తెలంగాణ

Sonu Sood at Kumari Aunty Food Stall: వీడియో ఇదిగో, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేసిన సోనూ సూద్, ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని చమత్కారం

Hazarath Reddy

కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసిన సోనూ సూద్ తాజాగా హైదరాబాద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ వద్ద సందడి చేశాడు. సోనూసూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నానని సోనుసూద్ చెప్పుకొచ్చాడు

Golconda Bonalu: బోనాలకు ముస్తాబైన గోల్కొండ.. ఈ ఆదివారం నుంచే వేడుకలు షురూ.. భక్తుల కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Rudra

ఆషాఢ మాసం బోనాలకు హైదరాబాద్ ముస్తాబయ్యింది. ఈ ఆదివారం బోనాలు ప్రారంభం కానున్నాయి. చరిత్రాత్మకమైన గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్నాయి.

Shock to BRS: బీఆర్ఎస్‌ కు కోలుకోలేని దెబ్బ.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రే చేరికలు..

Rudra

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుదేలైన బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రాజకీయాలు ఎన్నికల వరకేనని వెల్లడి, వివిధ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

Advertisement

Hyderabad Gang Rape Case: మియాపూర్‌లో కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్, మూడు రోజుల్లో ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ లేఖ

Hazarath Reddy

హైదరాబాద్‌లోని మియాపూర్ లో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగిన సంగతి విదితమే. తీవ్ర కలకలం రేపిన మియాపూర్‌ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ (National Commission for Women) సీరియస్‌గా తీసుకుంది.

Road Accident Caught on Camera: వీడియో ఇదిగో, అత్యంత వేగంతో వచ్చి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్, ఎగిరి డివైడర్‌పై పడి మృతి చెందిన బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తి

Hazarath Reddy

గజ్వేల్‌ పట్టణంలో అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన గట్టు శ్రావణ్‌కుమార్‌ యాదవ్‌(18) గుంటూరు జిల్లాకు చెందిన స్నేహితుడు పూసులూరి త్రినాథ్‌(18)తో కలిసి ద్విచక్ర వాహనంపై పిడిచెడ్‌ రోడ్డులో శివాజీ విగ్రహం నుంచి గజ్వేల్‌ వివేకానంద చౌరస్తా వైపునకు వస్తున్నారు.

TGEAPCET Counselling: తెలంగాణ‌లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం కౌన్సెలింగ్ ప్ర‌క్రియ షురూ, రిజిస్ట్రేష‌న్, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ స‌హా ఎలా పూర్తి చేయాలో వివ‌రాలిగో

VNS

తెలంగాణ‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌లో (B tech) ప్రవేశించేందుకు టీజీ ఎప్‌సెట్‌ (TGEAPCET) కౌన్సెలింగ్‌ (Counselling)ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్‌ కొనసాగనుంది. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Telugu States CMs in Delhi: ప్ర‌ధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై తెలుగురాష్ట్రాల సీఎంల స‌మావేశానికి ముందు కీల‌క ప‌రిణామం

VNS

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra modi) ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు (Chandrababu), రేవంత్ రెడ్డి (Revanth reddy) విడివిడిగా సమావేశం కానున్నారు. ఉదయం 10.15 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు.

Advertisement

KCR Slams Congress: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌కు ఓటేసి పొరపాటు చేశామనే విషయం ప్రజలకు అర్థమైంది, మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఓటమితో దిష్టి తీసినట్టయిందన్నారు. తిరిగి పునరుత్తేజంతో ప్రజాదరణను కూడగట్టాలి

Telangana: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు.

Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు, గాజులు వేసుకుని వెళ్లారు, మీదో బతుకా? అంటూ మండిపడిన ఎమ్మెల్యే

Hazarath Reddy

దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త నేర చట్టాల కింద హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కరీంనగర్ పోలీసులు ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదు చేశారు. దేశంలో కొత్త నేర చట్టాల కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.

Telangana: తీవ్ర విషాదం, తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మృతి, బిడ్డ మృతి చెందిందన్న వార్త విని కుప్పకూలిన తల్లిదండ్రులు

Hazarath Reddy

తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మరణించిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన చిన్నా­రి రియాన్షిక సోమవా­రం రాత్రి హోం వర్క్‌ చేస్తున్న టైంలో బెడ్‌ మీద నుంచి కింద పడిపోయింది

Advertisement

Keshava Rao Joins Congress: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్, మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Elderly Man Hit by Train: ట్రాక్ దాటుతుండ‌గా వృద్ధుడిని ఢీకొట్టిన ట్రైన్, కిలో మీట‌ర్ల కొద్దీ రైలుకు వేలాడిన మృత‌దేహం, బీబీన‌గ‌ర్ లో దారుణం

VNS

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌లో (Bibinagar) విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బీబీనగర్‌ దగ్గర రైల్వే ట్రాక్‌ దాటుతున్న ఓ వృద్ధుడిని ప్యాసింజర్‌ రైలు (Train Hits Old Man) ఢీకొట్టింది. దాంతో వృద్ధుడు రైలు ఇంజిన్‌కు చిక్కుకున్నాడు. ఇది గమనించిన లోకోపైలెట్‌ అలాగే రైలును పోనిచ్చాడు. దాంతో వృద్ధుడి మృతదేహం ఘట్‌కేసర్‌ వరకు రైలుకు వేలాడుతూ వచ్చింది.

Boy Attacked by Stray Dogs: వీడియో ఇదిగో, ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి..

Hazarath Reddy

సంగారెడ్డిలోని శ్రీనగర్‌ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కల గుంపు దాడి చేసి బీభత్సం సృష్టించింది. ఆరు కుక్కలు అకస్మాత్తుగా బాలుడిపై దాడి చేయడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం అయింది.

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనీష్ సిసోడియా, కవితల జ్యుడిషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు

Hazarath Reddy

ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా, BRS నాయకురాలు కె. కవితల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూలై 25 వరకు పొడిగించింది. గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వారి కస్టడీని పొడిగించారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, గాలివానకు మళ్లీ కూలిన మానేరు వాగుపై ఓడేడ్‌ వంతెన గిడ్డర్లు, గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై పడ్డ ఐదు గిడ్డర్లు

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై నిర్మిస్తున్న గిడ్డర్లు మరోసారి కూలాయి. తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి బట్టబయలైంది.

TGSRTC: వీడియో ఇదిగో, ఉచిత బస్సు లేదంటూ ఫ్యామిలీని ఆర్టీసీ బస్సు ఎక్కనివ్వకుండా కిందకు దింపేసిన మహిళా కండక్టర్, జగిత్యాల బస్ స్టాప్‌లో ఘటన

Hazarath Reddy

జగిత్యాల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం జగిత్యాల బస్ స్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సమయంలో.. బస్సులో ఉండే మహిళా కండక్టర్ వారిని ఆపి ఉచిత ప్రయాణం లేదు.. ముందు తనిఖీ అధికారులు ఉన్నారు.. వారు చూస్తే రూ.500 జరిమానా విధిస్తారు అంటూ సదరు కుటుంబ సభ్యులను బలవంతంగా కిందికి దింపేసింది.

Pune Road Accident: పూణే శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతి, అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్ళి వస్తుండగా ఘటన

Hazarath Reddy

మహారాష్ట్రలోని పూణే శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఐదుగురు యువకులు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన ఆరుగురు యువకులు అజ్‌మేర్‌ దర్గా సందర్శనకు వెళ్లారు.

Road Accident Video: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్న

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. వీడియో ద్వారా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు ఓ ప్రాణం బలైంది. కారుతో పాదచారుడిని ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా తనకేం పట్టనట్టుగా వెళ్లిపోయారు

Advertisement
Advertisement