ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఉరి వేసుకుని ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి
Vikas Mఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి కన్నీరు అందరిచేత కంటతడిపెట్టించింది. ఇంతమంది టీచర్లు ఉండి ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది
Amaravati: ఇక శరవేగంగా ఏపీ రాజధాని అమరావతి పనులు, రూ. 15వేల కోట్ల రుణం వాడకంపై ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, పనులు వేగవంతం చేయనున్న సీఆర్టీఏ
VNSఅమరావతి (Amaravati) నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది.
Aghori At Srisailam: శ్రీశైలంలో ప్రత్యక్షమైన అఘోరి, బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు...వీడియో ఇదిగో
Arun Charagondaకొద్దికాలంగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమైంది. బట్టలు లేకుండా దర్శనానికి అనుమతి లేదని ముఖద్వారం వద్ద అఘోరిని అడ్డుకున్నారు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది. దీంతో బట్టలు కట్టుకుని స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లింది అఘోరి.
YSRCP Sajjala Bhargav Reddy: వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు, పోస్టులను ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారని బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు
Arun Charagondaవైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేయగా భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Andhra Pradesh: కడపలో నడిరోడ్డుపై ప్రత్యక్షమైన కొండ చిలువ, కాసేపు నిలిచిన రాకపోకలు...వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేవ్లో నడిరోడ్డుపై కొండచిలువ ప్రత్యక్షమైంది. కడప జిల్లా మైదుకూరు ప్రధాన జాతీయ రహదారి పెన్నా నది బ్రిడ్జి సమీపంలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి వెళ్లే మార్గంలో ఘటన చోటు చేసుకుంది. భయాందోళనకు గురై కాసేపు రాకపోకలు నిలిపివేశారు వాహనదారులు.
Destruction Of Pochamma Temple: పోచమ్మ దేవాలయంలో అమ్మవారి బట్టలను తీసేసిన దుండగులు.. అమ్మవారి కళ్ళు ధ్వంసం.. శంషాబాద్ లో ఘటన (వీడియో)
Rudraహిందూ దేవాలయాలపై వరుస దాడులతో శంషాబాద్ ప్రాంతం ఉలిక్కి పడుతున్నది. మొన్న ఎయిర్ పోర్ట్ కాలనీ లోని హనుమాన్ దేవాలయం, కట్ట మైసమ్మ దేవాలయంపై దాడులను మరిచిపోకముందే తాజాగా మరో దారుణం జరిగింది.
AP Rains: మళ్లీ వాన పిలుపు.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
Rudraనైరుతి బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.
Viral Video: బైక్ పై ఆడుకుంటూ కూర్చున్న చిన్నారి ప్రమాదవశాత్తూ రోడ్డుపైకి.. అప్పుడే ట్రక్కు రావడంతో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Rudraరోడ్డుమీదకు చిన్నారులతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తతో వ్యవహరించినా జీవితాంతం బాధ పడాల్సిందే. ఇదీ అలాంటి ఘటనే. ఓ చిన్నారిని బైక్ పై కూర్చోపెట్టి తల్లిదండ్రులు వెళ్లారు.
YS Jagan Hit out AP CM Chandrababu: ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తున్నదెవరు? చంద్రబాబుపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డ వైఎస్ జగన్
VNSసామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు (AP CM Chandrababu) తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్ట విరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా?` అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Andhra Pradesh: పశ్చిమ గోదావరిలో మున్నాబాయ్ ఎంబీబీఎస్, డాక్టర్గా మారిన ఆర్ఎంపీ, ఫిర్యాదులు రావడంతో బయటకు వచ్చిన బాగోతం, ఆస్పత్రి సీజ్
Arun Charagondaపశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సోమరాజు చెరువు గ్రామంలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ బయటపడ్డాడు. నకిలీ డాక్టర్ RMP ముసుగులో MBBS డాక్టర్ లా చలామణి అవుతూ.. పేషెంట్లకు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఆసుపత్రితో పాటు మెడికల్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో ఆస్పత్రిని, మెడికల్ షాపును తనిఖీ చేశారు అధికారులు. అనంతరం ఆసుపత్రి, మెడికల్ షాప్ సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
Andhra Pradesh Nominated Posts: ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవుల రెండో జాబితా రిలీజ్, 59 మందికి దక్కిన ఛాన్స్...పూర్తి జాబితా ఇదే
Arun Charagondaఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే తొలి దశలో పలువురికి అవకాశం కల్పించగా తాజాగా రెండో దశలో 59 మందికి ఛాన్స్ ఇచ్చారు. జనసేన, బీజేపీ నేతలకు ప్రాధాన్యం కల్పించారు.
AP CM Chandrababu: భవిష్యత్ అంతా టూరిజందే, ఏపీకి టూరిజం ఒక వరం..సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఏపీని నెంబర్ వన్గా నిలుపుతామన్న ముఖ్యమంత్రి
Arun Charagondaఇక భవిష్యత్తులో ఒకటే ఇజం..అదే టూరిజం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ – శ్రీశైలం మధ్య ఆధ్యాత్మికతను పెంచేలా, ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ఏపీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం... సీ ప్లేన్ ప్రయాణం ఒక వినూత్నమైన ప్రయాణం అన్నారు.
Vangalapudi Anitha On Pawan Kalyan: ఏపీలో బాలికపై దారుణం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్కు స్పందించిన హోంమంత్రి అనిత, బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్కు స్పందించారు హోంమంత్రి అనిత. నెల్లూరు వెంకటేశ్వరపురం, భగత్ సింగ్ కాలనీలో ఓ మైనర్ బాలిక (13)ను 45 ఏళ్ల మహిళపై అలీ అనే వ్యక్తి లైంగికంగా దాడి చేసి, బెదిరించాడంటూ జనసేన వీర మహిళ విభాగం ట్వీట్ చేసింది.
Borugadda Anil: ఏకంగా పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్కు రాచమర్యాదలు, వైరల్గా మారిన వీడియో
Arun Charagondaఏకంగా పోలీస్ స్టేషన్ లోనే బోరుగడ్డ అనిల్ కు పోలీసుల రాచ మర్యాదలు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులో విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చారు బోరుగడ్డ అనిల్. ఆయనకు పడుకునేందుకు దిండు, దుప్పటి ఇచ్చి రాచ మర్యాదలు చేశారు పోలీసులు.
Nagarjuna Sagar Project: మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం, తెలంగాణ ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్న ఏపీ అధికారులు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ
Arun Charagondaమరోసారి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం నెలకొంది. KRMB ఆదేశాల ప్రకారం.. ప్రతిరోజు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల వివరాలు నమోదు చేస్తున్నారు తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.
ATMs Shutting Down: 12 నెలల్లో 4 వేల ఏటీఎంలు మూత.. డిజిటల్ లావాదేవీల పెరుగుదలే కారణం
Rudraదేశంలో నగదు చలామణి కొత్త రికార్డులకు చేరుకొంటున్నాయి. అయితే, విచిత్రంగా దేశీయ బ్యాంకులు తమ ఏటీఎం నెట్ వర్క్ లను తగ్గిస్తున్నాయి. దీంతో గత 12 నెలల వ్యవధిలో ఏకంగా 4 వేల ఏటీఎంలు మూతపడ్డాయి.
Andhra Pradesh: అనకాపల్లి రైల్వే స్టేషన్లో షాకింగ్ సంఘటన, ఫ్లాట్ ఫామ్ - రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు..వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్ప్రెస్కి, ఫ్లాట్ ఫామ్కి మధ్య ఇరుక్కున్నాడు ఓ ప్రయాణికుడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్ని తవ్వి ప్రయాణికుడిని రక్షించారు.
Andhra Pradesh: కరెంట్ పోల్ ఎక్కి తమిళనాడు యువకుడి ఆత్మహత్య, అత్తిలి రైల్వే స్టేషన్లో ఘటన...వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్లోని అత్తిలి రైల్వే స్టేషన్లో కరెంట్ పోల్ ఎక్కి తమిళనాడు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరెంట్ పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్టేషన్ మాస్టర్. ఈ క్రమంలో కరెంట్ తీగలను తాకి కింద పడి చనిపోయాడు యువకుడు.
Lady Aghori at Mahanandi Temple: మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. తాజాగా ఆమె యాగంటి క్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. లోక కళ్యాణం చేయడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. ఎంత మంది ఎన్ని విమర్శించినా తన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.
Road Accident in Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. బాధితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు.. పూర్తి వివరాలు ఇవిగో.. (వీడియోతో)
Rudraకర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం వద్ద ఓ బొలేరో వాహనం మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.