ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం, రొయ్యల చెరువు ఫోటోలు తీస్తున్నారని యువకుడిని స్తంబానికి కట్టేసి కొట్టిన రైతులు..వీడియో ఇదిగో

Arun Charagonda

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో కొంతకాలంగా ఆక్వా సాగుకు వ్యతిరేకంగా కొందరు యువకుల ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించి రొయ్యల చెరువులు మూసివేయించారు. అయితే సోమవారం సాయంత్రం రొయ్యల సాగు తిరిగి ప్రారంభిస్తున్నారని తెలుసుకున్న చిక్కం వీరదుర్గాప్రసాద్‌ ఆ ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసే ప్రయత్నం చేయగా ఆగ్రహించిన రైతులు యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు. ప్రస్తుతం బాధితుడికి అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.

Mudragada Padmanabha Reddy: వీడియో ఇదిగో, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటా, ముద్రగడ పద్మనాభ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ బలోపేతం చేసి మళ్లీ జగన్ ని సీఎం గా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం, లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలంటూ హాస్టల్ గోడ దూకి పరార్..

Hazarath Reddy

విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్ళిన ఆదివాసి గిరిజనులు, అల్లూరి జిల్లాలో ఘటన

Hazarath Reddy

రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్తున్న ఆదివాసి గిరిజనులు వీడియో వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సిలకమ్మ మరణించింది.

Advertisement

YS Jagan: జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం దావా, ఆ రెండు పత్రికలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు, ఇకపై ఎటువంటి కథనాలు ప్రచురించరాదని న్యాయస్థానం ఆదేశాలు

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ప్రచురించిన తప్పుడు, దురుద్దేశపూ­ర్వక కథనాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు, పోలీసుల విచారణకు సహకరించాలని సూచన

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆర్జీవీకి అన్నీ కేసుల్లో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు, అనకాపల్లి జిల్లా రావికమతం స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

Weather Forecast: బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగు­తున్న అల్ప­పీడనం, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప­పీడనం స్థిరంగా కొనసాగు­తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప- 2 సినిమా చూస్తూ రాయదుర్గంలో వ్యక్తి మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర సృష్టిస్తోంది. తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Advertisement

Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)

Rudra

తమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.

Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)

Rudra

ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.

Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహ‌న్‌ బాబు, మ‌నోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

Rudra

మంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహ‌న్‌బాబు, మ‌నోజ్ ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Rajendra Prasad Shocking Comments on Allu Arjun: ‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)

Rudra

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా `హరికథ` అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్‌ తో పాటు శ్రీరామ్‌, మౌనిక రెడ్డి, అర్జున్‌ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Threat Calls to Pawan Kalyan: చంపేస్తామంటూ పవన్ కల్యాణ్‌కి బెదిరింపు కాల్స్, నిందితుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్‌ను చంపేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ అభ్యంతకర భాషలో హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపించాడు

Anitha vs Vijaysai Reddy: వచ్చే ఎన్నికల్లో మీకు ఆ 11 సీట్లు కూడా రావు, విజయసాయి రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఏపీ హోం మంత్రి అనిత

Hazarath Reddy

చేసిన తప్పులు బయటపడుతున్నాయనే భయంతో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. స్థాయి, వయసు మరిచిపోయి చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో విషాదం, భార్యను చంపాననే మనస్థాపంతో ఆమె సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న భర్త

Hazarath Reddy

గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణా­లు కోల్పోయింది. భార్య­ను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవి­తం గడిపిన తరువాత శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు.

Rajya Sabha By-Election 2024: ఏపీ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య, త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం

Hazarath Reddy

ఏపీ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ (Rajya Sabha) ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌, హర్యాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ పార్టీ సోమవారం ప్రకటించింది.

Advertisement

Road Accident Video: వీడియో ఇదిగో, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, క్లీనర్ సజీవ దహనం, గాయాలతో బయటపడ్డ వ్యాన్ డ్రైవర్

Hazarath Reddy

విజయనగరం భోగాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనక నుండి వ్యాన్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. వ్యాన్ లో చెలరేగిన మంటల్లో వ్యాన్ క్లీనర్ సజీవదహనం అయ్యారు. వ్యాన్ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు.

Nandyal Horror: నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై పెట్రోల్ పోసి హత్య.. అనంతరం తానూ తగులబెట్టుకొని ఆత్మహత్యాయత్నం (వీడియో)

Rudra

ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డినగర్‌ లో దారుణం జరిగింది. ఓ బాలికపై ఓ ప్రేమోన్మాది ఘోరానికి పాల్పడ్డాడు. ప్రేమించడంలేదంటూ విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనంతరం తాను కూడా నిప్పంటించుకున్నాడు.

Ambati Rambabu Fire on Kutami: టీడీపీకి ఒక చ‌ట్టం, వైసీపీకి ఒక చ‌ట్ట‌మా? మాపై ట్రోలింగ్ చేసిన వారిపై కేసులుండ‌వా? అని ప్ర‌శ్నించిన అంబ‌టి రాంబాబు

VNS

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో దారుణం...పొలాల్లో మహిళ మృతదేహం, వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి శివారులోని పంటపొలాల్లో మృతదేహం లభ్యమైంది. మృతురాలు రంగా కాలనీకి చెందిన తోకల రమాదేవిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు.

Advertisement
Advertisement