తాజా వార్తలు
Preeti Sudan: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్పర్సన్గా ప్రీతి సుదన్, ఐఏఎస్ ఆఫీసర్ బయోడేటా ఇదిగో..
Hazarath Reddyయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్పర్సన్గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుదన్ నియమితులయ్యారు. ఆగస్టు ఒకటో తేదీన, రాజ్యాంగంలోని ఆర్టికల్ 316ఏ ప్రకారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం యూపీఎస్సీ కమీషన్లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు.
Veena George Car Accident: వయనాడ్ వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాల నుంచి బయటపడిన వీణా జార్జ్
Hazarath Reddyకేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్ (Veena George)తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వయనాడ్కు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు.
Rinku Singh Bowling: రింకూ సింగ్ గేమ్ ఛేంజర్, వీడియో ఇదిగో..అద్భుత బౌలింగ్,వావ్ అనకుండా ఉండలేరు!
Arun Charagondaశ్రీలంకతో జరిగిన మూడు టీ 20ల సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక 12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. 19వ ఓవర్లో ఎవరూ ఉహించని విధంగా బ్యాట్స్మెన్ రింకూ సింగ్కు బాల్ అప్పగించాడు కెప్టెన్ సూర్య.
Wayanad Landslide Death Toll: శవాల దిబ్బగా మారిన దేవుని సొంత దేశం, వయనాడ్ విలయంలో 158కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కానరాని 98 మంది జాడ
Hazarath Reddyదేవుని స్వంత దేశంగా ప్రసిద్ధికెక్కిన కేరళలోని వయనాడ్లో సంభవించిన అత్యంత విషాదకరమైన కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
Suryakumar Yadav Bowling: వీడియో ఇదిగో, సూర్యకుమార్ యాదవ్ సూపర్బ్ బౌలింగ్, ఒకే ఓవర్లో రెండు వికెట్లు, మ్యాచ్ టై
Arun Charagondaభారత్ - శ్రీలంక మధ్య జరిగిన మూడో టీ20లో అద్భుతం చేశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. చివరి ఓవర్లో శ్రీలంక 6 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో బౌలింగ్కు దిగాడు సూర్య. ఈ ఓవర్లో 5 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసి మ్యాచ్ టైగా ముగియడంలో కీ రోల్ పోషించాడు.
Wayanad Landslide: కేరళ విలయానికి కారణమిదేనా?, కొనసాగుతున్న సహాయక చర్యలు, వందలాది మంది శిథిలాల కిందే,పొంచి ఉన్న భారీ వర్షం ముప్పు!
Arun Charagondaదేవుని సొంత దేశంగా పేర్కొనే కేరళ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి చిన్నా,భిన్నమైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడటంతో కేరళలోని వాయనాడ్ అతలాకుతలమైంది. ఓ వైపు కొండచిరయలు, మరోవైపు బురద నీరు వెరసి వందలాది మంది వాటి కింద సజీవ సమాధి అయ్యారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
Rave Party: మేడ్చల్లో రేవ్ పార్టీ భగ్నం, 10 లీటర్ల లిక్కర్, బీరు బాటిళ్లు స్వాధీనం, పార్టీలో బిగ్ బాస్ ఫేంతో పాటు సినీ నటులు?
Arun Charagondaతెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా మందుపార్టీ ఏర్పాటు చేయగా రైడ్ చేసిన పోలీసులు 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకొకున్నారు.
TDP MLA Daggubati On Poker Clubs: త్వరలో ఏపీలో పేకాట క్లబ్బులు,పేకాట ఆడకపోవడం వల్ల తగ్గిన జీవితకాలం, వైరల్గా టీడీపీ ఎమ్మెల్యే వీడియో
Arun Charagondaఅనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Khammam: ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య, సీపీఐ ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆరోపణ?, కూనంనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్?
Arun Charagondaసీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు వేధింపులకు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వ డాక్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కొత్తగూడెం మాజీ కలెక్టర్ ప్రియాంక, కొత్తగూడెం మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఆర్ఎల్ లక్ష్మణరావు, కొత్తగూడెం సహారా ఏజెన్సీ వాళ్ల వేధింపుల వల్ల కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ సూపరిండెంట్ బొడ్డ కుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది.
IND vs SL: సూపర్ ఓవర్లో సూర్య సేన గెలుపు, కెప్టెన్గా తొలి సిరీసే క్లీన్ స్వీప్, బంతితో మ్యాజిక్ చేసిన రింకూ,సూర్య
Arun Charagondaశ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. కోచ్గా గంభీర్కు, కెప్టెన్గా సూర్యకుమార్కు ఇది తొలి సిరీస్ కాగా అదరగొట్టింది టీమిండియా. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. చివరి టీ20 సూపర్ ఓవర్లో విజయం సాధించింది టీమిండియా.
CM Revanth Reddy On Gaddar Awards: సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి, చిరు పిలుపుతోనైనా ఇండస్ట్రీ కదిలేనా? గద్దర్ అవార్డులపై క్లారిటీ వచ్చేనా?
Arun Charagondaసినీ పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని నంది అవార్డులతో సత్కరిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డులకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అయితే కొద్దిరోజులుగా ఈ సంప్రదాయం పక్కకు పోయింది.
Paris Olympic Games 2024: బాక్సింగ్లో భారత్కు భారీ షాక్, 51 కిలోల విభాగంలో ఓటమితో ఇంటిదారి పట్టిన అంతిమ్ పంగల్, మహిళా బాక్సర్ల పైనే భారత్ పతకం ఆశలు
Vikas Mఒలింపిక్స్లో పతకం ఖాయమనుకున్న బాక్సింగ్లో భారత్కు భారీ షాక్ తగిలింది. కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పతకంతో మెరిసిన అంతిమ్ పంగల్(Antim Panghal) పారిస్ ఒలింపిక్స్ 2024లో మాత్రం నిరాశపరిచాడు. 51 కిలోల విభాగంలో ఈ స్టార్ బాక్సర్ 16వ రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు.
Sri Lanka's Squad For ODI Series: భారత్తో మూడు వన్డేల సిరీస్కు శ్రీలంక జట్టు ప్రకటన, ఆ స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్
Vikas Mభారత్తో మూడు వన్డేల సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్ను తప్పించి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది.
The RajaSaab Glimpse: డార్లింగ్ ప్రభాస్ మేనియా మాములుగా లేదుగా.. యూట్యూబ్లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతున్న ది రాజాసాబ్ గ్లింప్స్, వీడియో ఇదిగో..
Vikas Mరెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజాసాబ్'. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో దూసుకెళ్తోంది. ఏకంగా నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్ విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
Chiranjeevi on Gaddar Awards: నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు, ఫిలిం ఛాంబర్కు కీలక సూచన చేసిన చిరంజీవి, సీఎం వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
Vikas Mతెలుగు పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూషర్స్ కౌన్సిల్కు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అవార్డులను పునరుద్ధరిస్తూ గద్దర్ అవార్డ్స్ పేరిట తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం శుభపరిణామమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిన విషయమన్నారు.
Chiranjeevi: వీడియో ఇదిగో, సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని తోసేసిన మెగాస్టార్ చిరంజీవి, నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
Vikas Mఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన ఓ వ్యక్తి మెగాస్టార్తో సెల్ఫీ కోసం ఎగబడ్డాడు. అయితే సెల్ఫీ కోసం వచ్చిన సిబ్బందిని మెగాస్టార్ పక్కకు తోసేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని కొందరు నెటిజన్స్ మండిపడుతున్నారు.
Wayanad Landslide: వయనాడ్లో ఆగని మృత్యుఘోష, 123కి చేరిన మృతుల సంఖ్య, 128 మందికి తీవ్ర గాయాలు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyకేరళ (Kerala)లోని వయనాడ్ జిల్లా ప్రకృతి ప్రకోపానికి బలైంది. భారీ వర్షం కారణంగా కొండచరియలు (Wayanad Landslides) విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద తిరిగిరాని లోకాలకు వెళ్ళాయి
Shimla Fight Video: వీడియో ఇదిగో, యువతీ యువకులు తన్నుకుంటుంటే డ్యాన్స్ వేస్తూ రీల్ చేసిన మరో యువతి, సిమ్లాలో ఘటన
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్ నుండి ఒక వీడియో ఇంటర్నెట్లో కనిపించింది. సిమ్లాలోని ఓ రోడ్డుపై కొందరు యువతీ యువకులు జుట్టు పట్టుకొని పోట్లాడుకుంటుంటే.. ఇన్ఫ్లుయెన్సర్ వారికి సమీపంగా వెళ్లింది. అనంతరం కొట్టుకుంటున్న వారు వీడియోలో కనిపించేలా నవ్వుతూ రీల్స్ చేస్తూ కనిపించింది.
Farmer Dies After Tractor Overturns: వెంటాడుతున్న విషాదాలు, 10 రోజుల్లో ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు రైతులు మృతి, తాజాగా పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి అన్నదాత మృతి
Hazarath Reddyతెలంగాణలోని నాగరకర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వంగూరు మండలంలో వంగూరు గ్రామానికి చెందిన రైతు మీసాల లక్ష్మయ్య పొలం దున్నుతూ ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, ఢిల్లీ మెట్రో రైలులో చెప్పులతో కొట్టుకుంటూ తన్నుకున్న ప్యాసింజర్లు
Hazarath Reddyతగాదాలు, అసభ్యకర చర్యలకు పాల్పడే వైరల్ వీడియోలకు ఢిల్లీ మెట్రో కేంద్రంగా మారింది. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దెబ్బలాడుకుంటున్న మరో వీడియో ఇంటర్నెట్లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.