Technology
Facebook: 11,000 మంది ఉద్యోగులను తొలగించిన ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, కొత్త వాళ్లను తీసుకునేందుకు సిద్ధమని ప్రకటన
Hazarath Reddyఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. హైరింగ్ ఫ్రీజ్‌ను పొడిగించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. కొత్త వాళ్లను తీసుకునేందుకు రెడీగా ఉన్నామని తెలిపింది.
Twitter Layoffs: సైలెంట్‌గా 4 వేల మంది ట్విట్టర్ ఉద్యోగులను పీకేసిన ఎలాన్ మస్క్, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే తొలగించారని వార్తలు హల్ చల్
Hazarath Reddyగత వారంలో ట్విటర్‌లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేసిన ఘటన మరువకముందే.. మళ్లీ 4 వేల మందిని ఎటువంటి నోటీస్ లేకుండా తొలగించారని వార్తలు వస్తున్నాయి.
WhatsApp New Feature: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్, డోంట్‌ డిస్ట్రబ్ ఆన్ చేసి ఉంచి అవతలివారికి తెలిసిపోతుంది, ఇకపై కమ్యూనిటీలకు గ్రూపు అడ్మిన్లదే బాధ్యత అంటూ వాట్సాప్ ప్రకటన
Naresh. VNSవాట్సాప్‌లో కమ్యూనిటీలను క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఈ గ్రూపులకు గ్రూప్ అడ్మిన్‌ల బాధ్యత వహించాల్సి ఉంటుందని వాట్సాప్ తెలిపింది. అంతేకాకుండా, కొత్త గ్రూప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా లేదా ముందుగా ఉన్న గ్రూపులను లింక్ చేయడం ద్వారా అడ్మిన్‌లు తమ కమ్యూనిటీలో ఏ గ్రూపులు జాయిన్ కావాలో ఎంచుకోవచ్చు. మరోవైపు, యూజర్లు కమ్యూనిటీల్లో కంట్రోల్ చేయవచ్చు.
Anand Mahindra: ట్విట్టర్లో కోటి మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా రికార్డ్‌, బిగ్‌ థ్యాంక్స్‌..ఇకపై నాతో కలసే ఉండండి అంటూ ట్వీట్
Hazarath Reddyమహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, పాపులర్‌ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా రికార్డ్‌ సాధించారు. సోషల్‌ మీడియాలోఎపుడు చురుకుగా ఉండే ఆయన ట్విటర్‌లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సాధించారు.దీనిపై ఆయన.. ఇంత పెద్ద కుటుంబం.. నమ్మలేకపోతున్నాను.
Airtel: ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్, డేటా పెద్దగా వాడని యూజర్లకోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌, రూ.199తో రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్
Hazarath Reddyభారతీ ఎయిర్టెల్‌ యూజర్లకు 30 రోజులవాలిడిటీతో రూ.199 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా డేటా పెద్దగా వాడని యూజర్లకోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎందుకంటే 30 రోజులకు గాను కస్టమర్లకు అందించే మొత్తం డేటా కేవలం 3జీబీ మాత్రమే.
Lunar Eclipse 2022 Live Streaming: చంద్రగ్రహణం వీక్షించాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ ద్వారా మీరు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు
Hazarath Reddyసంపూర్ణ చంద్రగ్రహణం 2022 లేదా నవంబర్ 8న చంద్ర గ్రహణం ఒక ప్రత్యేకమైనది, ఎందుకంటే NASA ప్రకారం, తదుపరి సంపూర్ణ చంద్రగ్రహణం మూడు సంవత్సరాల తర్వాత మార్చి 14, 2025న మాత్రమే కనిపిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమి మరియు చంద్రుడు, భూమి నీడలోకి పూర్తిగా వెళ్లిపోతాడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు,
PIB Fact Check: గూగుల్ పే మీద ఆర్‌బిఐకి అధికారం లేదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్, అది ఫేక్ అని కొట్టి పారేసిన PIB వాస్తవ తనిఖీ బృందం
Hazarath Reddyనేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కింద చెల్లింపు వ్యవస్థగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్వారా GooglePayకి అధికారం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఒకటి. ఈ వార్త ఫేక్ అని గమనించాలి. PIB వాస్తవ తనిఖీ బృందం చేసిన వాస్తవ తనిఖీ ప్రకారం, Google Pay అనేది NPCI కింద అధీకృత UPI చెల్లింపు సేవల సంస్థగా ఉంది.
Online Fraud: మీ ఖాతా నుండి డబ్బు మీకు తెలియకుండా పోతే బ్యాంకే తిరిగి ఇవ్వాలి, బ్యాంక్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి భద్రత బ్యాంకుదేనని తెలిపిన NCIB
Hazarath Reddyనేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇటీవల ట్విట్టర్‌లో ఒక ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది. NCIB తన పోస్ట్‌లో, ఒకరి బ్యాంక్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి భద్రత బ్యాంకు యొక్క బాధ్యత అని పేర్కొంది. "మీ ఖాతా నుండి మోసపూరితంగా డబ్బును విత్‌డ్రా చేస్తే, బ్యాంకు దానిని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది" అని ట్వీట్‌లో పేర్కొంది.
Twitter Paid Services: ట్విట్టర్‌లో అసలైన వ్యాపారం మొదలు పెట్టిన ఎలాన్ మస్క్, కేవలం బ్లూటిక్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయ్, మెసేజ్‌లు, వీడియోలకు కూడా డబ్బులు వసూలు చేసే యోచనలో మస్క్, రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలు
Naresh. VNSపెయిడ్ సర్వీసులపై కూడా సంచనల నిర్ణయాలు తీసుకుంటున్నారు. బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కేవలం ఇది మాత్రమే కాదు చాలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే ప్ర‌క‌ట‌న‌లు, కొత్త స‌ర్వీస్‌ల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాల్నికూడా అన్వేషిస్తున్నాడు.
Online Fraud Prevention: బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి సైబర్ సెక్యూరిటీ చిట్కాలు, ట్విట్టర్లో వీడియో షేర్ చేసిన సైబర్ దోస్త్
Hazarath Reddyపెరుగుతున్న ఆన్‌లైన్ మోసం మరియు సైబర్ నేరాల మధ్య, ఆన్‌లైన్ మోసం గురించి అవగాహన కల్పించడానికి భారత ప్రభుత్వంలోని హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ దోస్త్ ట్విట్టర్ హ్యాండిల్ సోషల్ మీడియాను ఆశ్రయించింది. తన పోస్ట్‌లో, సైబర్ దోస్త్ ఒకరి బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి కొన్ని చిట్కాలను పంచుకుంది.
New Rule at Twitter: రోజుకు 12 గంటల పాటు వారానికి ఏడు రోజులు పని చేయాల్సిందే, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్
Hazarath Reddyఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కొంతమంది ట్విట్టర్ ఇంజనీర్లు రోజుకు 12 గంటలు మరియు వారానికి ఏడు రోజులు పని చేయవలసిందిగా ఆర్డర్ పాస్ చేశారని సమాచారం.
WhatsApp Bans Accounts: మరోసారి లక్షలాది అకౌంట్లు నిషేదించిన వాట్సాప్, గతం కంటే 15 శాతం ఎక్కువ అకౌంట్లు నిషేదిస్తూ నిర్ణయం, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలుసా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ వాట్సాప్ అకౌంట్‌ కూడా బ్యాన్ అవ్వడం పక్కా
Naresh. VNSపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో విద్వేషపూరిత ప్రసంగం (Hate speech), తప్పుడు సమాచారం, నకిలీ వార్తలపై గతంలో విరుచుకుపడ్డాయి. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఏకపక్షంగా కంటెంట్‌ని అందించడం, యూజర్లను ‘డి-ప్లాట్‌ఫార్మింగ్’ చేయడంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
Chrome Security Breach: గూగుల్‌ క్రోమ్, జూమ్‌ వాడుతున్నారా? మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ డేంజర్‌లో ఉన్నాయి, వెంటనే ఈ పని చేయకపోతే ఇక అంతే! క్రోమ్ యూజర్లకు అలర్ట్ జారీ చేసిన గూగుల్, ఈ స్టెప్స్ ఫాలో అయితే క్రోమ్ సేఫ్‌
Naresh. VNSలేటెస్టుగా క్రోమ్ యూజర్లకు గూగుల్ హై-సెక్యూరిటీ (High Security) వార్నింగ్ జారీ చేసింది. సాంకేతిక దిగ్గజం వినియోగదారు డివైజ్‌లకు హాని కలిగించే బగ్ గురించి హెచ్చరిస్తోంది. CVE-2022-3723 అనే కోడ్ ద్వారా డేటా ముప్పు పొంచి ఉందని Google కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. అవాస్ట్ సెక్యూరిటీ పరిశోధకులు ఈ CVE-2022-3723 కోడ్ గుర్తించారు.
WhatsApp: వాట్సాప్ నుంచి కొత్తగా సెల్ఫ్ మెసేజింగ్ ఫీచర్, మీ నంబర్‌కు మీరు సెల్ఫ్ ఛాట్ చేసుకునే విధంగా కొత్త అప్‌డేట్
Hazarath Reddyవాట్సాప్ Android, iOS యూజర్ల కోసం కొత్తగా ‘Messages with yourself’ ఫీచర్‌ను టెస్టింగ్ ప్రారంభించింది.కొత్త అప్‌డేట్‌తో, మీరు మీ సొంత నంబర్‌కు చెందిన వాట్సాప్ చాట్‌ను ఓపెన్ చేసినప్పుడు యాప్ చాట్ క్యాప్షన్‌గా ‘Message yourself’ని యాడ్ చేయడం ద్వారా మీ పర్సనల్ చాట్ బాక్స్‌ను పొందవచ్చు.
Instagram Down: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయంటూ యూజర్లు గగ్గోలు, అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపిన ఇన్‌స్టాగ్రామ్
Hazarath Reddyఫోటో షేరింగ్ యాప్ యొక్క వినియోగదారులు ఎటువంటి వివరణ లేకుండా తమ ఖాతాలు అకస్మాత్తుగా నిలిపివేయబడుతున్నాయని చెప్పడంతో Instagram వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు తమ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు హెచ్చరిక సందేశాన్ని అందించినట్లు నివేదించారు
ATM Withdrawal Charges: ఏటీఏంలో పదే పదే డబ్బులు తీస్తున్నారా, అయితే ఈ ఛార్జీల బాదుడు గురించి ముందుగా తెలుసుకోండి, అయిదు లావాదేవీలు దాటితే ఏ బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుందో పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyబ్యాంక్‌ కస్టమర్లకు పలు బ్యాంకులు భారీ షాక్‌ ఇచ్చాయి.ఏటీఎంల్లో లావాదేవీలపై ఛార్జీలను పెంచేశాయి. ఇకపై బ్యాంకులు తెలిపిన పరిమితి సంఖ్య దాటిన లావాదేవీలపై సర్వీస్‌ చార్జీల బాదుడిని (ATM Withdrawal Charges) మొదలెట్టాయి.
Jack Dorsey New Social Media: ట్విట్టర్ మాజీ సీఈవో నుంచి మరో సరికొత్త సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫాం, ప్రస్తుతం బీటాదశలో ఉన్న యాప్, ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూజర్లు
Naresh. VNSట్విట్టర్ కో-ఫౌండర్ అయిన జాక్ డోర్సే (Jack Dorsey) నూతన సామాజిక మీడియా వేదికను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారట. మరి కొద్ది రోజుల్లో కొత్త సోషల్ మీడియా వేదిక (social app) అందుబాటులోకి రానున్నట్లు కూడా చెప్తున్నారు. యాప్ ద్వారా తీసుకు రానున్న ఈ కొత్త సోషల్ మీడియా వేదిక పేరు ‘బ్లూస్కీ’ (Bluesky)అని ఖరారు చేశారు.
'The Bird Is Freed': పూర్తయిన డీల్, ట్విట్టర్ పిట్టకు విముక్తి లభించిందంటూ వైరల్ ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్, రాగానే సంచలన నిర్ణయం తీసుకున్న టెస్లా అధినేత
Hazarath Reddyగత కొన్నాళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ట్విటర్‌ డీల్‌ ఎట్టకేలకు పూర్తయింది. 44 బిలియన్‌ డాలర్లకు బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ సొంతమైంది. దీంతో ట్విటర్‌ బర్డ్‌ మస్క్‌ గూటికి చేరింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి స్పందిస్తూ ‘ద బర్డ్‌ ఈజ్‌ ఫ్రీడ్‌’ అంటూ మస్క్‌ ట్వీ ట్‌ చేశారు.
Musk take over Twitter: ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ఇక, మస్క్ చేతికి ప్రపంచంలోనే అతిపెద్దదైన చర్చా వేదిక.. 44 బిలియన్ డాలర్లకు డీల్.. వచ్చీరాగానే.. సీఈవో పరాగ్ అగర్వాల్ సహా హెడ్‌లందరిపైనా వేటు..
Sriyansh Sటెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎట్టకేలకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నారు. వచ్చీ రాగానే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లపై వేటేశారు. ఈ మేరకు యూఎస్ మీడియా గత అర్ధరాత్రి దాటాక పేర్కొంది.
Diwali 2022: ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ వైరల్ ట్వీట్, హ్యాపీ దివాళీ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన కుక్
Hazarath Reddyఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా హ్యాపీ దివాళీ అంటూ విష్‌ చేశారు.తన పోస్ట్‌తో పాటు భారత ఫోటోగ్రాఫర్‌ తీసిన ఫోటోను కుక్‌ షేర్‌ చేయగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపేక్ష మేకర్‌ ఫొటోగ్రాఫ్‌ను టిమ్‌ కుక్‌ షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఓ మహిళ రెండు చేతులతో ప్లేట్‌లో వెలుగుతున్న దీపాలను కవర్‌ చేస్తుండగా చుట్టూ పూవులతో అలంకరించడం కనిపిస్తుంది.