Telangana Shocker: వీడియో ఇదిగో, అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్, వారికే షాక్ కొట్టడంతో కుటుంబం మొత్తం మృతి

తెలంగాలోని నిజామాబాద్ జిల్లాలో గల బోధన్‌ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలంలో కరెంట్‌ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది.

Telangana Shocker: వీడియో ఇదిగో, అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్, వారికే షాక్ కొట్టడంతో కుటుంబం మొత్తం మృతి
Death ( Representative image -ANI)

తెలంగాలోని నిజామాబాద్ జిల్లాలో గల బోధన్‌ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలంలో కరెంట్‌ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లాలోని షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది.

చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. కరెంట్ తీగలు పెడుతున్న టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులకు కరెంట్ షాక్ తగిలింది. ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.

Three of a family electrocuted to death in Nizamabad

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 21, 2025 01:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).