జాతీయం
Supreme Court On SC, ST Reservation: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు, వర్గీకరణ నిర్ణయం రాష్ట్రాలదేనని స్పష్టత, వ్యతిరేకించిన జస్టిస్ బేలా త్రివేది
Arun Charagondaఎస్సీ ,ఎస్టీ వర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎస్టీ, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం రాష్ట్రాలదేనని తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో తీర్పును వ్యతిరేకించారు జస్టిస్ బేలా త్రివేది. ఉప వర్గీకరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు త్రివేది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.
Andhra Pradesh: పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్ చల్, ట్యాంకర్కి నిప్పు పెడతానని బెదిరింపు, అడ్డుకున్న సిబ్బంది, వీడియో వైరల్
Arun Charagondaఏపీలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమాని హల్చల్ చేశాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి చేర్చాలంటూ పెట్రోల్ బంక్ దగ్గర హల్చల్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త హంగామా చేశాడు. లేదంటే ట్యాంకర్కి నిప్పు పెడుతానంటూ సిలిండర్, లైటర్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. బంక్ సిబ్బంది ఎట్టకేలకు యువకుడిని అడ్డుకోగా పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana Shocker: అందమే ఆమె శాపమైంది, సినిమాల్లో ఛాన్స్ పేరుతో అత్యాచారం, మోసపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అసిస్టెంట్ డైరెక్టర్ నిర్వాకం
Arun Charagondaఅంతమే ఆమె పాలిట శాపమైంది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారానికి ఒడగట్టాడు. హైదరాబాద్ పుప్పాలగూడలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Wayanad Landslides Live Updates: వాయనాడ్లో కొనసాగుతున్న సహాయ చర్యలు, పెరుగుతున్న మృతుల సంఖ్య, బాధితులకు రాహుల్ గాంధీ పరామర్శ
Arun Charagondaకేరళను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 200 మందికి పైగా మృతదేహాలు వెలికితీయగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం రెస్య్కూ కొనసాగుతోంది.
Uttar Pradesh: యూపీలో రెచ్చిపోయిన ఆకతాయిలు, బైక్పై వెళ్తున్న జంటపై నీళ్లు చల్లిన యువకులు, కిందపడిపోయిన జంట
Arun Charagondaయూపీలోని లక్నోలో ఆకతాయిలు రెచ్చిపోయారు. తాజ్ హోటల్ బ్రిడ్జిపై వెళ్తున్న జంటపై నీళ్లు చల్లుతూ కొందరు యువకులు వికృతానందం ప్రదర్శించారు. ఆకతాయిల అల్లరి చేష్టల కారణంగా కిందపడిపోయింది ఆ జంట. ఈ వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Delhi Rains: మళ్లీ ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు,నీట మునిగిన కాలనీలు, రెడ్ అలర్ట్ జారీ, స్కూళ్లకు సెలవు, విమానాలు దారి మళ్లింపు, ఆగస్టు 5 వరకు వర్షాలు
Arun Charagondaదేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు మళ్లీ ముంచెత్తాయి. భారీ వర్షాలతో పలు కాలనీలు నీట మునగగా ఇళ్లు కూలిపోయాయి. పలు వాహనాల్లోకి నీరు చేరింది .భారీవర్షాలతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించింది. ఆగస్టు 5 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Telangana: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, గర్భిణీ కడుపులో నుంచి బయటకు ఎగిరిపడ్డ పిండం, మనోహరాబాద్ లో బైక్ను ఢీ కొట్టిన లారీ
sajayaమెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం 44వ జాతీయ రహదారి వద్ద జూలై 31వ తేదీ బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడు నెలల గర్భిణి మృతి చెందింది.
ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో సరికొత్త రికార్డు, ఏకంగా 7 కోట్లు దాటిన ఐటీఆర్ ఫైలింగ్స్
VNSనేటితో గడువు పూర్తికానుండటంతో.. ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసేందుకు పన్ను చెల్లింపుదారులు (IT Returns) పోటెత్తారు. జులై 31వ తేదీ ఒక్కరోజే సాయంత్రం ఏడు గంటలవరకు ఏకంగా 50 లక్షల మంది రిటర్నులు దాఖలు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ( IT Department) తెలిపింది.
DK Shivakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భేటీ, ఏయే అంశాలపై చర్చించారంటే?
VNSకర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కలిశారు. (DK Shivakumar Meets PM) బెంగళూరు అభివృద్ధి, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో బెంగళూరును అభివృద్ధి చేయాలని కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని చెప్పారు
Yellow Alert For Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన, వచ్చే నాలుగైదు రోజులు కుండపోత వానలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
VNSతెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు (Rain Alert) కురుస్తాయని వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Pawan Kalyan Meets Chandrababu: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుధీర్ఘ చర్చ, పంపకాలపై మూడు పార్టీల మధ్య ఒప్పందం
VNSఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (Chandrababu) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Dy CM Pawan Kalyan) అమరావతిలో సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతర కీలక అంశాలపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
ADR Report on Lok Sabha Poll: మొన్నటి ఎన్నికల్లో 365 సీట్లలో లక్షల్లో ఓట్ల తేడా, ఏపీలో 85 వేల ఓట్లకు పైగానే, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సంచలన నివేదికను బయటపెట్టిన ఏడీఆర్
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మీద ADR సంస్ధ నివేదిక సంచలన విషయాలను బైట పెట్టింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో (Lok Sabha Poll 2024) 538 నియోజకవర్గాల్లో , 365 స్థానాల్లో లక్షల్లో ఓట్ల తేడా ఉనట్టు తెలిపింది
Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోష, 164 మంది శిథిలాల కింద సజీవ సమాధి, ప్రధాని మోదీ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపిన కేంద్ర మంత్రి రాయ్
Hazarath Reddyవయనాడ్ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం..164 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 91 మంది మిస్సింగ్ కాగా, 200 మందికిపైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు.
Wayanad Landslide: వయనాడ్ మృత్యుఘోషపై అమిత్ షా ప్రకటన, వాస్తవాలు చెప్పాలంటూ మండిపడిన కేరళ సీఎం, ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదని వెల్లడి
Hazarath Reddyభారీ వర్షాల కారణంగా వాయనాడ్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల గురించి జూలై 23 లోనే రాష్ట్రాన్ని హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంటులో చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఖండించారు.ఇది ఒకరినొకరు నిందించుకునే సమయం కాదని కేరళ ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో అన్నారు
Amit Shah on Wayanad Landslide: విపత్తు గురించి ముందే అలర్ట్ చేసినా కేరళ సీఎం పట్టించుకోలేదు, వయనాడ్ మృత్యుఘోషపై పార్లమెంట్లో హోమంత్రి అమిత్ షా కీలక ప్రకటన
Hazarath Reddyవయనాడ్ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం..164 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 91 మంది మిస్సింగ్ కాగా, 200 మందికిపైగా ప్రజలు ఆస్పత్రి పాలయ్యారు
Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ పై జీవితకాల నిషేధం విధించిన యూపీఎస్సీ, పుణే సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అక్రమాల ఆరోపణలు
Hazarath Reddyవివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సెలెక్షన్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) రద్దు చేసింది. భవిష్యత్తులో పూజా ఖేద్కర్ సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పుణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
Astrology: వందేళ్ళకు ఒకసారి వచ్చే చతుగ్రాహి యోగం ఆగస్టు 5న. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 ఏళ్లకు ఒకసారి కలిసే చతుర్ గ్రాహియోగం ఆగస్టు 5న ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఈ నాలుగు రాశుల ఒక వారికి సానుకూల ప్రభావం చూపుతుంది.
French President Kiss Controversy: అందరూ చూస్తుండగానే ఫ్రాన్స్ అధ్యక్షుడికి గాఢంగా ముద్దుపెట్టిన మహిళా మంత్రి, పారిస్ వేడుకల్లో వైరల్ అవుతున్న ఫోటో ఇదిగో..
Hazarath Reddyపారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics) క్రీడలు ఇటీవలే ఘనంగా ప్రారంభమైన సంగతి విదితమే. ఈ వేడుకల్లో ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ (Emmanuel Macron)కు ఓ మహిళా మంత్రి గాఢ ముద్దు (Kiss) ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఫొటో ప్రస్తుతం నెట్టింట వివాదానికి దారితీస్తోంది.
Revanth Reddy Vs Sabitha Indrareddy: కంటతడి పెట్టిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అక్కను నమ్మితే మోసం తప్పదని సీఎం రేవంత్ కామెంట్, తీవ్రంగా ఖండించిన సబితా
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి , మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..కేటీఆర్కు కీలక సూచన చేశారు. కొంతమంది అక్కలు ఇక్కడ ముంచి అక్కడ తేలారు.. వారి మాటలు వింటే కేటీఆర్ జూబ్లీబస్టాండ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది పరోక్షంగా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి.
Astrology: సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశం..ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
sajayaసూర్యుడు ఆత్మవిశ్వాసానికి శక్తికి కారణమైన గ్రహంగా చెప్తారు. సమాజంలో గౌరవం సంపదలు పెరగడానికి ఈ సూర్యగ్రహణం సహకరిస్తుంది. అయితే సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం.