ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మీడియా పోస్ట్లో "ఆపరేషన్ సిందూర్ ఆన్ ది గేమ్స్ ఫీల్డ్ అంటూ కేంద్ర సైనిక చర్యతో సరిపోల్చి, క్రికెటర్లు ప్రశంసించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది. అది సుమారు 1,07,000 రీట్వీట్లు, 25 మిలియన్లకు పైగా ఇంప్రెషన్లు పొందింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. క్రికెట్ కు, యుధ్దాన్ని ముడిపెట్టడం సరైనదేనా అని ప్రశ్నించాయి.
కాగా పాకిస్తాన్ తొలి పొజిషన్లో బాగా ఆడుతూ 113/1 వరకూ వెళ్లింది. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లు, ముఖ్యంగా కులదీప్ యాదవ్ నాలుగు వికెట్లు) అత్యుత్తమ బౌలింగ్ చేశారు. ఛేజ్లో భారత బ్యాటింగ్ ముందు తీవ్ర ఒత్తిడిని అనుభవించింది; అయితే తిలక్ వర్మ అజేయంగా 69 పరుగులు చేయడం ద్వారా భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. చివర మూడు బంతుల్లో అవసరమైన పరుగులు పూర్తి చేసి, మ్యాచ్ను రెండు బంతులు మిగిలి ఉండగానే ముగించింది. ఈ విజయం ద్వారా భారత్కు ఆసియా కప్ను 9వ సారి ముద్దాడింది.
PM Modi Tweet
#OperationSindoor on the games field.
Outcome is the same - India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)