Sports

Paris Olympics 2024: వీడియో ఇదిగో, అమ్మా..నేను బంగారు పతకంతో తిరిగివస్తా, తల్లికి మాట ఇచ్చిన భారత స్టార్ మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌

Hazarath Reddy

స్వర్ణ పతకమే లక్ష్యంగా వినేశ్‌ బరిలోకి దిగుతోంది. గోల్డ్ మెడల్ తీసుకువస్తా అని వినేశ్‌ తన తల్లికి మాట ఇచ్చింది. సెమీస్‌ విజయం తర్వాత వినేష్ వీడియో కాల్‌లో తన తల్లితో మాట్లాడారు. ఈ సమయంలో వినేష్ తన కుటుంబ సభ్యులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. భావోద్వేగానికి గురైంది.

Paris Olympics 2024: గతేదాడి జరిగిన అవమానాన్ని పంటికింద బిగపట్టి దేశం కోసం అద్భుత ప్రదర్శన, పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాన్ని ఖాయం చేసిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌

Hazarath Reddy

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ అద్భుత ప్రదర్శనతో పారిస్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గతేడాది దేశ ఆమె అనుభవించిన తన బాధనంతా పంటికింద బిగపట్టి విశ్వక్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది

Paris Olympics 2024: రెండు పతకాలతో పారిస్ నుంచి భారత్‌లో అడుగుపెట్టిన షూటర్ మను బాకర్‌, ఢిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో ఇదిగో..

Hazarath Reddy

పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024)లో సంచలనం సృష్టించిన షూటర్‌ (shooter) మను బాకర్‌ (Manu Bhaker) భారత్‌ చేరుకున్నారు. ఇవాళ ఉదయం కోచ్‌ జస్పాల్‌ రాణా (Jaspal Rana)తో కలిసి దేశరాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో (Delhi airport) ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా షూటర్‌కు ఘన స్వాగతం లభించింది.

Anthony Ammirati: వీడియో ఇదిగో, పురుషాంగం కర్రకు తాకడంతో హైజంప్‌లో ఫెయిల్, ఒలింపిక్ గేమ్స్‌లో ఫైనల్ నుంచి నిష్క్రమించిన పోల్ వాల్ట్ ఆటగాడు ఆంథోనీ అమిరాతి

Hazarath Reddy

పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్‌లో హైజంప్‌లో గెలిచే అవకాశాన్ని ఫ్రెంచ్ ఆటగాడు కోల్పోయిన సంఘటన జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ అమిరాతి అనే క్రీడాకారుడు హైజంప్ పోటీల్లో పాల్గొన్నాడు. హైజంప్ చేస్తుండగా అతని పురుషాంగం అడ్డంగా ఉన్న స్తంభానికి తగలడంతో అతను కిందపడిపోయాడు

Advertisement

Neeraj Chopra 89.34 M Throw Video: నీరజ్‌ చోప్రా జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరిన వీడియో ఇదిగో, ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత స్టార్

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌ (గ్రూప్‌ బి)లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

Graham Thorpe Dies: తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాహం థోర్ప్‌ కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన ఇంగ్లండ్‌ ఆటగాళ్లు

Vikas M

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ గ్రాహం థోర్ప్‌ (55) కన్నుమూశారు. గత రెండేండ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న థోర్ప్‌ సోమవారం తుదిశ్వాస విడిచినట్టు ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తెలిపింది. 1993 నుంచి 2005 వరకు ఇంగ్లండ్‌ తరఫున ఆడిన థోర్ప్‌.. వంద టెస్టులు, 82 వన్డేలలో ప్రాతినిథ్యం వహించాడు.

Bangladesh Unrest: బంగ్లాదేశ్ నిరసనలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్‌ వేదిక మారనున్నట్లు వార్తలు, భారత్ లేదా UAE లేదా శ్రీలంకకు ఐసీసీ తరలిస్తుందా?

Vikas M

బంగ్లాదేశ్‌లో చెల‌రేగుతున్న హింస ప్ర‌పంచ క్రికెట్‌పై ప‌డ‌నుంది. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా (Shaikh Hasina) రాజీనామాతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌లో మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గాల్సిన‌ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ (T20 World Cup 2024)పై అనిశ్చితి నెల‌కొంది.

Vinod Kambli Viral Video: ఓ సచిన్.. నీ స్నేహితుడిని చూశావా, నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ వీడియో వైరల్, సాయం చేయాలంటూ టెండూల్కర్‌కి ట్యాగ్ చేస్తున్న అభిమానులు

Vikas M

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్‌ర్ చిన్ననాటి స్నేహితుడు, 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్‌గా వెలుగొందిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు.

Advertisement

Paris Olympics 2024 Live Updates: కాంస్య పతక రేసులో అనంత్ జీత్ సింగ్ - మహేశ్వరి చౌహాన్, ఒలింపిక్స్‌లో మరో పతకం దిశగా భారత్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తొంది. షూటింగ్ విభాగంలో మిక్స్‌ డ్ టీమ్ ఈవెంట్‌లో ఆనంత్ జీత్ సింగ్ సింగ్ , మహేశ్వరి చౌహాన్ కాంస్య పతక రేసులో నిలిచారు. తొలి రౌండ్‌లో అనంత్ జీత్ సింగ్ నరుకా 25/25తో స్కోర్ చేయగా, మహేశ్వరి చౌహాన్ 24/25తో భారత్ స్కోరు 49కి పాయింట్లు సాధించారు.

Novak Djokovic Wins Olympic Gold: ఒలింపిక్స్ లో క‌ల సాకారం చేసుకున్న జొకోవిచ్, తొలిసారి గోల్డ్ మెడ‌ల్ సాధించిన జొకోవిచ్

VNS

మాజీ వ‌రల్డ్ నంబ‌ర్ 1 నొవాక్ జ‌కోవిచ్ (Novak Djokovic) త‌న‌ క‌ల సాకారం చేసుకున్నాడు. విశ్వ క్రీడ‌ల్లో ఏండ్లుగా ఊరిస్తున్న బంగారు ప‌త‌కాన్ని Gold) కొల్ల‌గొట్టాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చ‌రిత్ర సృష్టించిన జ‌కో ఎట్ట‌కేల‌కు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ ప‌ట్టేశాడు.

Paris Olympics: క్వార్టర్‌ ఫైనల్స్‌లో దీపికా కుమారి ఓటమి,ఆర్చరీ ఈవెంట్‌లో సెమీస్ ఛాన్స్ మిస్‌

Arun Charagonda

పారిస్‌ ఒలింపిక్స్‌ ఆర్చరీ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపికా కుమారి సెమీస్ ఛాన్స్ మిస్ చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్స్‌ లో దక్షిణ కొరియాకు చెందిన నమ్ సుహేయున్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒలింపిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మిస్ చేసుకుంది.

Paris Olympics: మను బాకర్ హ్యాట్రిక్ మెడల్ మిస్, 25మీ పిస్తోల్ ఈవెంట్‌లో నాలుగో స్థానం, రెండు కాంస్యాలతో బాకర్ రికార్డు

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకుంది భారత షూటర్ మనూ భాకర్. 25మీట‌ర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య ప‌త‌కాన్ని చేజార్చుకుంది. మ‌నూ, హంగేరియ‌న్ షూట‌ర్ మ‌ధ్య ఎలిమినేష‌న్ రౌండ్ జ‌రుగగా హ్యాట్రిక్‌తో చ‌రిత్ర సృష్టించే అవ‌కాశాన్ని మ‌నూ తృటిలో మిస్సైంది.

Advertisement

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో కొన‌సాగుతున్న హాకీ జ‌ట్టు జైత్ర‌యాత్ర‌, చివ‌రి గ్రూప్ మ్యాచ్ లోనూ విజ‌యం సాధించిన టీమ్ ఇండియా

VNS

పారిస్ ఒలింపిక్స్‌ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత హాకీ (Indian Men's Hockey Team) జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 3-2 తేడాతో విజయ ఢంకా మోగించింది. 1972 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ (India) ఓడించడం ఇదే మొదటిసారి. పూల్‌ బీ నుంచి భారత్‌తో పాటు బెల్జియం, ఆసీస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో మ‌రో ప‌త‌కం దిశ‌గా భార‌త్, ఆర్చ‌రీలో సెమీస్ కు దూసుకెళ్లిన ధీర‌జ్, అంకిత జోడీ

VNS

హోరాహోరీగా సాగిన నాలుగు సెట్ల పోరులో స్పెయిన్ జంట‌పై ధీర‌జ్, అంకిత ద్వ‌యం 37-36తో గెలుపొందింది. చివ‌రి సెట్‌లో చివ‌రి సెట్‌లో ధీర‌జ్ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తూ వ‌రుస‌గా 10, 10 పాయింట్లు సాధించాడు. అంకిత సైతం వ‌రుస‌గా 9, 8 పాయింట్లతో మెరిసింది.

PV Sindhu: ఒలింపిక్స్ ఓటమిపై పీవీ సింధు, ఆ తప్పు వల్లే ఓడిపోయా,వచ్చే ఒలింపిక్స్‌లో ఆడతానా లేదా అన్నదానిపై సింధు కామెంట్స్

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్స్‌లో చైనీస్ ప్రపంచ నంబర్ 9 బింగ్ జాబో రన్ చేతిలో వరుస సెట్లు 21-19,21-14 తేడాతో ఓటమి పాలైంది. 56 నిమిషాల పాటు ఈ గేమ్ సాగగా వరుస గేముల్లో ఓటమి పాలై ఒలింపిక్స్ నుండి నిష్క్రమించింది

Swapnil Kusale Wins Bronze Medal: ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం, పురుషుల 50 మీటర్ల రైఫిల్‌లో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ స్వప్నిల్ కుసాలే

Hazarath Reddy

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.ఫైనల్లో 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుపొందారు

Advertisement

Anshuman Gaekwad: క్యాన్సర్‌తో పోరాడి ఓడిన టీమిండియా లెజెండరీ అన్షుమాన్ గైక్వాడ్,ఆటగాడిగా,కోచ్‌గా,సెలక్టర్‌గా రికార్డ్స్ ఇవే

Arun Charagonda

భారత లెజండరీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ ఇకలేరు. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన గైక్వాడ్ బుధవారం అర్థరాత్రి మృతి చెందాడు. ఆయన వయస్సు 71. గైక్వాడ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

India Vs Sri Lanka ODI Series: భార‌త్-శ్రీ‌లంక వ‌న్డే సిరీస్ ను ఇలా ఉచితంగా చూసేయండి! జియో సినిమాలో కాదు..ఇక్క‌డ ఉచితంగా స్ట్రీమింగ్, ఇంత‌కీ సిరీస్ ఎప్ప‌టి నుంచి అంటే?

VNS

శ్రీలంక‌తో జ‌రిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను టీమ్ఇండియా (Team India) క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి ఆగ‌స్టు 2 నుంచి ప్రారంభం కానున్న వ‌న్డే సిరీస్ పై ప‌డింది. టీ20 సిరీస్ ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా వ‌న్డే సిరీస్‌కు (IND Vs SL ODI sreies) సిద్ధం అవుతోంది.

Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు జైత్రయాత్ర, ప్రీ క్వార్టర్స్‌ లోకి దూసుకెళ్లిన సింధు

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండ‌వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్ట‌ర్స్‌లో ప్రవేశించగా ఈ మ్యాచ్‌లో ఆర‌వ సీడ్ హీ బిన్‌జావో తో త‌ల‌ప‌డ‌నుంది సింధు.

Rinku Singh Bowling: రింకూ సింగ్ గేమ్ ఛేంజర్, వీడియో ఇదిగో..అద్భుత బౌలింగ్‌,వావ్ అనకుండా ఉండలేరు!

Arun Charagonda

శ్రీలంకతో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక 12 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా అనూహ్యంగా మ్యాచ్ టైగా ముగిసింది. 19వ ఓవర్‌లో ఎవరూ ఉహించని విధంగా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు బాల్ అప్పగించాడు కెప్టెన్ సూర్య.

Advertisement
Advertisement