Cricket

Lalit Modi – Sushmita Sen Dating: డేటింగ్‌లో లలిత్ మోడీ .. మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్‌తో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఐపీఎల్ మాజీ ఛైర్మెన్

Hazarath Reddy

మాల్దీవుల పర్యటన ముగించుకుని ఇప్పుడే లండన్ చేరుకున్నామని, తన బెటర్ లుకింగ్ పార్ట్‌నర్ సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననంటూ లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్‌లో తమకు ఇంకా వివాహం కాలేదని, కానీ త్వరలోనే చేసుకుంటామంటూ ట్వీట్ చేశాడు

Lalit Modi Dating: లేటు వయసులో ఘాటు ప్రేమ, బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో డేటింగ్‌లో లలిత్ మోడీ, త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నట్లు వెల్లడి

Hazarath Reddy

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌కు మొదటి ఛైర్మన్ మరియు కమిషనర్‌గా ఉన్న మోడీ, నటితో డేటింగ్ లో ఉన్నట్లు ట్వీట్ లో తెలిపారు. నా బెటర్ హాఫ్ తో కొత్త జీవితం ప్రారంభమవుతుందని తెలిపారు. సుస్మితా సేన్‌తో కలిసి నా కొత్త జీవితం ప్రారంభించానని తెలిపారు.

IND vs WI 2022: టీ20ల నుంచి విరాట్ కోహ్లీ అవుట్, వెస్టిండీస్‌తో జ‌రిగే సీరిస్‌కు టీంను ప్రకటించిన బీసీసీఐ, రోహిత్‌కే భారత క్రికెట్ పగ్గాలు

Hazarath Reddy

వెస్టిండీస్ సీరిస్లో‌ విరాట్ కోహ్లీకి సెలెక్ట‌ర్లు మొండిచేయి చూపారు. వెస్టిండీస్‌తో జ‌రిగే అయిదు టీ20ల‌కు కోహ్లీని ఎంపిక చేయ‌లేదు. విండీస్‌తో సిరీస్‌కు రోహిత్‌కే ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. స‌ర్జ‌రీతో క్రికెట్‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్‌ను టీ20ల‌కు ఎంపిక చేశారు. కానీ చివ‌ర వ‌ర‌కు రాహుల్ ఆడేది లేనిది డౌటే.

India Edge Pakistan: పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టిన భారత్, మూడు ఫార్మాట్లలో టాప్‌-3లో ఉన్న ఏకైక జట్టుగా అవతరణ, ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం

Hazarath Reddy

తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను చిత్తు చేయడం ద్వారా టీమిండియా ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో పాటు దాయాది పాక్‌కు కూడా షాకిచ్చింది.

Advertisement

Rohit Sharma: వైరల్ వీడియో.. చిన్న పాపకు బలంగా తగిలిన రోహిత్‌ శర్మ సిక్సర్‌ కొట్టిన బంతి, నొప్పితో విలవిలలాడిన చిన్నారి, ప్రథమ చికిత్స అందించడంతో కోలుకున్న పాప

Hazarath Reddy

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి వన్డే సందర్భంగా తండ్రితో పాటు స్టేడియంకు వచ్చిన ఓ చిన్నారి రోహిత్‌ శర్మ సిక్సర్‌ కొట్టిన బంతి తగిలి నొప్పితో విలవిలలాడింది.

Suryakumar Yadav: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ము లేపిన సూర్యకుమార్‌ యాదవ్, ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 5వ స్థానంలోకి, సూర్య మినహా టాప్‌-10లో చోటు దక్కించుకోని భారత బ్యాటర్లు

Hazarath Reddy

ఐసీసీ టీ20 క్రికెట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుయార్‌ యాదవ్‌ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. మొత్తంగా 732 పాయింట్లు సాధించిన సూర్య.. కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు.

Saif Ali Khan: వెస్టిండీస్‌ దిగ్గజంతో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మిస్టర్‌ కూల్‌ ధోనితో దిగిన ఫోటోలు వైరల్

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ కూల్‌ ధోని, వెస్టిండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌తో కలిసి బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Jasprit Bumrah: వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా, టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయిన ఇతర భారత్ ఆటగాళ్లు

Hazarath Reddy

ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు.

Advertisement

Shoaib Akhtar: భారత్ మీద ఈ సారి గెలుపు అంత ఈజీ కాదు, పాకిస్తాన్ టీంకు వార్నింగ్ ఇచ్చిన షోయబ్ అక్తర్, ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని వెల్లడి

Hazarath Reddy

పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైన సంగతి విదితమే.

India vs England, 2nd T20I Highlights: రెండో టీ-20లో దుమ్మురేపిన టీమిండియా, ఇంగ్లండ్‌తో సిరీస్ స్వాధీనం, అరుదైన రికార్డు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ, మ్యాజిక్ చేసిన భువనేశ్వర్ కుమార్

Naresh. VNS

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ-20లో టీమిండియాలో దుమ్మురేపింది. మూడు టీ-20ల సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్ కూడా గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్ భారత్ (India)వశమైంది. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం (India Won)సాధించింది.

Kamran Akmal: పాక్ మాజీ క్రికెటర్ ఇంట్లో మేక దొంగతనం, బక్రీద్ కోసం తెచ్చిన మేకను ఎత్తుకెళ్లిన దొంగలు, మంచి దిట్టమైన మేకను చూసి దొంగిలించిన దుండగులు, పోలీసులకు క్రికెటర్ తండ్రి ఫిర్యాదు

Naresh. VNS

బక్రీద్ (Bakri Eid)కోసం ఆరు మేకలను(Goats) తెచ్చిన కమ్రాన్ అక్మల్ ఫ్యామిలీ...వాటిని ఆరుబయట కట్టేసింది. అయితే అందులో నుంచి ఒకమేకను దొంగలు కొట్టేసినట్లు(Goat stolen) కుటుంబ సభ్యులు గుర్తించారు. దొంగతనానికి గురైన మేక ఖరీదు దాదాపు 35వేల వరకు ఉంటుందని కమ్రాన్ అక్మల్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

IND vs ENG, 5th Test: భారత క్రికెట్ అభిమానులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ అభిమానులు, ట్విట్ట‌ర్‌లో ఫోటోలు, వీడియోలు వైర‌ల్, స్పందించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు

Hazarath Reddy

Edgbastonలో భారత్ - ఇంగ్లండ్‌ మధ్య జరిగిన అయిదోవ టెస్టు నాలుగ‌వ రోజున బ‌ర్మింగ్‌హామ్‌లో భార‌తీయ క్రికెట్ అభిమానులపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ జాత్యాంహ‌కార వ్యాఖ్య‌లు చేశారు. ఇండియ‌న్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ వాళ్లు ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి.

Advertisement

IND vs ENG 2022: ముందు నోర్ముయ్, నువ్వు బ్యాటింగ్ చేయ్, నన్ను అంపైరింగ్‌ చేసుకోనివ్వు, ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌‌పై మండిపడిన అంపైర్

Hazarath Reddy

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను టీమిండియా బౌలర్లు మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్ తమ షార్ట్‌ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్‌ అంపైర్‌కు పదేపదే ఫిర్యాదు చేశాడు.

IND vs ENG, 5th Test 2022: చేతులెత్తేసిన బౌలర్లు, 5వ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం, 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం, టెస్టు సిరీస్‌ 2-2తో సమం

Hazarath Reddy

ఎడ్డ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో (IND vs ENG, 5th Test 2022) ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-2తో సమం చేసింది.

Babar Azam: కోహ్లీ రికార్డు బ్రేక్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బిల్డప్ వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఐసీసీ పురుషుల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవలి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టకున్న బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Ind vs Eng, 5th Test: టెస్టుల్లో బుమ్రా వరల్డ్ రికార్డ్, ఒక్క ఓవర్‌ లో 34 రన్స్ రాబట్టిన బుమ్రా, సంచలన బ్యాటింగ్‌ తో తుడుచుకుపోయిన పాత రికార్డులు, బుమ్రాపై మాజీ ప్రశంసల జల్లు

Naresh. VNS

బుమ్రా (Bumrah) (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్‌ (Stuart Broad ) వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో (4, 5 వైడ్లు, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

IND vs ENG 5th Test: టీం ఇండియా కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా, కరోనా నుంచి ఇంకా కోలుకోని రోహిత్‌ శర్మ, నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌

Hazarath Reddy

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా నేటి నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో జస్ప్రీత్‌ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.

India vs England: తొలి మ్యాచ్‌‌కు సీనియర్లు కోహ్లి, రిషభ్ పంత్, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ అవుట్, ఇంగ్లండ్‌తో టీ20 వన్డే సీరిస్‌కి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు (India vs England) ముగిసిన తర్వాత ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు గాను బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. అయితే ఈ టీ20 సిరీస్ కు జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Eoin Morgan Retires: గాయాలతో సావాసం..క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, 2019 ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషించిన మోర్గాన్

Hazarath Reddy

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.గత కొంతం కాలంగా గాయాలతో సహవాసం చేస్తున్న మోర్గాన్‌.. ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.

IND vs IRE 2nd T20I 2022: టెన్సన్ పెట్టిన పసికూన, ఐర్లాండ్‌తో రెండో టి20లో 4 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు, 2–0తో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా

Hazarath Reddy

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది.

Advertisement
Advertisement