ఆంధ్ర ప్రదేశ్

AP Police: తమిళనాడు ఎన్నికల్లో సేవా దృక్పథాన్ని చాటుకున్న ఏపీ పోలీసులు, ఓటింగ్ వేయడానికి వచ్చినవారికి సాయం, దగ్గరుండి వారికి సేవలు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

Hazarath Reddy

రాష్ట్రాలను దాటిన ప్రకాశం పోలీసుల సేవా దృక్పథం; Tamilnadu election వీధులలో ఓటింగ్ వేయడానికి వచ్చినవారికి మానవతా దృక్పథంతో ప్రకాశం పోలీసులు సేవ చేశారు. వారిని దగ్గరుండి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్లి తమ ఉదారభావాన్ని చాటుకున్నారు.

AP ZPTC & MPTC Elections 2021: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, కౌంటింగ్‌ జరపొద్దని ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్‌ ఎన్నికలు

Hazarath Reddy

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల కౌంటింగ్‌ జరపొద్దని హైకోర్టు (AP High court) ఆదేశించింది. సింగిల్‌ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్‌ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది.

AP Covid Report: ఏపీలో తాజాగా 1,941 మందికి కరోనా నిర్ధారణ, ఒక్క గుంటూరు జిల్లాలోనే 424 కొత్త కేసులు, రాష్ట్రవ్యాప్తంగా 11,809 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,657 కరోనా టెస్టులు నిర్వహించగా 1,941 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే 424 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు తర్వాత అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 323, విశాఖ జిల్లాలో 258, నెల్లూరు జిల్లాలో 231, కృష్ణా జిల్లాలో 212 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 25 పాజిటివ్ కేసులు గుర్తించారు.

Ramana Dikshitulu Meets AP CM: సీఎం జగన్‌ను మహావిష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులు, సీఎంతో మర్యాదపూర్వక భేటీ, అర్చకుల వంశపారంపర్య హక్కులను కాపాడారంటూ కృతజ్ఞతలు

Hazarath Reddy

పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడంతో, రమణ దీక్షితులు తిరిగి టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు నేడు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. అర్చకుల వంశపారంపర్య హక్కులను కాపాడారంటూ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

AP ZPTC & MPTC Polls: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌, పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ తాజాగా ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని తెలిపిన ఏపీ అత్యున్నత న్యాయస్థానం

Hazarath Reddy

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. పరిషత్ ఎన్నికలను (AP ZPTC & MPTC Polls) నిలిపేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు (AP High Court) పేర్కొంది. ఈ నెల 1న ఎస్‌ఈసీ (SEC) జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది

MLA Roja: సర్జరీల తర్వాత తొలిసారి బయటకు వచ్చిన ఎమ్మెల్యే రోజా, ప్రచారంలో పాల్గొనలేకపోతున్నానంటూ వీడియో సందేశం, నా ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్

Hazarath Reddy

ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు (ysrcp-Nagari mla-roja) రెండు శస్త్ర చికిత్సలు జరిగిన విషయం విదితమే. విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేసుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రోజా ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కోలుకుంటున్నారు.

AP Police: తమిళనాడు ఎన్నికల్లో హృదయాలను గెలుచుకున్న ఏపీ పోలీస్, ఓటువేసేందుకు పసిబిడ్డతో వచ్చిన తల్లి, ఓటు వేసే వరకు ఆ పసిబిడ్డను తన దగ్గరే ఉంచుకున్న అనంతపురం కానిస్టేబుల్

Hazarath Reddy

తమిళనాడు ఎన్నికల్లో ఏపీ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసేందుకు పసిబిడ్డతో ఓ తల్లి వచ్చింది. లోపలికి వెళ్లేందుకు ఆమె పసిబిడ్డను ఎవరికి ఇవ్వాలో తెలియలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఆ పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నాడు.

Jagananna Smart Town: జగనన్న స్మార్ట్‌ టౌన్‌కు దరఖాస్తులు స్వీకరణ, విజయవాడకు 5 కిలోమీటర్ల దూరంలో ఇంటి స్థలాలు, రూ.3 లక్షల నుంచి రూ.18 లక్షలలోపు సంవత్సరాదాయం కలిగిన వారందరూ అర్హులే

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జగనన్న స్మార్ట్‌ టౌన్‌ పథకానికి (Jagananna Smart Town scheme) శ్రీకారం చుట్టింది.

Advertisement

AP Coronavirus: దేశంలో కోవిడ్ కలవరం, 11 రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో రేపు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ అత్యవసర సమావేశం, ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 7,244కి చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

కొవిడ్-19 ప్రభావం అధికంగా ఉన్న 11 రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యమంత్రులతో రేపు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ (Union Health Minister Harshavardhan) సమావేశం కానున్నారు. గడచిన 24 గంటల్లో లక్షకు పైగా కొవిడ్-19 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ ఉదయం వెల్లడించింది. గతేడాది కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

AP Coronavirus: ఏపీలో కొత్తగా 1,326 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 7,244కి చేరుకున్న మరణాల సంఖ్య, ప్రస్తుతం 10,710కు చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 10,710కి చేరింది. గడచిన 24 గంటల్లో 30,678 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 282 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171, కృష్ణా జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయి.

Chhattisgarh Encounter: అమర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 30 లక్షల ఆర్థిక సాయం, రెండు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్, జవాన్ల వీరమరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ దాడిలో మరణించిన జవాన్ల మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల (jawans) కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

AP Coronavirus: ఏపీలో 10 వేలు దాటిన యాక్టివ్ కేసులు, తాజాగా 1,730 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతితో 7,239కు చేరుకున్న మరణాల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,730 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (AP Covid Update) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,07,676 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 842 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 8,90137 డిశ్చార్జ్‌ అయ్యారు.

Advertisement

AP Covid Update: మెల్లిగా పెరుగుతున్న కేసులు, ఏపీలో 10 వేలు దాటిన యాక్టివ్ కేసులు, తాజాగా 1,730 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతితో 7,239కు చేరుకున్న మరణాల సంఖ్య, ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,730 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (AP Covid Update) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,07,676 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Hyderabad Shocker: అత్తింటి వేధింపులతో అల్లుడు ఆత్మహత్య, భార్య కళ్ల ముందే బావమరిది, అత్త మామల అవమానం, తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు, అవమానాలు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య (Man End His Life) చేసుకున్నాడు. భార్య కళ్ల ముందే బావమరిది, అత్త మామలు కొట్టడమే కాకుండా అవమానానికి గురి చేశారని మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య (Man Commits Suicide) చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Roja Discharged From Hospital: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే రోజా, మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపిన డాక్టర్లు, రోజాను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Hazarath Reddy

రెండు మేజర్‌ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి (Roja Discharged From Hospital) అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు.

AP Shocker: నాలుగేళ్ల పాపని వదలని 14 ఏళ్ల కామాంధుడు, దారుణంగా అత్యాచారం, చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో విషాద ఘటన, రాత్రికి రాత్రే నిందితుని కుటంబం పరార్, దిశ, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలంలో ఈ కిరాతకం చోటు చేసుకుంది.

Advertisement

AP Coronavirus: గిరిజన సంక్షేమ పాఠశాలలో కరోనా కల్లోలం, తాజాగా 1,398 మందికి కరోనా వైరస్, ఏపీలో కరోనాతో ఒకేరోజు 9 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,398 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (COVID-19 positive cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,05,946 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 787 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 8,89,295 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి 9 మంది (Covid Deaths) మరణించగా, ఇప్పటివరకు 7,234 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 1,51,77,364 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

AP Coronavirus: ఏపీలో కరోనాతో ఒకేరోజు 9 మంది మృతి, తాజాగా 1,398 మందికి కరోనా వైరస్, ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్‌ కేసులు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలలో కరోనా కల్లోలం

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,398 మందికి పాజిటివ్‌గా నిర్థారణ (COVID-19 positive cases) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,05,946 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 787 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 8,89,295 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

TTD Key Decision: ఆలయ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు రీఎంట్రీ, పదవీ విరమణ చేసిన అర్చకులు తిరిగి విధుల్లో చేరాలని ఉత్తర్వులు, హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన టీటీడీ

Hazarath Reddy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు (retired priests) తిరిగి విధుల్లో చేరేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు తిరుమల దేవస్థాన కమిటి (Tirumala Tirupati Devasthanam) ఉత్తర్వులు జారీ చేసింది.

RTC Bus Fire: కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు, ప్రమాదంలో సగం వరకు కాలిపోయిన ఇంద్ర బస్, బస్సులోని 15 మంది సేఫ్

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్‌లో (Kakinada RTC Bus Fire) అనూహ్యంగా మంటలు చెలరేగాయి. జిల్లా పరిషత్‌ సెంటర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్‌లో మంటలు (Fire Breaks Out In RTC Bus At Kakinada) రావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. 

Advertisement
Advertisement