తెలంగాణ
MLA Danam Nagender on IPL Tickets: పేరుకే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం, అందులో ఒక్క తెలుగు ప్లేయర్ కూడా లేడు, సంచలన వ్యాఖ్యలు చేసిన దానం నాగేందర్
Hazarath Reddyఐపీఎల్ (IPL) టికెట్ల అమ్మకంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్లు మొత్తం బ్లాక్ మార్కెట్ దందా అంటూ.. 10 నిముషాల్లో 45 వేల టికెట్స్ ఎలా అమ్ముడుపోతాయని ప్రశ్నించారు.
KCR Meets Farmers: రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని తెలిపిన కేసీఆర్, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రైతులతో మమేకమవుతున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలోని మొగ్దుంపూర్‌లో ఎండిపోయిన పంటను కేసీఆర్‌ పరిశీలించారు
Tractor Driver Fine: సీటు బెల్టు పెట్టుకోలేదని ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ. 100 జరిమానా, దీనిపై పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే..
Hazarath Reddyట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించిన ఘటన పాల్వంచ మండలం నాగారంలో చోటు చేసుకుంది.ఓ ట్రాకర్ట్ నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ వంద రూపాయలు జరిమానా విధించారు.
Telangana Elections 2024: తెలంగాణ నుంచి పోటీ చేసే 17 మంది బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే, మెదక్ నుంచి రఘునందన్ రావు, కరీంనగర్ నుంచి బండి సంజయ్
Hazarath Reddyవచ్చే లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణలో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన అభ్యర్థును భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ బరిలో నిలవగా హైదరాబాద్ నుంచి మాధవీ లత, మల్కాజ్ గిరి నుంచి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి బరిలో నిలిచారు.
Telangana Elections 2024: లోక్ సభ ఎన్నికలు, లెక్కలు చూపని రూ. 40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు
Hazarath Reddyతాజాగా హైదరాబాద్ పోలీసులు లెక్కా పత్రం లేని 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. CZ టాస్క్‌ఫోర్స్ బృందం అబిడ్స్‌ పీఎస్‌ పరిధిలోని రామకృష్ణ థియేటర్‌ పార్కింగ్‌ స్థలంలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల లెక్కలు చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు.
Telangana: నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్, గర్భిణీ మహిళపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన డాక్టర్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
Hazarath Reddyనల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మైనార్టీ గర్భిణీ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది. ఒక ముస్లిం మైనార్టీ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుంటున్న సమయంలో డాక్టర్ తనని ఎన్నో కాన్పు అని అడగగా సదరు మహిళ ఐదో కాన్పు అని తెలిపింది. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్ అని ఇష్టం ఉన్న రీతిలో డాక్టర్ అసభ్య పదజాలంతో బూతులు తిట్టిందని ఆమె తెలిపారు.
First Telugu News Reader Shanthi Swaroop Passes Away: తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత.. గుండెపోటుతో రెండురోజుల క్రితం దవాఖానలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి
Rudraతొలి తెలుగు న్యూస్ యాంకర్, దూరదర్శన్ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో రెండురోజుల క్రితం హైదరాబాద్ లోని యశోదా దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కాసేపటి క్రితం మృతిచెందారు.
Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఆటో, ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
Hazarath Reddyహైదరాబాద్‌ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట హైటెక్‌ బస్‌స్టాండ్‌ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో.. సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) (ఉపాధ్యాయురాలు) అక్కడిక్కడే మృతి చెందింది.
Elephant Attack on Farmer: పొల్లాల్లో రైతులపై ఏనుగు దాడి, 24 గంటల్లో ఇద్దరు అన్నదాతలు మృతి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదకర ఘటనలు
Hazarath Reddyకుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో ఓ ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగి అక్కడే ఉన్న అన్నూరి శంకర్‌(రైతు)పై దాడి చేసి చంపేసింది.
SB Organics Blast: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్ట‌రీ ప్ర‌మాదంలో పెరుగుతున్న మ‌ర‌ణాలు, 6కు చేరి మృతుల సంఖ్య‌, చికిత్స పొందుతున్న‌వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మం
VNSతాజాగా మరో కార్మికుడు మృతిచెందాడు. శిథిలాల కింద మరో కార్మికుడిని పోలీసులు గుర్తించారు. మృతుడిని హత్నూర మండలం కొన్యాలకు చెందిన వడ్డె రమేశ్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారని గాలిస్తున్నారు. కాగా, మృతదేహాలకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానాలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
AP Accident: పెందుర్తితో రోడ్డు ప్ర‌మాదం, ముగ్గురు మృతి, 10 మందికి తీవ్ర‌గాయాలు, మృతులంతా ఒకే ఊరికి చెందిన‌వారే
VNSపెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో (Road Accident) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఏస్ వాహనంను లారీ ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు (KGH) తరలించారు.
Rain Forecast for Telangana: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కూల్ న్యూస్! రెండు రోజుల పాటూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌న్న ఐఎండీ, ఏయే జిల్లాల్లో వ‌ర్షాలున్నాయంటే?
VNSగురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి.
Heatwave Warning: బీ అల‌ర్ట్! రాబోయే ఐదు రోజుల పాటూ అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రండి, ఏపీలోని ప‌లు జిల్లాలో వ‌డ‌గాల్పులు వీస్తాయ‌ని ఐఎండీ హెచ్చ‌రిక‌
VNSఏపీలో వడగాలులు (Heat Wave) వీచే అవకాశం ఉంది. గురువారం పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలో 130 మండలాల్లో వడగాలులు, ఎల్లుండి 5 మండలాల్లో తీవ్ర, 253 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
SangaReddy Fire: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశాలు
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా హత్నుర మండలంలోని కెమికల్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డి ని ఆదేశించారు
Telangana: మంచి నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు, కొన్ని రోజుల నుంచి అవే నీళ్లు తాగుతున్న ఆ మున్సిపాలిటీ ప్రజలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyనాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో 1వ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో కోతుల మృతదేహాలు లభించాయి. దాదాపు 30 కోతుల మృతదేహాలు ట్యాంకులో లభించాయి.అయితే గత కొన్ని రోజులుగా ఇదే ట్యాంకు నుంచి మంచినీటి సరఫరా చేస్తున్నారు ఎన్ఎస్పీ అధికారులు.
Film Chamber Fire Videos: హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్నిప్రమాదం, ఎగిసిపడుతున్న మంటలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉ‍న్న ఫిల్మ్ ఛాంబర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.
Sangareddy Fire Videos: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, డైరెక్టర్‌‌తో పాటుగా ఆరుగురు కార్మికులు మృతి, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో ఈరోజు( బుధవారం) రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Telangana: గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కుపోయిన దొంగ చెయ్యి, రాత్రంతా గుడిలోనే జాగారం, ఉదయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చిన భక్తులు
Hazarath Reddyబిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో ఉన్న మాసుపల్లి పోచమ్మ ఆలయంలో పనిచేసే సురేశ్ హుండి పై భాగాన్ని ధ్వంసం చేసి అందులో డబ్బు తీసేందుకు లోపల చెయ్యి పెట్టగా అది హుండీలో ఇరుక్కుపోయింది.ఉదయం గుడికి వచ్చిన భక్తులు చూసి పోలీసులకి సమాచారం అందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
CM Revanth Reddy Slams KCR: పదేళ్ల కేసీఆర్‌ పాలనలో వందేళ్ల విధ్వంసం, బీఆర్ఎస్ అధినేతపై మండిపడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyరానున్న లోక్‌సభ ఎన్నిలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని చెప్పారు.
Telangana Elections 2024: రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా? కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా?, తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన మందకృష్ణ మాదిగ
Hazarath Reddyరాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయకుండా వస్తున్న ఎమ్మెల్యేలను ఎలా పార్టీలో చేర్చుకుంటున్నావు అని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని రాళ్లతో కొట్టాలా?.. కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా? ఇప్పుడు నీవే చెప్పు ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు.