LAC Patrolling Pact: ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా చైనా-భారత్ మధ్య కీలక ఒప్పందం, సరిహద్దుల నుంచి వెనక్కి వస్తున్న భారత్-చైనా బలగాలు
భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరుదేశాల (India-China) మధ్య కీలక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.
New Delhi, Oct 25: భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇటీవల ఇరుదేశాల (India-China) మధ్య కీలక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) ప్రకారం సోమవారం అంగీకరించిన షెడ్యూల్ ప్రకారం, భారతదేశం, చైనా దళాలు బుధవారం తూర్పు లడఖ్లోని డెప్సాంగ్, డెమ్చోక్ వద్ద సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ (Disengagement of troops) తాజాగా మొదలైంది. తూర్పు లద్దాఖ్ (Ladakh) సెక్టార్లోని రెండు కీలకప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి రెండు దేశాల బలగాలు వెనక్కి మరలుతున్నట్లు భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
ఈ సంతకం తర్వాత మాత్రమే భారతదేశం యొక్క అగ్ర దౌత్యవేత్త, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తూర్పు లడఖ్లోని LAC వెంబడి రెండు వైపులా పెట్రోలింగ్ కోసం భారతదేశం మరియు చైనాలు ఒక ఏర్పాటుకు చేరుకున్నాయని ప్రకటించారు. ఇంతకుముందు బఫర్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో ఇప్పుడు పశువులను మేపడానికి గ్రాజియర్లను కూడా అనుమతించనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది సమన్వయ పద్ధతిలో జరుగుతుంది.
ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాంతంలోని సైనిక సామగ్రి, ఇతర పరికరాలను భారత బలగాలు వెనక్కి తీసుకొస్తున్నట్లు ఆ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరుదేశాల బలగాలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. చార్దింగ్ లా పాస్కు సమీపంలోని నదికి పశ్చిమదిశగా భారత బలగాలు, తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కివెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈప్రాంతాల్లో సరిహద్దులకు ఇరువైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బలగాల ఉపసంహరణ ప్రక్రియంతా పూర్తయిన తర్వాత మరో 4-5 రోజుల్లో డెస్పాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పునరుద్ధరించనున్నట్లు సమాచారం.
వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ పునఃప్రారంభంపై ఇరుదేశాల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం.. 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు నాటి యథాస్థితి ఎల్ఏసీ వెంబడి కొనసాగనుంది. ఇరుదేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఒప్పందాన్ని ఇరుదేశాల నేతలు మోదీ, జిన్పింగ్ ధ్రువీకరించారు.
2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. కానీ ఆ సంఖ్యను వెల్లడించలేదు. చాలా నెలల తర్వాత ఐదుగురు చనిపోయినట్లు అధికారికంగా అంగీకరించింది. ఈ ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాలు ఎల్ఏసీ వెంబడి భారీస్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆ తర్వాత ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరుదేశాల మధ్య పలుమార్లు దౌత్య, కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించగా.. ఘర్షణల కేంద్రమైన డెమ్చోక్, డెస్పాంగ్ వద్ద మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి.
(The above story first appeared on LatestLY on Oct 25, 2024 03:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

