Dengue in Telangana: తెలంగాణలో విజృభిస్తున్న డెంగ్యూ జ్వరాలు, జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని హెచ్చరిస్తున్న వైద్యులు

తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబరులో కేసులు తారస్థాయికి చేరుకోగా, ఈ నెలలోనూ కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండానే తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.

Dengue in Telangana: తెలంగాణలో విజృభిస్తున్న డెంగ్యూ జ్వరాలు, జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని హెచ్చరిస్తున్న వైద్యులు
representational image (photo credit- file image)

Hyd, Oct 13: తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబరులో కేసులు తారస్థాయికి చేరుకోగా, ఈ నెలలోనూ కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండానే తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే డెంగీ కేసులు అధికారికంగానే ఆరువేలు దాటాయి. అందులో దాదాపు సగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే.

తర్వాత మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో భారీగా నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 600కుపైగా నిర్ధారణయ్యాయి. కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ, మణుగూరు, కొత్తగూడెం పట్టణం, మహబూబాబాద్‌ జిల్లా ముల్కనూరు పీహెచ్‌సీ పరిధి, ఆదిలాబాద్‌ జిల్లా అంకోలి పీహెచ్‌సీ పరిధిలో రెండు నెలలుగా తీవ్రత ఎక్కువగా ఉంది.

కొడుకులకు ఇది నిజంగా చేదు వార్తే, ఆడపిల్ల ఉంటే తండ్రి ఆయుష్షు ఇంకో ఆరేళ్ళు పెరుగుతుందని తేల్చి చెప్పిన సరికొత్త అధ్యయనం

జగిత్యాల గ్రామీణ జిల్లా పరిధిలో సెప్టెంబరు నెలలో ప్రభుత్వ ఆసుపత్రులలోనే 70, పెద్దపల్లి జిల్లాలో 150కిపైగా నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ఈ నెలలోనూ అదే స్థాయిలో ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య అంతకు మూడింతలు ఉంటుందనే అంచనా ఉంది.

ఆదిలాబాద్‌ జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అయితే జ్వరాల బారిన పడి ప్రయివేటు నర్సింగ్‌హోమ్‌లకు వచ్చే రోగులకు ఆదాయ వనరుగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 98 కేసులు నమోదయ్యాయి. 2022లో 192, 2021లో 189 కేసులు నమోదయ్యాయి.

ఎసోమెప్రజోల్ వినియోగంపై రోగులకు డ్రగ్ సేఫ్టీ అలర్ట్ జారీ చేసిన ఫార్మా స్టాండర్డ్ బాడీ, సైడ్ ఎఫెక్ట్స్ నిశితంగా పరిశీలించాలని వైద్యులకు సూచన

మంచిర్యాల జిల్లాలో 2022లో 116, 2021లో 118 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది వరుసగా 85 మరియు 43 కేసులు నమోదయ్యాయి.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఉదాహరణకు, ఆదిలాబాద్ జిల్లాలో ఆగస్టులో కేవలం ఏడు కేసులు నమోదయ్యాయి, అయితే 50 రోజుల వ్యవధిలో 66 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

జ్వర లక్షణాలు బయటపడిన వెంటనే అప్రమత్తం కావాలని, వేగంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మెరుగైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు తెలిపారు.కొందరు సాధారణ జ్వరంగానే భావించి మందుల దుకాణాల్లో ఔషధాలు తెచ్చుకుని వినియోగిస్తున్నారు. మరికొందరు ఆర్‌ఎంపీలను ఆశ్రయించి ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయిన తర్వాత ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతోందని వైద్యులు చెబుతున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 13, 2023 11:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).