World

Plane Crash in Brazil: బ్రెజిల్‌ లో ఘోర విమాన ప్రమాదం.. చూస్తూ ఉండగానే గాల్లో గింగిరాలు తిరుగుతూ ఇండ్ల మధ్య కూలిన ప్రయాణికుల విమానం.. 62 మంది దుర్మరణం (వీడియోతో)

Rudra

బ్రెజిల్‌ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 62 మందితో వెళుతున్న ఓ ప్రయాణికుల విమానం సావో పువాలోలోని విన్హెడో టౌన్ లో గాలిలో గింగిరాలు తిరుగుతూ కూలిపోయింది.

Middle East Tension: పశ్చిమాసియాలో మళ్లీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్‌కు ఎయిర్‌ఇండియా విమాన సర్వీసులు బంద్‌

Hazarath Reddy

ఓ వైపు జ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas conflict), మరోవైపు హెజ్‌బొల్లా, ఇరాన్‌ జోక్యంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది.

Iraq Barbaric Bill: అమ్మాయిలకు 9 ఏళ్లకే పెళ్లి, ఇరాక్‌లో కొత్త ప్రతిపాదిత చట్టం, అమలైతే అంతేనా?

Arun Charagonda

ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కామాంధులు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు తోడు వివాహేతర సంబంధాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాక్ లాంటి దేశంలో అనైతిక సంబంధాలు చాలా ఎక్కువ.

Helicopter Crash in Nepal: నేపాల్‌లో మరో హెలికాప్టర్ ప్రమాదం, సువాకోట్ సమీపంలో కుప్పకూలిన విమానం, 5 మంది చైనీయులు మృతి

Hazarath Reddy

నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే తాజాగా మరో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండు నుండి సియాఫ్రుబెన్సి కి వెళుతున్న ఓ హెలికాఫ్టర్ సువాకోట్ సమీపంలో కుప్పకూలింది.

Advertisement

Earthquake in Japan Videos: జపాన్‌లో భారీ భూకంపం, స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు కంపించిన భూమి, సునామీ హెచ్చరికలు జారీ వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

జపాన్‌లో స్వల్ప వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఓసారి 7.1, మరోసారి 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. జపాన్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం క్యుషు తూర్పు తీరంలో దాదాపు 30 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో ఆగని ఆందోళనలు, వీసా సెంటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించిన భారత్, నేడు కొలువుదీరనున్న మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమంతో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మీ రంగంలోకి దిగినప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రానట్లు తెలిసింది.

Bangladesh Crisis Updates: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్..15 మంది సభ్యులతో ప్రభుత్వ ఏర్పాటు, నేడే బాధ్యతల స్వీకరణ, భారత్‌లోకి చొరబడేందుకు ప్రజల ప్రయత్నం

Arun Charagonda

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ భాద్యతలు స్వీకరించనున్నారు నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్. ఇవాళ దుబాయ్ నుండి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు యూనస్. ఇవాళ సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుండగా కొత్తగా ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఉండే అవకాశం ఉంది.

Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు, వారిలో 9 వేల మంది విద్యార్థులే, నిరంతరం వారితో టచ్‌లో ఉన్నామని తెలిపిన జైశంకర్

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్ననేపథ్యంలో అక్కడ మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 9 వేల మంది విద్యార్థులేనని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. ఆందోళనలు (Bangladesh Crisis) మొదలైన జూలై నెలలోనే చాలామంది వచ్చేశారని చెప్పారు.

Advertisement

Sheikh Hasina: షేక్ హసీనాను అరెస్ట్ చేయండి.. ఆ తర్వాత మాకు అప్పగించండి.. భారత్‌ ను కోరిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోయేషన్

Rudra

యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ విడిచిపెట్టి వచ్చి భారత్‌ లో తలదాచుకుంటున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి.

Hiroshima, Nagasaki Atomic Bombings: హిరోషిమా, నాగసాకిపై అణుబాంబు దాడులు, మృతులకు నివాళి అర్పించిన లోక్‌సభ సభ్యులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో 1945 ఆగస్టులో అణుబాంబు పేలుళ్లలో వేలాది మంది మరణించి, గాయపడిన మృతులకు లోక్‌సభ మంగళవారం నివాళులర్పించింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆగస్టు 6, 9 తేదీలలో హిరోషిమా మరియు నాగసాకి నగరాలపై బాంబులు వేయబడ్డాయి

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో ఆగని హింస, హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవదహనం, కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు గాలిలోకి..

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో విధ్వంసం కొనసాగుతోంది. తాజాగా జషోర్ జిల్లాలో ఓ హోటల్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో ఒకరు ఇండోనేషియా పౌరుడు ఉన్నాడని లోకల్ మీడియా చెబుతోంది. ఆందోళనకారులు నిప్పు పెట్టిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందినది.

Bangladesh Unrest: బంగ్లాదేశ్ నిరసనలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్‌ వేదిక మారనున్నట్లు వార్తలు, భారత్ లేదా UAE లేదా శ్రీలంకకు ఐసీసీ తరలిస్తుందా?

Vikas M

బంగ్లాదేశ్‌లో చెల‌రేగుతున్న హింస ప్ర‌పంచ క్రికెట్‌పై ప‌డ‌నుంది. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా (Shaikh Hasina) రాజీనామాతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌లో మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గాల్సిన‌ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ (T20 World Cup 2024)పై అనిశ్చితి నెల‌కొంది.

Advertisement

UK Riots: బ్రిటన్‌లో హింసాత్మక నిరసనలు, భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీని జారీ చేసిన భారత రాయబార కార్యాలయం

Hazarath Reddy

వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్‌లోని పలు నగరాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది.

Bangladesh Protests: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయం స్కాన్‌ టెంపుల్‌పై దాడి, ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టిన దుండగులు

Hazarath Reddy

ఖుల్నా డివిజన్‌లోని మెహర్‌పూర్‌లో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌పై (ISKCON Temple) గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు.ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టారు. ఆ ప్రతిమలను కాల్చివేశారు.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు, భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదని తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు. అక్కడ ఉన్న భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్నారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని సమావేశంలో వెల్లడించారు.

Suitcase of Sheikh Hasina: ప్రధాని షేక్‌ హసీనా చీరలు దొరికాయోచ్.. ఈ చీరలు నా భార్యకు ఇచ్చేస్తా.. ఇక అప్పుడు నా భార్య కూడా ప్రధానే..! బంగ్లా ప్రధాని నివాసం గణ భవన్‌ లోకి చొరబడి హసీనా సూట్ కేసు ఎత్తుకెళ్తూ ఓ దుండగుడి వ్యాఖ్యలు.. (వీడియోతో)

Rudra

యువకుల నిరసనలతో బంగ్లాదేశ్‌ లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చు కారణంగా అదుపు తప్పిన అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసి సోదరితో కలిసి భారత్‌ కు వచ్చారు.

Advertisement

Bangladesh Unrest: బంగ్లాదేశ్ అల్లర్లు, ప్రధాని మోదీ నివాసంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ అత్యవసర భేటీ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో పరిణామాల నేపథ్యంలో భారత భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం అత్యవసరం భేటీ అయ్యింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. పొరుగు దేశంలో తాజా పరిస్థితులు, దేశంలో ముందస్తుగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు

Bangladesh Protest: నిరసనలతో భగ్గుమంటున్న బంగ్లాదేశ్, అన్ని విమాన సర్వీసులు, రైళ్లను రద్దు చేసిన భారత్, ఎల్ఐసీ ఆఫీసు మూసివేత

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌ ఇండియా (Air India), ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసాయి. షెడ్యూల్‌ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్‌ నుంచి రావాల్సిన సర్వీసులను నిలిపివేశాయి.

Bangladesh Protest: వీడియో ఇదిగో, షేక్‌ హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ భేటీ

Hazarath Reddy

Bangladesh Protest: వీడియో ఇదిగో, భారత్ చేరుకున్న షేక్ హసీనా, లండన్ వెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలు, భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం

Hazarath Reddy

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్నారు. ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులకు ఆమె స్వాగతం పలికారు. అయితే, ఆమె భారత్‌ నుంచి లండన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement
Advertisement