Rana Daggubati: ఫ్యాన్స్‌ కి షాకిచ్చిన రానా.. కొన్నాళ్లు వాటన్నికిటికీ బ్రేక్ అంటూ సంచలన ప్రకటన.. ఏంటీ విషయం?
Rana (Image Credits: Twitter)

Hyderabad, August 6: ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి (Rana Daggubati) కొన్నాళ్ల పాటు సామాజిక మాధ్యమానికి  బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ (Twitter) ద్వారా షేర్‌ చేశారు. ‘పని జరుగుతోంది. సోషల్‌ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సినిమాలతో కలుద్దాం. బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌’ అంటూ ట్వీట్‌ చేసి అభిమానులకు షాకిచ్చాడు. అయితే, రానా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా,89డో తెలియాల్సి ఉంది.

స్విట్జర్లాండ్‌ వెకేషన్‌ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మహేష్..కొత్త మేకోవార్ లో హల్ చల్

ప్రస్తుతం ఈ దగ్గుబాటి హీరో.. దర్శకుడు గుణశేఖర్‌ (Gunashekar) తో ‘హిరణ్య కశ్యప’, దర్శకుడు మిలింద్‌ రావుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలి సిందే.  అలాగే ‘కోడిరామ్మూర్తి’ బయోపిక్ (Biopic), తేజ దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక వెంకటేశ్, రానా కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ త్వరలో నెట్‌ ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్‌ కానుంది.