Hyderabad Woman Starves on US Street: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ యువతి, కేంద్ర మంత్రిని సాయం కోరిన యువతి తల్లి

మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ మహిళ తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికాగో రోడ్లపై కనిపించింది. సయ్యదా లులు మిన్హాజ్ జైదీ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాస్తూ జోక్యం చేసుకుని తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కోరారు.

Hyderabad Woman Starves on US Street: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తున్న హైదరాబాద్ యువతి, కేంద్ర మంత్రిని సాయం కోరిన యువతి తల్లి
Hyderabad woman starves on US street (Photo-Twitter/Amjed Ullah Khan MBT)

Hyd, July 26: మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ మహిళ తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికాగో రోడ్లపై కనిపించింది. సయ్యదా లులు మిన్హాజ్ జైదీ తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాస్తూ జోక్యం చేసుకుని తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని కోరారు.భారత రాష్ట్ర సమితి నాయకుడు ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో కనిపించింది. అతను ఒక వీడియోను కూడా పంచుకున్నాడు, అందులో కృంగిపోయిన మిన్హాజ్ ఆహరం తెచ్చిన ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతూ కనిపించింది.

ఇకపై లింగ మార్పిడి స‌ర్జ‌రీలు చికిత్స‌పై నిషేధం, సెక్స్ చేంజ్ బ్యాన్ బిల్లుపై సంతకం పెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్

లేఖలో, తల్లి తన కుమార్తె యొక్క కష్టాలను ఇలా వివరించింది: “తెలంగాణలోని మౌలా అలీ నివాసి అయిన నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని TRINE విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు వెళ్లి మాతో తరచుగా టచ్‌లో ఉండేది. కానీ, గత రెండు నెలలుగా ఆమె నాతో టచ్‌లో ఉండడం లేదని, నా కూతురు డిప్రెషన్‌లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని, దీంతో ఆమె ఆకలితో అలమటించిందని లేఖలో తెలిపారు.

Here's Videos

ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి.. తన పరిస్థితి గురించి హైదరాబాద్ లోని తన తల్లికి సమాచారం అందించారని తెలిపారు. ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. USAలోని చికాగో రోడ్లపై నా కూతురు కనిపించింది. వాషింగ్టన్ DCలోని భారత రాయబార కార్యాలయం, చికాగోలోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని లేఖలో అభ్యర్థిస్తోంది. మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సహాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె పంచుకున్నారు. ఈ లేఖను తన ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(The above story first appeared on LatestLY on Jul 26, 2023 06:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).