Jesus Christ On Receipts: విశాఖ ట్రాఫిక్ పోలీసుల రసీదులపై ఏసుక్రీస్తు బోధనలు.. ఆటోలకు జారీ చేసే రసీదులపై ప్రింట్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
విశాఖపట్టణం ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఆటో రసీదులు వివాదానికి దారితీశాయి. ఆ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ఉండడమే దీనికి కారణం.
Visakhapatnam, Nov 26: విశాఖపట్టణం (Visakhapatnam) ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) జారీ చేసిన ఆటో రసీదులు వివాదానికి దారితీశాయి. ఆ రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు (Jesus Christ Quotes) ఉండడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి రైల్వే స్టేషన్ ఆవరణలో (Premises of Railway Station) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్ (Auto Stand Which was under Traffic Police Station) రసీదులపై ఏసు క్రీస్తు బోధనలు ముద్రించి ఉన్నాయి.
పోలీసులు తమకు జారీ చేసిన రసీదులను కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలిసిన బీజేపీ నేతలు ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనికి పోలీసులు స్పందిస్తూ తమ వద్ద రసీదులు అయిపోవడంతో తమకు ఎప్పుడూ రసీదు పుస్తకాలు ముద్రించి ఇచ్చే వారి నుంచి తమ సిబ్బంది ఓ పుస్తకం తెచ్చారని తెలిపారు. అయితే, వాటిపై ఏసు బోధనలు ఉండడం చూశాక వెంటనే వాటిని జారీ చేయడం ఆపేశామని ట్రాఫిక్ అదనపు డిప్యూటీ కమిషనర్ హరీవుల్లా వివరణ ఇచ్చారు.
(The above story first appeared on LatestLY on Nov 26, 2022 09:10 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

