ఆంధ్ర ప్రదేశ్

Tirupati Laddu Row: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, వారిపై మరో ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

SC On Tirupati Laddu Row: కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా

Arun Charagonda

తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూల తయారికి వాడారా అన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అభిప్రాయపడింది. కల్తీ జరిగిందని భావిస్తే ఆ లడ్డూలను టెస్టులకు పంపారా అని ప్రశ్నించింది సుప్రీం. విచారణకు ముందే ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని.. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు ఆధారాలు లేవని వెల్లడించింది.

Detonator Blast In Kadapa: కడపలో దారుణం, డిటోనెటర్లు పేలి వీఆర్ఏ నరసింహ మృతి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామం బాంబుల మోతతో దద్దరిల్లింది. వీఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లు పేలడంతో నరసింహ మృతి చెందాడు.

Tirupati Laddu Row: మూడో రోజు తిరుమలలో సిట్ దర్యాప్తు, లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించిన సిట్ సభ్యులు..వీడియో

Arun Charagonda

తిరుమలలో మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ‌ లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్నారు సిట్ అధికారులు. ఇక ఇవాళ తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారనుంది న్యాయస్థానం.

Advertisement

Tirupati Laddu Row: సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..చంద్రబాబు ఆరోపణలు నిరాధరమైనవి అన్న సుబ్రమణ్యస్వామి

Arun Charagonda

రేపు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారని..సుప్రీంకోర్టు విచారించి అసలు విషయాలు బయట పెట్టాలని పిటిషన్ దాఖలు చేశారు.

Suman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదంపై హీరో సుమన్, లడ్డూ కల్తీ నిజమని తేలితే ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. తిరుమల లడ్డూ కల్తీ చేసింది నిజమని తేలితే.. వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని సుమన్ సంచలన కామెంట్స్ చేశారు.

CJI DY Chandrachud: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్, గర్బాలయంలో ప్రత్యేక పూజలు చేస చంద్రచూడ్..వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద స్వాగతం పలికారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు జస్టిస్ చంద్రచూడ్. రంగనాయకుల మండపంలో జస్టిస్ కు ఆశీర్వచనం అందించారు పండితులు.

IIFA 2024 Awards: బాలయ్య కాళ్లకు నమస్కరించి తన సింప్లీసిటీ చాటుకున్న అందాల తార ఐశ్వర్యరాయ్.. వైరల్ వీడియో

Rudra

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కాళ్లకు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నమస్కరించారు. అబుధాబిలో జరిగిన ఐఫా ఉత్సవం-2024లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

Leopard found at Tirumala: తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుత కలకలం.. భయంతో కంట్రోల్ రూమ్‌లోకి పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది (వీడియో)

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడు కొండల వెంకన్నను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఎక్కడెక్కడి నుండో భక్తులు రోజూ తరలి వస్తుంటారు. కొండపైకి భక్తులు నడక మార్గంలో వెళ్లడానికే ఇష్టపడతారు. అయితే గత ఏడాది నుండి నడకమార్గంలో వెళ్తున్న భక్తులను చిరుతలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Rajinikanth Reaction On Tirumala Laddu: తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రియాక్ష‌న్ చూశారా? వెట్ట‌యాన్ ప్ర‌మోష‌న్ లో ర‌జ‌నీ ఏం చెప్పాడంటే?

VNS

ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా ఇదే అంశంపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని ప్రశ్నించగా.. సమాధానం చెప్పేందుకు ఆయన పెద్దగా ఆస‌క్తి కనబరచలేదు.

SIT Team Visits Tirumala: తిరుమలలో సిట్ టీం, కల్తీ నెయ్యిపై విచారణ..వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమల లడ్డూ లో వినియోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు, ఇతర పదార్థాలు ఉన్నాయని దానిపై విచారణ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఈరోజు తిరుపతి లోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకుంది.

RK Roja On Chandrababu: శ్రీవారి మీదే నమ్మకం లేకుండా చేశారు, ఫేక్ రిపోర్టుతో డిఫెన్స్‌లోకి చంద్రబాబు, దేవుడు శిక్ష వేసిన బాబుకు బుద్దిరాలేదన్న మాజీ మంత్రి రోజా

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి రోజా. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రోజా.. తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చాడంతో అదే తిరుమలలో చంద్రబాబు కు బాంబ్ బ్లాస్ట్ జరిగి.. దేవుడు శిక్ష వేసిన బుద్దిరాలేదన్నారు. చంద్రబాబు తన విధానాలతో వెంకటేశ్వర స్వామి మీదే నమ్మకం లేకుండా చేశాడన్నారు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు దేశంలో ఏ రాజకీయ నేత చేయలేదు అని దుయ్యబట్టారు.

Advertisement

CM Chandrababu On Religions: ఏపీలో త్వరలో కొత్త చట్టం, ఏ మతాలకు చెందిన మందిరాల్లో వారే పనిచేయాలన్న సీఎం చంద్రబాబు, ఆలయాల్లో అన్యమతస్థులు ఉండటానికి వీల్లేదని వెల్లడి

Arun Charagonda

ఏపీలో త్వరలో కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలన్నారు.

Harish Rao: తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి (వీడియో)

Rudra

హైడ్రా మూసీ బాధిత కుటుంబాలు శనివారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కాసేపట్లో వారితో మాట్లాడి వారి సమస్యలను వినబోతున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు.

HYDRA Notices to Shilpa Mohan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహ‌న్ రెడ్డికి 'హైడ్రా' నోటీసులు.. సంగారెడ్డి జిల్లాలోని న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్ వేసిన‌ట్లు గుర్తింపు

Rudra

ఏపీ మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట మండ‌లం నాగ్స‌న్‌ ప‌ల్లిలోని న‌ల్ల‌వాగును ఆయన ఆక్ర‌మించి వెంచ‌ర్ వేసిన‌ట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.

Jagan Press Meet: దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో ఇదే మొదటిసారి, ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ మండిపడిన వైఎస్‌ జగన్‌

Hazarath Reddy

తన రాజకీయ జీవితంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి అయిన తాను తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.

Advertisement

Jagan Cancels Tirupati Visit: జగన్ తిరుమల పర్యటన రద్దు, తిరుపతి పర్యటన పూర్తి వివరాలపై కాసేపట్లో ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్న వైసీపీ అధినేత

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు.

Andhra Pradesh: షాకింగ్ వీడియో, వాగు దాటేందుకు బాలింత కష్టాలు, భుజంపై మోసి పెద్దేరు వాగును దాటించిన కుటుంబ స‌భ్యులు

Hazarath Reddy

వాగు దాటేందుకు బాలింత కష్టాలు...అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో బాలింత‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ళేందుకు అవ‌స్థ‌లు ప‌డిన కుటుంబ స‌భ్యులు. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో బాలింత‌ను భుజంపై మోసి, పెద్దేరువాగు దాటించిన కుటుంబ స‌భ్యులు. ప్ర‌భుత్వం స్పందించి త‌మ గ్రామానికి బ్రిడ్జ్ నిర్మించాల‌ని కోరుతున్న గ్రామ‌స్తులు

Andhra Pradesh: చంద్రబాబుపై ప్రేమతో ఓట్లు వేయలేదు, జగన్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఓట్లు పడ్డాయి, చంద్రబాబు విజయంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైసీపీ అధినేత జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే చంద్రబాబుకు ఓట్లు పడ్డాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కూటమి పార్టీలపై ప్రేమతో ఓట్లు పడలేదని ఆమె చెప్పారు. చంద్రబాబు సీఎంగా వద్దు అనుకున్న ఓటర్లు కూడా 38 శాతం మంది ఉన్నారని అన్నారు

Tirupati Laddu Row: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనిపించడం లేదు, పోస్టర్లు రిలీజ్ చేసిన బీజేపీ నేత, ఆచూకీ తెలిపిన వారికి బహుమతి అంటూ ప్రకటన

Arun Charagonda

తిరుమల లడ్డూ వ్యవహారంలో టీటీడీ మాజీ EO ధర్మా రెడ్డి కనబడుట లేదని పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నేత నవీన్ రెడ్డి...ధర్మారెడ్డి కనిపించడం లేదని ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.1116/- బహుమతి ఇస్తానని ప్రకటించారు. తిరుమల లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే.. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని తెలిపారు బీజేపీ నేత.

Advertisement
Advertisement