ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela) మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల తాకిడి పెరిగింది. సామాన్య ప్రజలతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మహాకుంభమేళాకు తరలివెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif) ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అక్కడ గంగ , యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా స్వామి చిదానంద్‌ సరస్వతిని (Swami Chidanand Saraswati) కలిశారు.ఇక భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner) జ్ఞానేశ్‌ కుమార్‌ సైతం ప్రయాగ్‌రాజ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా త్రివేణీ సంగమంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.

త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, వీడియో ఇదిగో..

Katrina Kaif takes a holy dip in Triveni Sangam

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)