రాష్ట్రీయం

Nalgonda Road Accident: నల్గొండ జిల్లాలో కారు బీభత్సం, ఇంటి మీదకి దూసుకెళ్లడంతో ఒకరికి గాయాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నల్గొండ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. ఏకంగా ఇంటి మీదకి దూసుకెళ్లింది. మర్రిగూడ మండలం భట్లపల్లి గ్రామంలో అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Elections 2024: వైసీపీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, రాధా-రంగా మిత్రమండలి సభ్యులు షేక్‌ బాబు, ఇమ్రాన్‌ రజా, పి.నరేంద్ర, నాగశ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Andhra Pradesh Elections 2024: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు భారీ షాక్, జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కీలక నేత మాకినీడి శేషు కుమారి

Hazarath Reddy

కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషకుమారి వైఎస్సార్‌సీపీలో చేరారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆమె వైఎస్సార్‌సీపీలో చేరారు.

Telangana: భూమి సమస్య తీర్చడం లేదంటూ ఎమ్మార్వోపై పెట్రోల్ పోసిన మహిళా రైతులు, అనంతరం ఆత్మహత్యాయత్నం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన

Hazarath Reddy

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ ఎమ్మార్వో కార్యాలయంలో తమ భూమి సమస్యను తీర్చలేదంటూ నలుగురు మహిళలు బాటిల్లో పెట్రోల్ తీసుకువచ్చి తహశీల్ధార్ పై పోసి ఆత్మహత్యానికి పాల్పడిన బాధితులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తహశీల్ధార్ జ్యోతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Advertisement

Heartwarming Video: పోలియోతో కాళ్లు పూర్తిగా పడిపోయిన కొడుకుని చేతులతో మోస్తూ పదో తరగతి పరీక్షలకు తీసుకువచ్చిన తల్లి, నెటిజన్ల మనసు గెలుచుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

నిర్మల్ - చించోలి(బి)కి చెందిన చరణ్‌కు పోలియోతో కాళ్లు పూర్తిగా పడిపోయాయి.. పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోతే తల్లి పద్మ బీడీలు చుడుతూ చరణ్ బాగోగులు చూస్తోంది. చరణ్ పదో తరగతి కావడంతో తల్లి రోజు పరీక్ష కేంద్రానికి చేతులపై మోస్తూ ఆటో ఎక్కించి తీసుకొచ్చి పరీక్షలు రాయిస్తోంది.

Andhra Pradesh Shocker: అక్రమ సంబంధాన్ని ప్రశ్నించినందుకు కన్నతండ్రిని ప్రియుడు చేత దారుణంగా చంపించిన కూతురు, అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు కన్నతండ్రిని ఓ కసాయి కూతురు తన ప్రియుడు చేత (Andhra Pradesh Murder) చంపించింది.

Hyderabad Shocker: ఇంట్లో ప్రియుడితో కూతురిని చూసిన తల్లి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూస్తూ కుమార్తెకు ఉరివేసి చంపిన తల్లి, ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు

Hazarath Reddy

ఇబ్రహీంపట్నం దండుమైలారంలో ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసిన సంగతి విదితమే. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. తాజాగా యువతి అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు ఎట్టకేలకు పరువు హత్యగా (19-Year-Old Girl Strangled to Death by Mother ) తేల్చారు.

Theft Caught on Camera: అడిషనల్ కలెక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు, ముసుగేసుకుని ఇంట్లోకి పోతున్నప్పుడు కెమెరాకు చిక్కిన అగంతకులు

Hazarath Reddy

భూపాలపల్లి - ఏటూరునాగారం మండల కేంద్రంలో నివాసముంటున్న ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూదన్ ఇంట్లో దొంగలు పడి చోరీ చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, తెలంగాణలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తిని వెంబడించిన గ్రామస్థులు, గెస్ట్ హౌస్‌లో దాక్కోవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

మోత్కూరు మండలం అనాజిపురంలో ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చాడంటూ అతన్ని గ్రామస్థులు వెంబడించారు. గ్రామస్థుల నుంచి పరారైన దొంగ ఓ గెస్ట్ హౌస్‌లో దాక్కున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అతన్ని పట్టుకుని విచారిస్తున్నారు.

Earth Hour 2024: మార్చి 23న హైదరాబాద్‌లో ఈ ఐకానిక్ ప్రదేశాల్లో దీపాల వెలుగులు ఉండవు, ఎర్త్ అవర్ సందర్భంగా చీకటిలోకి జారుకోనున్న ప్రఖ్యాత కట్టడాలు

Hazarath Reddy

ఎర్త్ అవర్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF)చే నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. ఈ సంవత్సరం మార్చి 23న రాత్రి 8:30 గంటల నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ను పాటించనున్నారు.

Animal Cruelty in Telangana: తన పెంపుడు కుక్కను కరిచి చంపేసాయనే కోపంతో 20 వీధి కుక్కలను కాల్చి చంపిన దాని యజమాని, ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో జంతు హింస కేసు వెలుగులోకి వచ్చింది. తన పెంపుడు కుక్కను కరిచి చంపాయనే కోపంతో దాని యజమాని 20 వీధి కుక్కలను కాల్చి చంపాడు.ఫిబ్రవరి 16న మహబూబ్‌నగర్ జిల్లాలోని పొన్నకల్ గ్రామంలో వీధికుక్కలను ప్రతీకారంగా చంపినందుకు హైదరాబాద్‌కు చెందిన షూటర్‌తో సహా ముగ్గురిని అడ్డకల్ పోలీసులు అరెస్టు చేశారు.

Andhra Pradesh Elections 2024: నేను జనసేనలోకి రావడం కాదు నువ్వే వైసీపీలోకి రా పవన్, జనసేనాని వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత

Hazarath Reddy

నేను కూడా పవన్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?’’ అని అన్నారు.2009 కంటే ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్నా. 2009లో చిరంజీవి నాకు అవకాశం ఇచ్చారు. పిఠాపురంలో గెలుపుపై పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు. నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు నాకే ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలంటూ పురుగుమందు తాగిన టీడీపీ నేత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది, వైసీపీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా తెలుగుదేశం పార్టీ ఇంకా కొన్ని స్థానాలను పెండింగ్ లో ఉంచింది. తాజాగా రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్ చదలవాడ అరవిందబాబుకి ఇవ్వాలని తన ఇంట్లోనే విలేకరుల సమావేశంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు

Small Savings Schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఏమేమి ఉన్నాయి, ప్రస్తుతం ఆ పథకాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ పథకంలో చేరితే ప్రయోజనకరం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకుల వడ్డీరేట్ల సమాచారం ఇక్కడ తెలుసుకోండి

Vikas M

Distraught Farmer in Telangana: ఎండిన 5 ఎకరాల పంట మధ్యలో పడుకుని రైతు కన్నీటి వేదన, ఆత్మహత్య చేసుకోవడమే మిగిలిందంటూ..వీడియో ఇదిగో

Hazarath Reddy

సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో రైతు ఆవేదన చెందుతూ పొలంలో పంటను తడిమి చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Religious Harmony in Telangana: ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ ఆలయ‌ పూజారి, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం

Hazarath Reddy

చిలుకూరులో వెల్లివిరిసిన మత సామరస్యం వెల్లివిరిసింది. చిలుకూరు బాలాజీ గుడి‌ అర్చకుడు ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చారు. చిల్కూరు గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ వ్యవసాయం చేసుకుంటుండగా కరెంట్‌ షాక్‌తో ఎద్దును కోల్పోవడంతో గౌస్‌కు చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఎద్దును బహుమతిగా ఇచ్చారు.

Advertisement

Accident Caught on Camera: బస్సును ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన లారీని గుద్దిన బైకర్, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి, షాకింగ్ సీసీపుటేజీ వైరల్

Hazarath Reddy

ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడున్న సీసీ కెమెరాలో ఈ ప్రమాద ఘటన రికార్డు అయింది. వీడియోలో ఓ వ్యక్తి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం లారీ ఢీకొట్టింది.

Andhra Pradesh Elections 2024: జగన్ అంటే భయం కాబట్టే ఆ ఇద్దరూ ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకుంటున్నారు, చంద్రబాబు,పవన్ కళ్యాణ్ మీద రాపాక సెటైర్లు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామచంద్రాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నన్ను సీఎం జగన్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు.

Telangana: రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన పోలీస్ కానిస్టేబుల్, వాహనం వదిలివేసేందుకు డబ్బులు డిమాండ్

Hazarath Reddy

లంచం తీసుకుంటుండగా అవినీతి పోలీస్ అధికారిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మెదక్ రూరల్ పిఎస్‌కి చెందిన సురేందర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అదుపులోకి తీసుకున్న వాహనాన్ని అప్పగించడానికి రూ. 4000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక బ్యూరో (ACB) పట్టుకుంది.

Telangana Shocker:ఎండాకాలం క‌దా అని ఐస్ క్రీం తింటున్నారా? ఈ వీడియో చూస్తే వాటి జోలికే వెళ్ల‌రు, ఐస్ క్రీమ్ లో వీర్యం, మూత్రం క‌లుపుతున్న వ్య‌క్తి, సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్, అరెస్టు చేసిన పోలీసులు

VNS

ఎస్సై మహేందర్‌ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురాం పుర్బియాను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరంగల్‌ జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ చేపూరి కృష్ణమూర్తి ఐస్‌క్రీమ్‌ బండికి సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. పంచాయతీ కార్యదర్శి సదానందంతో కలిసి ఐస్‌క్రీమ్‌ బండిలోని ఐటమ్స్‌ను బయట పారబోయించారు.

Advertisement
Advertisement