జాతీయం
Wayanad Landslide Death Toll: వయనాడ్లో ఇంకా ఆగని మృత్యుఘోష, 308కు చేరుకున్న మృతుల సంఖ్య, నాలుగు రోజుల తర్వాత గాయాలతో సజీవంగా బయటపడిన కుటుంబం
Hazarath Reddyకేరళలోని వయనాడ్లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 308 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్దారించారు.
Maharashtra: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో విషాదం, నదిని దాటుతు బోల్తా పడిన ట్రాక్టర్,8 మంది గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Arun Charagondaమహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ఇచల్కరంజిలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిని దాటుతున్న ట్రాక్టర్ బోల్తా పడింది. నది ప్రవాహానికి అందులో ఉన్న 7-8 మంది గల్లంతయ్యారు. ఎన్డిఆర్ఎఫ్ బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం స్థలానికి చేరుకుంది.
Madhya Pradesh Horror: దారుణం, నిద్రలో మూత్ర విసర్జన చేశాడని బాలుడి ప్రైవేట్ పార్టుపై వేడి గరిటెతో కాల్చిన సవతి తల్లి, బాధతో అల్లాడిపోయిన పసివాడు
Hazarath Reddyమధ్యప్రదేశ్లోని గుణ జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలుడిపై సవతి తల్లి రాక్షసంగా ప్రవర్తించింది. బుధవారం తెల్లవారుజామున బాలుడు నిద్రలో మంచంపై మూత్ర విసర్జన చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
NEET UG 2024 Paper Leak Case: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపాల వల్ల లీకేజీ, నీట్ యూజీ 2024 పరీక్ష ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyనీట్ యూజీ 2024 పరీక్ష (NEET UG 2024 Exam) ప్రశ్నపత్నం లీకేజీ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ ఇటీవల కీలక తీర్పునిచ్చిన ధర్మాసనం.. అందుకుగల కారణాలను వివరిస్తూ శుక్రవారం మళ్లీ తీర్పు వెలువరించింది.
Fake Deliveray Scam: డెలివరీ బాయ్ స్కామ్తో జాగ్రత్త..మీరు ఏం ఆర్డర్ చేయకుండానే ఓటీపీ చెప్పారో..అంతే!
Arun Charagondaసైబర్ కేటుగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా వదలట్లేదు. తాజాగా డెలివరీ బాయ్ స్కామ్ తెరపైకి వచ్చింది. మీరు ఆర్డర్ చేయకుండానే మీకు ఆన్లైన్లో ఆర్డర్ వచ్చిందని డెలివరీ బాయ్ వస్తే ఖచ్చితంగా అది స్కాం అని గుర్తించండి. మీకు ఎవరో ఆర్డర్ పంపారు అని మీ మొబైల్కు వచ్చిన OTP చెప్పమని అడిగితే చెప్పకండి. మీకు తెలియకుండానే మీకు ఎలాంటి ఆర్డర్ రాదు కాబట్టి అది ఖచ్చితంగా మోసమేనని గ్రహించి సైబర్ మోసాలకు ఒక్క అడుగు దూరంలో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Viral Video: తరగతి గదిలో స్విమ్మింగ్ చేస్తున్న విద్యార్థులు వీడియో మళ్లీ వైరల్, పిల్లల్ని స్కూలుకు రప్పించడానికి యూపీ టీచర్లు చేసిన ప్రయత్నంపై భిన్నాభిప్రాయాలు
Hazarath Reddyసోషల్ మీడియాలో పాత వీడియోలు మళ్లీ ఒక్కోసారి సందర్భం వచ్చినప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరగతి గదిని స్విమ్మింగ్ పూల్గా మార్చింది.
Andhra Pradesh Horror: అనంతపురంలో కామాంధుడుగా మారిన స్కూల్ కరస్పాండెంట్, రూం తలుపేసి చిన్నపిల్లలు బట్టలు విప్పి దారుణమైన వేధింపులు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఆదిమూర్తినగర్లోని లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో కరస్పాండెంట్ ఆంజనేయులు గౌడ్ అసభ్య ప్రవర్తంచాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. ఆంజనేయులు పలుమార్లు తమ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడన్న తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana Assembly Sessions: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, బీసీసీఐతో చర్చలు జరిపామన్న సీఎం రేవంత్ రెడ్డి, మండలానికో మినీ స్టేడియం ప్రతిపాదన
Arun Charagondaగ్రేటర్ హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతుందని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీ సమీపంలోనే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు .ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐతో చర్చలు పూర్తయ్యాయని వెల్లడించారు.
Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, భార్యాభర్తల గొడవను తీర్చడానికి వెళ్లిన పోలీసును అమ్మనాబూతులు తిట్టిన భర్త, అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో, పోలీసు అధికారులను దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియో వైరల్ కావడంతో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు అతని భార్య మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నించినప్పుడు, అతని గుర్తింపును బహిర్గతం చేయని ఓ వ్యక్తి వీడియోలో " తేరీ మా చ్** దుంగా "తో సహా అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం వీడియోలో కనిపించింది.
Hoarding Collapse in Thane: వీడియో ఇదిగో, మహారాష్ట్రలో బలమైన గాలులకు కూలిన హోర్డింగ్, తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు,మూడు వాహనాలు ధ్వంసం
Hazarath Reddyమహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ హోర్డింగ్ కూలి మూడు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయని అధికారి తెలిపారు. డోంబివిలి ప్రాంతంలో రద్దీగా ఉండే సహజానంద్ చౌక్ వద్ద ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి గాయాలు అయినట్లు నివేదికలు లేవని ఆయన తెలిపారు.
Road Accident Video: వీడియో ఇదిగో, రాయదుర్గంలో వేగంగా వచ్చి ఫ్లై ఓవర్ గోడను ఢీకొట్టి నుజ్జునుజ్జు అయిన కారు, స్పాట్లోనే స్టూడెంట్ మృతి
Hazarath Reddyరాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యి.. అందులోని స్టూడెంట్ మృతి చెందాడు. ఈ యాక్సిడెంట్తో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
Andhra Pradesh Shocker: నంద్యాలలో ఘోర విషాదం, అర్థరాత్రి మట్టి మిద్దె కుప్పకూలడంతో నిద్రలోనే కుటుంబం మృత్యువాత, వీడియో ఇదిగో..
Hazarath Reddyనంద్యాలజిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది.జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులతో పాటుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది.
Telangana: సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే బండ్ల భేటీ, కాంగ్రెస్లోనే కొనసాగే అవకాశం, బీఆర్ఎస్ నేతల నిరాశ
Arun Charagondaఫిరాయింపులు , బుజ్జగింపులు వెరీసీ తెలంగాణ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. మొన్న బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ తిరిగి బీఆర్ఎస్ సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్యే ఇంట్లో టిఫిన్ చేస్తూ జరిగిన చర్చల ఫలితం 24 గంటలు గడవక ముందే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.
Bomb Threat in Delhi: ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు.. విద్యార్థులను బయటకు పంపించి తనిఖీలు
Rudraఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. నగరంలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Man Buried Alive: ఇదెక్కడి ఘోరం..? భూవివాదం నేపథ్యంలో వ్యక్తిని సజీవంగా పాతిపెట్టిన దుండగులు.. వీధి కుక్కలు తవ్వడంతో బతికి బయటపడ్డ బాధితుడు.. ఆగ్రాలో ఘటన
Rudraయూపీలోని ఆగ్రాలో ఘోరం జరిగింది. భూవివాదంలో గొడవ ముదరడంతో నలుగురు వ్యక్తులు ఓ వ్యక్తిని కొట్టి, గొంతు నులిమి, సజీవంగా పూడ్చిపెట్టారు. అయితే, అనూహ్యంగా పాతిపెట్టిన ప్రాంతాన్ని వీధికుక్కలు తవ్వడంతో అతను బయటపడ్డాడు.
Jurala Project: జురాలకు పోటెత్తిన వరద, 42 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి, పోటెత్తిన పర్యాటకులు
Arun Charagondaమహబూబ్నగర్ జిల్లా జూరాలకు వరద పోటెత్తింది. దీంతో 42 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇన్ ఫ్లో: 3,25,000 వేల క్యూ సెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 3,11,734 వేల క్యూ సెక్కులుగా ఉంది.
Rahul Gandhi: నాపై ఈడీ దాడికి ప్లాన్.. చక్రవ్యూహం వ్యాఖ్యలే దీనికి కారణం.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Rudraఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఈడీలో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారులు తనకు సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు.
YS Jagan Passport Renewal: భార్య వైఎస్ భారతితో కలిసి పాస్ పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న మాజీ సీఎం జగన్
Rudraఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5.30 గంటల సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందరు రోడ్డులోని పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చారు.
Viral Video: టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్
Rudraటాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రియురాలు లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. దీనిపై ఓ తెలుగు టీవీ న్యూస్ చానల్ డిబేట్ నిర్వహించింది.
Intel Layoffs: 20 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించుకోబోతున్నాం.. ఇందులో భాగంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన
Rudraఆర్ధిక మాంద్యం భయాలు, మార్కెట్ లో తిరోగమనం వెరసి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా చిప్ ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది.