తెలంగాణ

High Alert in Hyderabad: బెంగుళూరు బాంబు పేలుళ్లతో హైదరాబాద్‌లో హై అలర్ట్, కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేసిన పోలీసులు

Hazarath Reddy

బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్‌లో పోలీసులు హైఅలెర్ట్‌ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నట్లు సీపీ వెల్లడించారు

Hyderabad: పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థిని, ప్రథమ చికిత్స అందించి పరీక్షా కేంద్రం దగ్గర దించిన మహంకాళి ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌

Hazarath Reddy

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష రాసేందుకు విద్యార్థిని తన తండ్రితో కలిసి వెళ్తుండగా సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్‌ మార్గంలో ఉన్న ఓ కళాశాల వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. విద్యార్థిని, ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని తలకు గాయాలయ్యాయి.

MP BB Patil Joins BJP: బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్, బీజీపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఢిల్లీలో గురువారం ఆయన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పార్టీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో చేరారు.

Counterfeit Drug Racket: నకిలీ టాబ్లెట్ల రాకెట్‌ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ పోలీసులు, రూ.7.34 లక్షల విలువైన నకీల మందులు స్వాధీనం,వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) తెలంగాణ, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ సహకారంతో, మార్చి 1 న ఉత్తరాఖండ్‌లో నిర్వహిస్తున్న నకిలీ మందుల తయారీ యూనిట్‌ను ఛేదించింది. నెక్టార్ హెర్బ్స్, డ్రగ్స్‌గా గుర్తించబడిన ఈ యూనిట్ అనేక రాష్ట్రాలకు నకిలీ మందులను పంపిణీ చేస్తోంది.

Advertisement

Nalgonda Audit Office Fire: నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం, పూర్తిగా మంటల్లో కాలిపోయిన కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్

Hazarath Reddy

తెలంగాణలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా ఆడిట్ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో కంప్యూటర్స్, కొన్ని ఆడిట్ ఫైల్స్, ఆఫీసులోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు

Viral Video: పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ యువకుడిని చితకబాదిన స్థానికులు.. నిర్మల్ లో ఘటన.. వీడియో వైరల్

Rudra

పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని అనుమానిస్తూ ఓ యువకుడిని స్థానికులు చితకబాదారు. ఈ ఘటన నిర్మల్ టౌన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

Commercial LPG Cylinder Price Hike: పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. 19 కేజీల సిలిండర్‌ ధర రూ.25 మేర పెంపు.. ధరలను సవరించిన చమురు కంపెనీలు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథం

Rudra

వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరలు పెరిగాయి.19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. ఈ మేరకు చమురు కంపెనీలు ధరలను సవరించాయి.

Mana Yatri App: హైదరాబాద్‌ లో కమీషన్‌ రహిత తొలి ఆటోక్యాబ్‌ యాప్‌ 'మనయాత్రి' అందుబాటులోకి.. డ్రైవరన్నలకు ఎంతో ఉపయుక్తం..

Rudra

హైదరాబాద్‌ లో తొలిసారిగా జీరో కమీషన్‌ ఆధారిత ఆటో క్యాబ్‌ యాప్‌ ‘మనయాత్రి’ తాజాగా అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఇప్పటికే విజయవంతమైన ‘నమ్మయాత్ర’ సాధించిన స్ఫూర్తితో దీన్ని టీ-హబ్‌లో రూపొందించారు.

Advertisement

Dharani Guidelines: ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రేవంత్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం, మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్, జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ

VNS

ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు (Dharani Guidelines) జారీ చేసింది. పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ నెల 24న ధరణిపై రివ్యూలో.. ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana: సాత్నాల ప్రాజెక్టులో దొరికిన ఇంటర్ విద్యార్థి మృతదేహం, ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు పరీక్ష రాయనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి

Hazarath Reddy

ఇంటర్ పరీక్షకు లేటుగా వెళ్లడంతో పరీక్ష రాయనివ్వలేదని మనస్తాపం చెందిన శివకుమార్ ఈరోజు జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులోలో దూకి ఆత్మహత్య చేసుకోగా స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.

Teacher Drinking Alcohol in School: పాఠశాలలో మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికిన టీచర్, మంచిర్యాల జిల్లా చర్లపల్లి పాఠశాలలో ఘటన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

KTR's Challenge to CM Revanth Reddy: దమ్ముంటే రాజీనామా చేసి రా..మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్

Hazarath Reddy

తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు అయినా గెలిచి చూపించాలని BRS పార్టీకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరిన నేపథ్యంలో...కేటీఆర్ స్పందించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో పోటీ చేద్దాం అంటూ సవాల్ విసిరారు.

Advertisement

Jithender Reddy: బట్టలు లేకుండా పిల్లాడు అటూ ఇటూ తిరుగుతున్న వీడియో షేర్ చేసిన మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి తన ఎక్స్ లో సంచలన వీడియోను షేర్ చేశారు. బట్టలు లేకుండా అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న ఓ చిన్నపిల్లోడి వీడియోను షేర్‌ చేస్తూ దానికి వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ క్యాప్షన్ ఇచ్చారు .

Mega DSC Notification in Telangana: 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను (Mega DSC notification) విడుదల చేశారు. ఈ మేరకు 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.

Nagarkurnool MP Ramulu Joins BJP: బీఆర్ఎస్ పార్టీకి షాక్, బీజేపీలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు మావేనని తెలిపిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్

Hazarath Reddy

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారాయన. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు.

Cop Saved Farmer Life: పొలంలో పురుగుమందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు ‌కాపాడిన పోలీసు, శభాష్ పోలీసన్న అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక్కోసారి దేవుని అవతారం ఎత్తుతుంటారనేది కొన్ని సంఘటనలు చూస్తే తెలుస్తుంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఘటన. పురుగుల మందు తాగిన రైతును రెండు కిలోమీటర్లు భూజాన మోసుకెళ్ళి ఓ పోలీసు ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.

Advertisement

Telangana Fire Accident: తార్నాకలో భారీ అగ్నిప్రమాదం, ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా దగ్ధం వీడియో ఇదిగో..

Hazarath Reddy

తార్నాకలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది. షాక్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

Telangana Inter Exams 2024: ఇంటర్ పరీక్షలు, విద్యార్థి ప్రాణం తీసిన ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన, డ్యాంలో దూకి సూసైడ్ చేసుకున్న విద్యార్థి

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధన ఇంటర్ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఆదిలాబాద్ - జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివ కుమార్ అనే విద్యార్థి పరీక్ష రాయడానికి రాగా ఒక్క నిమిషం ఆలస్యం అనే నిబంధనతో పరీక్ష కేంద్రంలో అనుమతించలేదు.

BJP MP Laxman: త్వరలో తెలంగాణలోనూ హిమాచల్ పరిస్థితే.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్.. తుమ్మితే ఊడిపోయే ముక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వ్యాఖ్య (వీడియోతో)

Rudra

లోక్‌ సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు.

Narendra Modi Telangana Visit: మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. 4న ఆదిలాబాద్‌ లో, 5న సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న ప్రధాని

Rudra

ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. 4న మహారాష్ట్రలోని నాగ్‌ పూర్ నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు ఆదిలాబాద్‌‌ కు వస్తారు.

Advertisement
Advertisement