మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది(Viral Video). ఎలుకల ఆస్పత్రా లేకా మనుషుల ఆస్పత్రా అన్నదా తెలియనంతా ఎలుకలు వీరంగం సృష్టించాయి. ఆసుపత్రి వార్డులో పదుల సంఖ్యలో ఎలుకలు రోగి చుట్టూ వీరంగం సృష్టించగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో, ఆసుపత్రి వార్డులో పడుకున్న వ్యక్తి పక్కనే ఉన్న సంచిపై అనేక ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి( Madhya Pradesh). వీడియో చూసిన వారిని మరింత భయాందోళనకు గురి చేసింది.

వైరల్ వీడియో.. మద్యం మత్తులో రోడ్డు మధ్యలో కారు ఆపి మూత్ర విసర్జన, స్థానికుల ఆగ్రహం, వైరల్‌గా మారిన వీడియో 

వీడియో వైరల్ కావడంతో ప్రజలు ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నిర్వహణపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ఆసుపత్రులు కేవలం రోగులు తెచ్చిన ఆహారాన్ని ఎలుకలు ఆనందంగా తినేందుకు మాత్రమే ఉంటాయా?", దేశంలో అసలు ఏమి జరుగుతోంది? ఇది ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటున్నారా? ఇలా నిర్లక్ష్యంగా ఉండటాన్ని ఏమనాలని మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Horrifying Video Of Rats In Madhya Pradesh’s Hospital Ward Raises Hygiene Concerns

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)