తెలంగాణ

Kaikala Satyanarayana Funeral: ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్య క్రియలు పూర్తి

kanha

తెలుగు సినిమా దిగ్గజం, సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో జరిగాయి. ఫిల్మ్‌ నగర్‌లోని ఆయన నివాసం నుంచి జూబ్లీ హిల్స్‌ వరకు అంతిమ యాత్ర కొనసాగింది.

Road Collapses: హైదరాబాద్ లోని గోషా మహల్ లో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు... గుంతలో పడిపోయిన కార్లు, ఆటోలు, కూరగాయల దుకాణాలు.. వీడియో ఇదిగో!

Rudra

హైదరాబాదులోని గోషామహల్ లో ఓ రోడ్డు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Indian Wins Dubai Lottery: తెలంగాణవాసికి దుబాయ్ బంపర్ లాటరీ, రూ. 300 వందలు పెట్టి కొంటే రూ. 33 కోట్లు, నక్కతోక తొక్కిన జగిత్యాలవాసి

VNS

అజయ్ ముందుగా తాను స్వల్ప మొత్తమే గెలుచుకుని ఉంటానని భావించాడు. తీరా 15 మిలియన్ దిర్హామ్స్ (మన కరెన్సీలో దాదాపు రూ.33.8 కోట్లు) గెలుచుకున్నట్లు తెలియగానే అంతులేని సంతోషానికి గురయ్యాడు. క్రిస్మస్ (Christamas) సందర్భంగా జరిగిన మెగా డ్రాలో అజయ్ భారీ మొత్తం గెలిచాడు. ఈ సందర్భంగా లాటరీ అందుకున్న అజయ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Kaikala Satyanarayana Passes Away: నవరస నటనాసార్వభౌమా నువ్వు ఇక రావా.. నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

Rudra

నవరస నటనాసార్వభౌముడిగా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

Advertisement

Errabelli Comments On NTR: టీడీపీ చంద్రబాబుది కాదు.. ఏపీలో ఎన్టీఆర్‌ను సీఎం చేయాలి.. ఎర్రబెల్లి

Rudra

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడి ఇటీవలి ఖమ్మం యాత్ర తెలంగాణ రాజకీయక్షేత్రంలో నిప్పును రాజేసింది. చంద్రబాబు, టీడీపీపై ఇప్పటికే సెటైర్లు వేసిన పలువురు బీఆర్ఎస్ నేతల జాబితాలోకి తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేరారు.

COVID-19 Outbreak Fears: బయటి దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేయండి.. ఆరోగ్య శాఖ కరోనా తాజా మార్గదర్శకాలు

Rudra

పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 24 నుంచి ఎయిర్‌పోర్టుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా పరీక్షలు చేయాలని విమానయాన శాఖకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

Telangana: చంద్రబాబు ఖమ్మం టూర్, సెటైర్లు పేల్చుతున్న తెలంగాణ టీఆర్ఎస్ నేతలు, ఏపీలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అన్న హరీష్ రావు, టీడీపీ ఇప్పటీకే భూ స్థాపితమైందన్న కవిత

Hazarath Reddy

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఖమ్మంలో (Chandra Babu Khamma Tour) పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనపై టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) సెటైర్లు వేశారు.

'Jesus Removed Covid': ఏసు ప్రభువు దయతోనే కరోనా అంతమైంది, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్, నా మాటలు వక్రీకరించారంటూ డాక్టర్ శ్రీనివాసరావు మండిపాటు

Hazarath Reddy

కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (Telangana Health Director G Srinivas Rao) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు.

Advertisement

NGT Slaps Fine on TS Govt: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జీటీ భారీ షాక్, పాలమూరు-రంగారెడ్డి,డిండి ప్రాజెక్టులు అనుమతులు లేకుండా కడుతున్నారంటూ రూ.900 కోట్ల జరిమానా

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టారని రూ.900 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మూడు నెలల్లో చెల్లించాలని చెన్నై ఎన్‌జీటీ ధర్మాసనం ఆదేశించింది.

Covid Alert in Telangana: తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు, బీఎఫ్‌-7పై ప్రభుత్వం హై అలర్ట్, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

కరోనా కొత్త వేరియంట్‌, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ (Covid Alert in Telangana) అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (new COVID variant) పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయించారు.

New Year Parties in Hyderabad 2023: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్, పోలీసుల విడుదల చేసిన రూల్స్ ఇవే, తాగి బండి నడిపితే రూ. 10 వేలు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు

Hazarath Reddy

హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలకు (New Year Parties in Hyd 2023) ముందు నగర పోలీసు కమిషనర్ త్రీస్టార్, అంతకంటే ఎక్కువ స్టార్లు కలిగిన హోటళ్లు, క్లబ్‌లు, పబ్‌ల నిర్వహణతో సహా నిర్వాహకులకు మార్గదర్శకాలను (police restrictions) విడుదల చేశారు.

New Year Events in Hyd 2023: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ ఈవెంట్స్ జరిగే ప్రదేశాలు, అర్థరాత్రి వరకు ఈ పార్టీల్లో పుల్ ఎంజాయ్ చేయవచ్చు, కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించే టాప్ టెన్ ప్లేసులు ఇవే..

Hazarath Reddy

2023లో ప్రవేశించడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు 2022 సంవత్సరాన్ని స్నేహితులతో ముగించి, సానుకూల శక్తితో కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలనుకుంటే, సిద్ధంగా ఉండండి.

Advertisement

National Waterways in Telangana: తెలంగాణ రాష్ట్రం ద్వారా ఆరు జాతీయ జలమార్గాలు, జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా రాష్ట్రానికి రూ.5,238.93 కోట్లు విడుదల, మంత్రుల ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం

Hazarath Reddy

గోదావరి– కృష్ణానది మినహా మిగతా ఐదు జాతీయ జలమార్గాలైన భీమా, మంజీరా, పెన్‌గంగ–వార్ధా, తుంగభద్ర, పెన్‌గంగ–ప్రాణహిత నదుల వ్యవస్థ జాతీయ జలమార్గాలు షిప్పింగ్, నావిగేషన్‌ కోసం సాంకేతిక–వాణిజ్యపరంగా ఆచరణీయం కాదని అధ్యయనంలో తేలిందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌ శాఖ మంత్రి శర్బానంద్‌ సోనోవాల్‌ తెలిపారు.

Online Game Gambled: ఆన్‌లైన్ మోజులో రూ. 95 లక్షలు పోగొట్టుకున్న రైతు కొడుకు, తెలంగాణ ప్రభుత్వం పరిహారం కింద ఇచ్చిన నగదును ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పెట్టి పోగొట్టుకున్న తెలంగాణ యువకుడు

VNS

భూమిని అమ్మిన వ్యక్తికి నగదును ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని హర్షవర్ధన్‌రెడ్డి తల్లిదండ్రుల ఖాతాల్లో ఉన్న రూ.95 లక్షలను తన ఖాతాలోకి బదిలీ చేసుకొన్నాడు. ఇటీవల భూ యజమాని నుంచి శ్రీనివాస్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. ఇంకా డబ్బు రాలేదు, రిజిస్ట్రేషన్‌ సమయం అయిపోతుందని అడిగాడు. ఆందోళన చెందిన ఆయన, కొడుకును నిలదీయగా ఆన్‌లైన్‌ గేమ్‌లో నగదు అంతా పోయిందని చెప్పడంతో కన్నీరు మున్నీరయ్యారు.

Telangana: పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌తో ముగిసిన తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ, దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులపై చర్చలు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమావేశయ్యారు.ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతోపాటు పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్‌తో భేటీ ముగియడంతో ప్రగతి భవన్‌ నుంచి పంజాబ్‌ సీఎం బయలు దేరారు.

Sircilla Woman kidnap Case: ఆ యువతి కిడ్నాప్ అంతా నాటకం, పెళ్లి కోసమే ఇదంతా చేసింది, పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలు, వీడియోను విడుదల చేసిన రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాపైన యువతి

Hazarath Reddy

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్‌ కేసులో (Minor girl kidnap Case) భారీ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆ యువతి తాజాగా పెళ్లి ఫోటోలను విడుదల చేసింది. తాను జ్ఞానేశ్వర్‌ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది.

Advertisement

Telangana: తెలంగాణలో మరో యువతి కిడ్నాప్, గుడికి వెళ్లిన యువతిని కారులో కిడ్నాప్ చేసిన నలుగురు అగంతకులు, తండ్రిని కొట్టి అతని ముందే ఎత్తుకెళ్లిన వైనం, రాజన్న సిరిజిల్లాలో ఘటన

Hazarath Reddy

రాజన్న జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో తండ్రి ముందే యువతి కిడ్నాప్ ఘటన (kidnapped an 18-year-old girl) కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి జిల్లాలోని (Rajanna Sircilla district) హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు.

Mobile Data Speed: మొబైల్ డేటా వేగంలో భారత్ 105 ర్యాంక్.. 176.18 ఎంబీపీఎస్ వేగంతో ప్రపంచంలోనే ఖతార్ టాప్

Rudra

మొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా భారత్ స్థానం కొంత మెరుగుపడింది. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదికలో భారత్ లో సగటు మొబైల్ డౌన్ లోడ్ వేగం 18.26 ఎంబీపీఎస్ గా ఉంది. కానీ, అక్టోబర్ లో ఈ సగటు వేగం 16.50 ఎంబీపీఎస్ గానే ఉంది. ఫలితంగా అక్టోబర్ లో ఉన్న 113వ ర్యాంక్ నుంచి భారత్ 105కి చేరింది.

APSRTC Discount: శుభవార్త.. సంక్రాంతి బస్సులకు ఏపీఎస్‌ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. రానుపోను టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ

Rudra

సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకు వెళ్ళే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. స్పెషల్ బస్సుల్లో రానుపోను టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు.

Telangana: మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేఖంగా 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి ఇంట్లో భేటీ, మా నియోజకవర్గ ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు మండిపాటు

Hazarath Reddy

ఈ రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డి తన ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తూ ఇతరులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు

Advertisement
Advertisement