Information

Google Pay Users Alert: స్క్రీన్ షేరింగ్ యాప్‌లు వాడొద్దు, గూగుల్ పే యూజర్లను హెచ్చరించిన టెక్నాలజీ దిగ్గజం, వాడితే మీ అకౌంట్లో డబ్బులు హాంఫట్

Hazarath Reddy

ఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక స్కామ్‌లు పెరుగుతున్న కేసుల మధ్య, Google Pay వినియోగదారులను జాగ్రత్తగా ఉండాలని మరియు లావాదేవీలు చేసేటప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఉపయోగించకుండా ఉండాలని గూగుల్ కోరింది.

AP Weather Update: ఏపీలో మొదలైన వానలు, రానున్న రెండు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బంగాళాఖాతంలో కలిసిపోయి కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు 

Hazarath Reddy

కొమోరిన్ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది. ఈ ద్రోణితో రెండు ఉపరితల ఆవర్తనాలు కలిసిపోయి కొనసాగుతున్నాయని వివరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ తెలిపింది.

Special Trains Sabarimala: దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో!

Rudra

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి డిసెంబర్‌ 8 వరకు సికింద్రాబాద్‌, నర్సాపూర్‌, కాచీగూడ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు.

Earthquake in Maharastra: మహారాష్ట్రలో 3.5 తీవ్రతతో భూకంపం.. సోమవారం తెల్లవారుజామున భయపెట్టిన భూకంపం.. తెలంగాణ, కర్ణాటకలోనూ ప్రకంపనలు.. నమోదు కాని ప్రాణ, ఆస్తి నష్టం

Rudra

మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత గల భూకంపం నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

Advertisement

Bank Strike: డిసెంబర్ 4 నుంచి 20వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె, మీ పనులు ఉంటే ఈ లోపే చక్కబెట్టుకోండి, సమ్మె ఎందుకంటే..

Hazarath Reddy

మీరు డిసెంబరు లేదా జనవరిలో మీ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించాలని షెడ్యూల్ చేసి ఉంటే ఈ విషయం తప్పక తెలుసుకోండి! అన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు డిసెంబర్ 4 నుండి జనవరి 20 వరకు తేదీల వారీగా సమ్మె చేయనున్నాయి.

Cyclone Mythili Update: ఏపీకి తప్పిన మిధిలీ తుపాను ముప్పు, అయినా పొంచి ఉన్న మరో గండం, రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న సైక్లోన్

Hazarath Reddy

త్వరలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం అధికారి ఒకరు తెలిపారు. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Weather Forecast: విశాఖకు 420 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం, అల్లకల్లోలంగా మారిన సముద్రం, రానున్న మూడు రోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. ఇది బుధవారం రాత్రి విశాఖ­పట్నానికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్లు, ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Cyclone Midhili Update: ఏపీకి మిధిలీ తుపాను గండం, బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, భారీ వర్షాలతో తమిళనాడు విలవిల

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతం & ఆనుకుని ఉన్న అండమాన్ నికోబార్ దీవులపై అల్పపీడనం ఏర్పడింది. నవంబర్ 15న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

TB Cases in India: భారత్‌ లోనే టీబీ కేసులు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

Rudra

గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్‌ లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది.

Traffic Alert in Hyderabad: నేడు సికింద్రాబాద్‌ కు ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో!

Rudra

ప్రధాని మోదీ మరోసారి హైదరాబాద్‌ కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌ లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ లో నిర్వహిస్తున్న అణగారిన వర్గాల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు.

TTD SED Tickets: నేడు శ్రీవారి 300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌ లైన్‌ లో.. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా విడుదల

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.

Rain Alert to Telangana: తెలంగాణలోని 15 జిల్లాలకు వర్ష సూచన.. రెండ్రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని యెల్లో అలర్ట్

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

Rains Alert in Telangana: వచ్చే రెండు రోజులు తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్‌

Rudra

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, దాని ప్రభావంతో నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Rains in Telangana: 9వ తేదీలోపు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు.. హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడి

Rudra

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్‌ వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్లడించింది.

Road Accidents: సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటా.. మీకు తెలుసా?

Rudra

కేంద్ర రోడ్డు రవాణాశాఖ 2022 జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Goodnews for US Visa: యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గిన వెయిటింగ్ టైమ్.. 2.5 లక్షల నాన్‌ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌ మెంట్లు ఓపెన్

Rudra

అగ్రరాజ్యం అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం సాధారణంగా చాలా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌ న్యూస్ చెప్పింది.

Advertisement

Group 1 & 2 Notifications: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, గ్రూప్-1లో 100 పోస్టులు, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీకి ఈ నెల చివరలో నోటిఫికేషన్‌

Hazarath Reddy

ఏపీలో ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్‌లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

New Paytm Feature: రైలు టికెట్‌ బుకింగ్‌పై పేటీఎం నుంచి అదిరిపోయే ఫీచర్, దీంతో మీకు ఇకపై రైల్లో సీటు గ్యారంటీ, కొత్త ఫీచర్ గురించి ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ దిగ్గజం పేటీఎం రైలు టికెట్ల బుకింగ్‌పై సీటు గ్యారంటీ సేవను ప్రారంభించింది. దీని వల్ల యూజర్లు పేటీఎంపై రైలు టికెట్‌ బుక్‌ చేసుకోవడం ద్వారా కన్‌ఫర్మ్‌డ్‌ టికెట్‌ పొందొచ్చని వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం మాతృ సంస్థ) ప్రకటించింది.

APPSC Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్, యూనివర్సిటీల్లో 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్, నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రాసెస్ మొదలు పెట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Trains Cancelled: విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు కూడా పలు రైలు సర్వీసుల రద్దు.. వివరాలు ఇవిగో!

Rudra

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.

Advertisement
Advertisement