వార్తలు
Telangana Shocker: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో దారుణ హత్య, స్కూల్ టీచర్ని చంపేసిన బార్బర్, నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని గొడవ,కత్తితో దాడి, స్పాట్ లోనే చనిపోయిన టీచర్, వీడియో
Arun Charagondaహైదరాబాద్లో మరో దారుణ హత్య.. ఎస్సార్ నగర్లోని హనుమ హాస్టల్లో మర్డర్ జరిగింది. ఓ కటింగ్ షాపులో పని చేసే గణేష్, ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పని చేసే వెంకటరమణ హాస్టల్లో ఒకే రూంలో ఉంటున్నారు. గణేష్ రోజు మందు తాగుతూ నిద్రకు ఆటంకం కలిగిస్తున్నాడని వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Train Stunts: రైలు పట్టుకొని ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన యువకుడు.. వీడియోలు వైరల్.. అది చూసి అతన్ని హెచ్చరిద్దామని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్.. అసలేం జరిగింది?
Rudraముంబైలోని సెవ్రి రైల్వే స్టేషన్ లో నడుస్తున్న రైలుకు వేలాడుతూ ఫర్హాత్ అజామ్ షేక్ అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు.
Nara Lokesh : ఏపీ ప్రభుత్వ పథకాల పేరు మార్పు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలుగా మార్పు, మరిన్ని పథకాలకు కూడా
Arun Charagondaఅయిదేళ్లపాటు గత ప్రభుత్వం భ్రష్టుపట్టించిన విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతీ నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం అని చెప్పారు.
Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం
Rudraపారిస్ ఒలింపిక్స్ హాకీలో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్ పై విజయం సాధించింది.
India vs Sri Lanka, 1st T20: టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం
Rudraశ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది.
Flooding In Delhi: భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం.. వరదధాటికి నీట మునిగిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్.. ముగ్గురు విద్యార్థులు మృతి
Rudraభారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతున్నది. వరదధాటికి హస్తిన ప్రజలు అస్తవ్యస్తం అవుతున్నారు. నగరంలోని రాజేందర్ నగర్ లో ఉన్న ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు.
TG New Governor Jishnu Dev Varma: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్
Rudraరాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు శనివారం రాత్రి తెలిపాయి. రాజస్థాన్ గవర్నర్ గా హరిబౌ కిషన్ రావు బాగ్డేను నియమించారు.
Telangana Assembly: ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9.15 వరకు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ, అంశాల వారీగా అధికార పక్షానికి హరీష్ ప్రశ్నల వర్షం
VNSతెలంగాణ శాసనసభ (Telangana Assembly) సోమవారానికి వాయిదా పడింది. బడ్జెట్పై (Telanagana Budget) సాధారణ చర్చ ముగియగానే సభను ఈ నెల 29వ తేదీకి సభ వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ రాత్రి 9:15 గంటల వరకు కొనసాగింది.
EV Subsidy Extended: ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్, సబ్సిడీని మరోసారి పొడిగిస్తూ నిర్ణయం, ఎప్పటి వరకు అమల్లో ఉంటుందంటే?
VNSఫేమ్-2 (FAME-2) పథకం ముగిసిన తర్వాత తాత్కాలికంగా తీసుకొచ్చిన ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్’ (EMPS) 2024 ను పొడిగిస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈఎంపీఎస్ పథకం జూలై 31తో ముగియాల్సి ఉండగా మరో రెండు నెలలు అంటే సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.
Suzuki Motorcycle: మీ ఇంట్లో సుజుకీ స్కూటీ ఉందా? సుజుకీ బైక్ లో వైర్ ప్రాబ్లమ్, ఏకంగా 4 లక్షల వాహనాలు వెనక్కు
VNSప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ (Suzuki India) భారత్లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.
Flood At Bhadrachalam: ఒక్కసారిగా పెరిగిన గోదావరి ఉధృతి, భద్రాచలం వద్ద పరివాహక గ్రామాల్లో అప్రమత్తం, కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
VNSభద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం (Godavari Flood) అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది
ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలులో రికార్డుల మోత, నిన్నటి వరకు 5 కోట్లకు పైగా ఐటీఆర్ ఫైలింగ్స్
VNSగడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.
Hyderabad Bonalu 2024: హైదరాబాద్ బోనాలు, పూనకాలు లోడింగ్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వైన్స్ షాపులు బంద్
Arun Charagondaఈ నెల 28న హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్దమైంది. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండగా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు బంద్ చుశారు. ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్లో ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 30 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో ఆదివారం, సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు
Janasena: ఏపీలో వైసీపీ - టీడీపీలకు జనసేన పవన్ కళ్యాణే ప్రత్యామ్నాయమా?, వైసీపీని వీడుతున్న నేతలకు ఫస్ట్ ఛాయిస్ పవనేనా?, పెరుగుతున్న పవన్ గ్రాఫ్ ఏం చెబుతోంది!
Arun Charagondaఏపీలో వైసీపీ - టీడీపీ పార్టీలకు జనసేన ప్రత్యామ్నాయంగా ఎదిగే స్కోప్ వచ్చింది. వాస్తవానికి ఏపీలో కూటమి, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక పవన్ కు ఇంపార్టెన్స్ మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలతో ఎమ్మెల్యే కావాలన్న పవన్ కోరిక తీరడంతో పాటు రాజకీయంగాను పట్టు సాధించారు పవన్. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి...పవన్పై ప్రశంసలు గుప్పించడంతో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
Telangana Gurukul Jobs: గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థుల ఆందోళన, పోలీస్ స్టేషన్లో దీక్ష, భిక్ష మెత్తుకుంటున్న అభ్యర్థులు.. వీరల్ వీడియోలు
Arun Charagondaతెలంగాణ గురుకుల ఉద్యోగాల్లో న్యాయం చేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ బొరబండ పోలీస్ స్టేషన్లో కొంతమంది అభ్యర్థులను అరెస్ట్ చేయగా పోలీస్ స్టేషన్లోనే దీక్ష చేస్తున్నారు. ఇక అశోక్ నగర్ సర్కిల్లో బిక్షమెత్తుకుంటున్న నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు.
Andhrapradesh Shocker: యువతిపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య, గంజాయికి బానిసై దారుణానికి తెగబడ్డ భార్యభర్తలు!
Arun Charagondaఏపీలోని తిరుపతిలో దారునం చోటు చేసుకుంది. విద్యావంతులైన భార్యాభర్తలు గంజాయికి బానిసలై దారుణానికి ఒడిగట్టారు. తిరుపతి పద్మావతి వర్సిటీలో న్యాయవిద్య చదివిన యువతి, ప్రణవ కృష్ణ ఫ్రెండ్స్. ప్రణవ ఇంటికి యువతి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో ప్రణవ, ఆమె భర్త కిశోర్ యువతికి గంజాయి అలవాటు చేశారు.
Kaleshwaram Project: బిగ్ బ్రేకింగ్...కాళేశ్వరం ప్రాజెక్టు పంప్హౌస్లు ఆన్, నందిమేడారం,లక్ష్మీపూర్ నుండి నీటి ఎత్తిపోతలు ప్రారంభం
Arun Charagondaఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్లు ప్రారంభమయ్యాయి. ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతలు మొదలు పెట్టింది ప్రభుత్వం. ఆగస్టు రెండు వరకు కాళేశ్వరంలో పంప్హౌస్లను ఆన్ చేయాలని బీఆర్ఎస్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యంలో నందిమేడారం తో పాటు లక్ష్మి పూర్ లో పంప్స్ ఆన్ చేశారు అధికారులు.
Telangana Dogs attack: తెలంగాణలో మళ్లీ రెచ్చిపోయిన వీధి కుక్కలు, రాజన్న సిరిసిల్లలో వృద్ధుడిపై కుక్కల దాడి, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaతెలంగాణలో మరోసారి కుక్కల దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల - గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో లక్ష్మణ్ అనే వృద్ధుడిపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
KCR New Strategy: సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్? త్వరలో ఎన్నికలు రావడం ఖాయం? మళ్లీ అధికారం మనదేనని సంకేతాలు?
Arun Charagondaతెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ కేసీఆర్ది ప్రత్యేక శైలీ. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు సైలెంట్గా ఉంటారో ఎవరికి అర్థం కాని పరిస్థితి? కానీ ఆయన తీసుకునే వ్యూహాలు మాత్రం ఆ తర్వాత ఆలోచిస్తే దటీజ్ కేసీఆర్ అని అనిపించక తప్పదు.
Jammu Kashmir News: జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఓ జవాన్, పాక్ ఉగ్రవాది హతం
Arun Charagondaజమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లా కమ్కారీ సెక్టార్లో పాకిస్థాన్ 'బోర్డర్ యాక్షన్ టీమ్' జరిపిన దాడిని భారత సైన్యం శనివారం భగ్నం చేసింది. ఈ ఎన్కౌంటర్ లో ఓ సైనికుడు వీరమరణం చెందగా, కెప్టెన్తో సహా మరో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. పాకిస్థాన్ చొరబాటుదారుడు కూడా మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.