 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. 

Vizianagaram Road Accident: కమ్మేసిన పొగ..విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, గ్యాస్ సిలిండర్ల లారీ-రెండు ఆర్టీసీ బస్సులు ఢీ, ముగ్గురు దుర్మరణం, పలువురి పరిస్థితి విషమం

Hazarath Reddy

విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Vizianagaram Road Accident) చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈక్రమంలోనే అటుగా వస్తున్న ఒక లారీ ప్రమాదానికి గురైన ఒక ఆర్టీసి బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది.

Uyyalavada Narasimha Reddy Airport: రెండు రాజధానుల మధ్య విమాన సర్వీసులు, ఓర్వకల్లు నుంచి బెంగుళూరుకు వెళ్లిన తొలి ఇండిగో విమానం, తొలి దశలో విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాల రాకపోకలు

Hazarath Reddy

ర్నూలు జిల్లా ప్రజల కల సాకారమైంది. కర్నూలు సిటీకి సమీపంలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో (orvakal airport) విమానాల సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు (First commerical flight landed) చేరుకుంది.

Advertisement

AP Budget: మూడు నెలల బడ్జెట్‌కు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, ఎన్నికల తర్వాతనే పూర్తి స్థాయి బడ్జెట్

Hazarath Reddy

ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదించారు. మూడు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్‌ జారీ అయ్యింది. గవర్నర్ ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఏడాది బడ్జెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.

Badvel MLA Venkata Subbaiah Dies: బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కన్నుమూత, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బయ్య

Hazarath Reddy

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య (Badvel MLA Venkata Subbaiah Dies) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య కొద్దిరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది మునిసిపల్ ఎన్నికల ముందు డిశ్చార్జ్ అయ్యి స్వగ్రామానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన చురుగ్గా పాల్లొన్నారు.

Road Accidents in AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు, 11 మంది అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని ఢీకొట్టిన టెంపో, గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు వద్ద టిప్పర్‌ను ఢీకొట్టిన ఆటో

Hazarath Reddy

ఏపీలో రెండు జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accidents) మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం మండలం ( Nellore Buchi Reddy Palem) దామరమడుగు జాతీయరహరదారిపై ఆదివారం ఉదయం ఆగిఉన్న ఓ లారీని టెంపో వాహనం ఢీకొట్టింది.

Coronavirus in AP: మూడు జిల్లాల్లో కరోనా కల్లోలం, ఏపీలో తాజాగా 947 మందికి కరోనా నిర్థారణ, నేటి వరకు రాష్ట్రంలో 1,49, 58,897 మందికి కరోనా టెస్టులు, రాష్ట్రంలో 4,715 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 42,696 కరోనా పరీక్షలు నిర్వహించగా... 947 మందికి పాజిటివ్ (Andhra Pradesh Covid) నిర్ధారణ అయింది. ఇక ఒక్క చిత్తూరు జిల్లాలోనే 180 కేసులు (Coronavirus in AP) గుర్తించారు. గుంటూరు జిల్లాలో 145 కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 113 కేసులు, విశాఖపట్నంలో 156 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో ఎటువంటి మరణాలు సంభవించలేదు.

Advertisement

Covid in AP: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 65 మంది విద్యార్థులకు కరోనా, క్యాంపస్‌లోని 7 బ్లాక్‌లు కంటైన్‌మెంట్‌ జోన్‌లోకి, క్వారంటైన్‌లో ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహాలు, ఏయూలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా

Hazarath Reddy

విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కరోనావైరస్ కలకలం రేపింది. మొత్తం 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ (students test positive for coronavirus) అయ్యింది. దీంతో మిగతా విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కంటైన్‌మెంట్‌ జోన్‌లోకి ఇంజినీరింగ్‌ క్యాంపస్‌లోని (Andhra University) 7 బ్లాక్‌లను చేర్చారు. క్వారంటైన్‌లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహాలు చేశారు.

Narasaraopet Shocker: భర్త నిద్రపోతుండగా పెట్రోలు పోసి తగలబెట్టేసింది, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య కిరాతకం, నరసరావుపేటలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి ఓ మహిళ నిప్పంటించింది. ఈ దారుణ ఘటన నరసరావుపేట మండలం, పెట్లూరివారిపాలెంలో (Narasaraopet Shocker) జరిగింది అక్కడి పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పెట్లూరివారిపాలేనికి చెందిన మద్దమాల చెంచయ్య (42), అన్నమ్మ దంపతులు. వారికి 20 ఏళ్ల క్రితం వివాహమైంది. చెంచయ్య లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుతున్నాడు.

Neelam Sahni: తిరుపతి ఉప ఎన్నికల్లో కుడి చేతి వేలికి సిరా, ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని, ఈ నెల 31తో ముగియనున్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం, వచ్చే నెల 17న తిరుపతికి ఉప ఎన్నిక

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు నీలం సాహ్ని పేరును (Andhra Pradesh new SEC) గవర్నర్ బీబీ హరిచందన్ ఆమోదించారు. ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) స్థానంలో సాహ్ని పదవీ బాధ్యతలు తీసుకుంటారు

COVID19 in AP: దడ పుట్టిస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 984 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 4 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో సెకండ్ వేవ్ కోవిడ్ ఉధృతి దడ పుట్టిస్తుంది, ఒక్కసారిగా కేసులు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో రోజూవారీ కేసుల సంఖ్య వెయ్యికి చేరువైంది. గడిచిన కొన్ని నెలల్లో ఇదే అత్యధికం. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల...

Advertisement
Advertisement