తెలంగాణ

Telangana: రైతు బతుకు ఇంతేనా, ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటంతా నేలపాలు, వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరిబస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా

Hazarath Reddy

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి వాగు పై సరైన వంతెన లేకపోవడంతో శమొల్ల సాయినాథ్ అనే యువ రైతు పండించిన సొయా పంట వాగులో ట్రాక్టర్ బోర్ల పడింది. కళ్ళ ముందు పండించిన పంట నీళ్లలో మునగడంతో యువ రైతు దుఃఖంలో మునిగిపోయారు.

IT Raids At Real Estate Firms: ప్ర‌ముఖ‌ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీల‌పై ఇన్ క‌మ్ ట్యాక్స్ దాడులు, పేరుమోసిన బిల్డ‌ర్ల ఇళ్ల‌లో విస్తృత సోదాలు

VNS

హైదరాబాద్‌లో ఐటీ (IT Raids) అధికారులు మరోసారి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఏకకాలంలో 30 చోట్ల దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడకు చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారు (Real Estate)ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు.

High Tension in Ashok Nagar: హైద‌రాబాద్ అర్ధ‌రాత్రి హై టెన్ష‌న్, ఒక్క‌సారిగా రోడ్ల‌పైకి వ‌చ్చిన నిరుద్యోగులు, అశోక్ న‌గ‌ర్ లో భారీగా పోలీసుల మోహ‌రింపు

VNS

అశోక్‌నగర్‌ మరోసారి రణరంగంలా మారింది. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు (Group 1 Candidates) రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ‘వీ వాంట్‌ జస్టిస్‌’ అంటూ గర్జించారు.

Medak Road Accident: మెదక్‌ జిల్లా రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

Hazarath Reddy

మెదక్‌ జిల్లా శివంపేట పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Medak Road Accident: మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డుపై ఉన్న గుంత, ఇందులో ముగ్గురు చిన్నారులు

Arun Charagonda

మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ దగ్గర రోడ్డుపై ఓ గుంత ఏర్పడింది.వేగంగా వెళ్లిన ఓ కారు ఆ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

Bhatti Vikramarka On Hyderabad Development: బిల్డర్ల సమస్యలను పరిష్కరిస్తాం..హైదరాబాద్ నగర విస్తరణకు చర్యలు తీసుకుంటాం అన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Arun Charagonda

హైదరాబాద్ నగర విస్తరణకు సకల చర్యలు తీసుకుంటాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగితే నిర్మాణరంగం విస్తరిస్తుందన్నారు. బిల్డర్ల సమస్యలను గౌరవించి పరిష్కరిస్తాం అని తెలిపారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ నగర అభివృద్ధికి పదివేల కోట్లు కేటాయించామన్నారు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.

Kadiyam Srihari: ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల ధర్నా, తొలి నుండి పార్టీలో ఉన్న వారిని పట్టించుకోవడం లేదని ఫైర్..కడియంకు వ్యతిరేకంగా నినాదాలు

Arun Charagonda

కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతుదారులు ఆందోళన చేశారు. పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాకుండా.. కడియం శ్రీహరి వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.

Telangana: విద్యార్థిని చితక బాదిన క్లాస్ టీచర్..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..వీడియో చూసి అంతా కన్నీటి పర్యాంతం

Arun Charagonda

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెం మానస వికాస స్కూల్లో విద్యార్థిని చితకబాదాడు ఓ ఉపాధ్యాయుడు. ఏమైందని తల్లి అడగగా, క్లాస్ టీచర్.. విచక్షణ రహితంగా కొట్టాడంటూ కన్నీరు పెట్టుకున్నాడు బాలుడు.సీసీ టీవీలో దృశ్యాలు రికార్డు కాగా వీడియో చూసి కన్నీటి పర్యాంతమయ్యారు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Hydra: హైదరాబాద్‌లో స్థలం కొనాలనుకుంటున్నారా..ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో  స్థలం ఉందని భయపడుతున్నారా?, అయితే మీరు కొనాలనుకునే లేదా ఉన్న స్థలం ఎఫ్‌టీఎల్‌-బఫర్‌జోన్‌లో ఉందా ఇలా తెలుసుకోండి!

Arun Charagonda

హైడ్రా..ఈ పేరు వింటేనే అక్రమార్కులు భయపడే స్థితికి వచ్చేశారు. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ కొనాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజల భయాలను తొలగించేందుకు హెచ్‌ఎండీఏ నడుం బిగించింది.

Devisri Prasad Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దేవిశ్రీ ప్రసాద్, 19న జరిగే సంగీత కార్యక్రమానికి ఆహ్వానం.వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క లను మర్యాదపూర్వకంగా కలిశారు సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించారు దేవిశ్రీ ప్రసాద్.

Jagtial: మంత్రగాళ్లను చంపేస్తాం..జగిత్యాలలోని గ్రామంలో వెలసిన పోస్టర్లు,భయాందోళనలో గ్రామస్థులు...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల - మేడిపెల్లి మండలం కట్లకుంట గ్రామంలో మంత్రగాళ్లను చంపబోతున్నామని వార్నింగ్ ఇస్తూ పోస్టర్లు వెలిశాయి. మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్రగాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం అంటూ పోస్టర్ వేశారు. భయాందోళనలో గ్రామస్థులు, విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Hyderabad Rains: వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు,హైదరాబాద్‌లో ఉదయం నుండే భారీ వర్షం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రెండు రోజులుగా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా వాయుగుండం ప్రభావంతో వర్షాలు మరింత ఎక్కువగా కురుస్తాయని తెలిపింది.

Advertisement

Telangana Govt Relieved IAS Officers: ఆ ఐదుగురు ఐఏఎస్ ల‌ను రిలీవ్ చేసిన రేవంత్ స‌ర్కార్, ఏపీలో రిపోర్ట్ చేయాల్సింది ఈ రోజే.. లంచ్ మోష‌న్ దాఖ‌లు చేయ‌నున్న ఐఏఎస్ లు

VNS

ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి (Amrapali), రొనాల్డ్ రాస్, వాణి ప్రసాద్, వాకాటి కరణ, ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ లను కేంద్ర ఉత్తర్వులు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. నాలుగు రోజుల క్రితమే ఐఏఎస్ లను రివీవ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ కావాలని డీవోపీటీ (DOPT) ఆదేశాలకు అనుగుణంగా ఐఏఎస్ లతోపాటు ఐపీఎస్ అధికారిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.

BJP MLA Rakesh Reddy: వీడియో ఇదిగో, హిందువుకు మగతనం లేదు, హైదరాబాద్‌లో ఉండేవాళ్లంతా చీము, నెత్తురు లేనోళ్లే, బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vikas M

బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హిందువులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సిగ్గు శరం లేని హిందువులు హైదరాబాద్‌లోనే ఉన్నారని, హిందువులు చీము, నెత్తురు లేని నా కొడుకులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన దుర్గమ్మ, ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు.

Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ లోకల్ MMTS రైలులో ప్రమాదకర స్టంట్స్ చేసిన పిల్లలు, ఏ మాత్రం బెడిసికొట్టినా ప్రాణాలు గాలిలోకే..

Vikas M

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది హైదరాబాద్ MMTS రైలుకి సంబంధించినది. ఈ వీడియోలోకాచిగూడ నుండి చందానగర్ కు వెళ్తున్న లోకల్ MMTS రైలులో పిల్లలు స్టంట్లు చేస్తూ కనిపించారు.

Telangana Group-1 Exams Update: గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లైన్ క్లియ‌ర్, మరో ఆరు రోజుల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు, నోటిఫికేష‌న్ల‌పై ప‌లువురు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను కొట్టివేసిన హైకోర్టు

Hazarath Reddy

తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్‌ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, మద్యం మత్తులో ఓ యువకుడిని దారుణంగా కొట్టిన యువకులు, సిద్దిపేటలో దారుణ ఘటన

Hazarath Reddy

Telangana: వీడియో ఇదిగో, ఒక్కగానొక్క కొడుకు పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ అధికారి ముందు ఏడ్చిన కన్నతల్లి, పింఛన్ కూడా లాక్కుంటున్నారని ఆవేదన

Hazarath Reddy

కోదాడ గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది. కాగా తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా, తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదాడ RDO ఆఫీసులో విలపించింది

Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

Hazarath Reddy

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీద్ బండ ప్రాంతంలో ఆటోలో యువతిపై అత్యాచారం చేశారు

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

Rudra

దసరా సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.

Advertisement
Advertisement