ఏపీలోని ఏలూరులో నడిరోడ్డు మీద విద్యార్థులు రెండు గ్రూపులుగా ఏర్పడి తన్నుకున్నారు. పబ్జీ ఫ్రీ ఫైర్ గేములో వివాదం రావడంతో గుంపులుగా ఏర్పడిన విద్యార్థులు చితకబాదుకున్నారు. ఏపీలోని ఏలూరులో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు విద్యార్థులు పబ్జీ గేములో ఫ్రీ ఫైర్ ఆడే సమయంలో గొడవకు దిగినట్లు తెలిసింది.
ఆ వివాదం కాస్త ముదరడంతో ఏలూరులోని జిల్లా పరిషత్ పాఠశాల ఎదురుగా గల రోడ్డులో గుంపులుగా ఏర్పడిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులకు (Clashes between two groups of students) పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చిన త్రీటౌన్ పోలీసులు ఇళ్లకు పంపించారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Clashes between two groups of students in Eluru
ఏలూరులో విద్యార్థుల మధ్య ఘర్షణ.
జిల్లా పరిషత్ ఎదురు రోడ్లో గుంపులుగా ఒకరిపైఒకరు దాడి.
ఫ్రీ ఫైర్ గేమ్ వివాదంలో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదం.
సంఘటన స్థలానికి చేరుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిన త్రీటౌన్ పోలీసులు. #AndhraPradesh #eluru #students #fight… pic.twitter.com/m8cTy2qpBw
— RTV (@RTVnewsnetwork) February 19, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)