Viral Video: మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చిన బాలుడు.. రోహిత్‌కు హగ్.. వీడియో ఇదిగో!
Credits: Video Grab

Raipur, Jan 22: న్యూజిలాండ్‌తో (New Zealand) రాయ్‌పూర్‌లో (Raipur)  జరిగిన రెండో వన్డేలో (Second One-Day) భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో మైదానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది కళ్లు గప్పిన ఓ బాలుడు వేగంగా మైదానంలోకి దూసుకెళ్లి క్రీజులో ఉన్న టీమిండియా (Team India) స్కిప్పర్ రోహిత్ శర్మను (Rohit Sharma) వాటేసుకున్నాడు.

భూ మండలంపై అత్యంత శక్తిమంతమైన నేత మోదీ.. బ్రిటన్ ఎంపీ లార్డ్ కరన్ బిలిమోరియా ప్రశంస (వీడియోతో)

ఈ అకస్మాత్తు పరిణామంతో అందరూ విస్తుపోయారు. ఆటకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే మైదానంలోకి పరిగెత్తి రోహిత్‌ను హగ్ చేసుకున్న బాలుడిని పట్టుకుని తీసుకెళ్లారు. అయితే, బాలుడిపై చర్యలు తీసుకోవద్దని రోహిత్ చెప్పడంతో వారు విడిచిపెట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబాటు.. ఎందుకొచ్చావ్ అన్న అధికారిణి? అతని సమాధానం ఏంటంటే?? జూబ్లీహిల్స్‌ లో కలకలం