రాష్ట్రీయం

CM Revanth Reddy Slams KCR: కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం బలైపోయింది, కాలు విరిగిందని తప్పించుకున్నా వదిలిపెట్టేది లేదు, మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనలో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

రూ. 95 వేల కోట్లను ఖర్చు చేస్తే... 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM Revanth Reddy Slams KCR) ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలంగాణ సీఎం అన్నారు.

Nalgonda BRS Public Meeting: పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు, నల్గొండ సభలో ధ్వజమెత్తిన కేసీఆర్, తెలంగాణ కోసం ఎందాకైనా వెళతానని స్పష్టం

Hazarath Reddy

కేసీఆర్ మాట్లాడుతూ..ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు.కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం (I will not allow injustice to Telangana) వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. చ‌లో న‌ల్ల‌గొండ స‌భ రాజ‌కీయ స‌భ కానేకాదు.. ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.

Nalgonda BRS Meeting: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి, నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్‌ గోబ్యాక్‌’ అంటూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నినాదాలు

Hazarath Reddy

కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది.

Car Accident Video: కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, డ్రైవర్ రోడ్డు మధ్యలో సడన్‌గా కారు డోర్ తీయడంతో..

Hazarath Reddy

అందరూ వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పారు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గమనించి డోర్ తీయాలని అన్నారు.

Advertisement

Roja Playing Kabaddi Video: వీడియో ఇదిగో, ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అంటూ కూతపెట్టి కబడ్డీ ఆడిన రోజా

Hazarath Reddy

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఆడుదాం ఆంధ్రా కబడ్డీ పోటీల సందర్భంగా మరోసారి జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కబడ్డీ బరిలో దిగిన మంత్రి రోజా... "కబడ్డీ, కబడ్డీ" అని కూత పెట్టేందుకు బదులుగా "ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024)... జగనన్న వన్స్ మోర్" అంటూ కూత పెట్టారు.

YV Subba Reddy on Capital: విశాఖ రాజధాని అయ్యేవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

రాష్ట్ర రాజధాని మీద వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడా గడువు కూడా పూర్తి కావొస్తోంది. రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు.

T-Congress to Visit Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పర్యటనకు సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలు దేరారు. అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ను నేతలు సందర్శించనున్నారు

Drunk Man Attacked Cop: మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ గొంతు పట్టుకొని దాడి చేసిన మందుబాబు, అసభ్య పదజాలంతో దూషిస్తూ హల్‌చల్

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. రాంగ్‌రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజుపై మందులో ఉన్న రోహిత్ (25) దాడి చేశాడు. ఈ ఘటన అంబర్‌పేట్‌ అలీ కేఫ్‌ సమీపంలో జరిగింది. కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు

Advertisement

Fratricide in Telangana: షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో, అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు, ఆస్తి వివాదాలే కారణమని తేల్చిన పోలీసులు

Hazarath Reddy

ఆస్తి తగాదాల కారణంగా సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి తన సోదరుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన (Man Pours Petrol on Brother) సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. సమీపంలోని దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ దారుణమైన చర్య (Fratricide in Telangana) బంధించబడింది. ఫుటేజీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయబడింది.

Telangana Shocker: హాస్టల్లో విగతజీవిగా కనిపించిన ఇంటర్‌ విద్యార్థిని, ప్రిన్సిపల్ మా కూతురును హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపణ

Hazarath Reddy

సూర్యాపేట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది.

Visakhapatnam: మృతదేహంతో గంగవరం పోర్టు వద్ద గ్రామస్తులు నిరసన, మృతుని కుటుంబానికి యాజమాన్యం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్

Hazarath Reddy

కడుపునొప్పితో మృతి చెందినట్లు ఆరోపిస్తూ ఓ కార్మికుని గ్రామస్తులు, బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి మృతదేహంతో గంగవరం పోర్టు గేటు ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడు అప్పారావుగా గుర్తించారు. ఓరియన్‌ ఓర్‌, బొగ్గు రేవు కాలుష్యంతో గంగవరం గ్రామం రోజురోజుకూ కలుషితమవుతోందని, దీంతో గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారని మృతుని బంధువులు ఆరోపించారు.

Nalgonda Public Meeting: ఎన్నిక‌ల త‌ర్వాత తొలిసారి ప్రజ‌ల్లోకి మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత ప్ర‌సంగంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, న‌ల్ల‌గొండ‌లో బీఆర్ఎస్ శంఖారావం కోసం స‌ర్వం సిద్ధం

VNS

నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ సభకు (Nalgonda Public Meeting) ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలిరానున్నారు.

Advertisement

IPS Transfers In Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు: 12 మంది ఐపీఎస్‌ల బదిలీ- రాచకొండ సీపీగా తరుణ్‌ జోషి

sajaya

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో ప్రధానంగా రాచకొండ పోలీస్ కమిషనర్‌గా మల్టీ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ తరుణ్ జోషిని నియమిస్తూ, ప్రస్తుత అధికారి జి. సుధీర్ బాబుతో పాటు మరో 11 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Elections 2024: తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 105 మంది బదిలీ

Hazarath Reddy

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో 105 మందిని బదిలీ చేసింది. సీఈవో, డీఆర్డీవో, అడిషనల్‌ డీఆర్డీవో, డీపీవోలకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది.

Andhra Pradesh DSC 2024: నేటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు స్వీకరణ, ఈ నెల 22 వరకు గడువు, పూర్తి వివరాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం..నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Groundnut Farmers Protest: అచ్చంపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌పై దాడి చేసిన వేరుశెనగ రైతులు, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

Hazarath Reddy

వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద శెనగ రైతులు నిరసన తెలుపారు. అక్కడకు వచ్చిన అచ్చంపేట మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌పై దాడి చేసి, చీరతో లాగి, కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, పెట్రోల్ అయిపోవడంతో కస్టమర్‌ని బైక్ మీద కూర్చోపెట్టుకుని తోసుకుంటూ వెళ్లిన రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్

Hazarath Reddy

నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన అసాధారణ సంఘటనలో, హైదరాబాద్‌లోని రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో తన బైక్‌ను దానిపై ఉన్న కస్టమర్‌తో నెట్టవలసి వచ్చింది. రైడర్ పరిస్థితి గురించి కస్టమర్‌కు తెలియజేశాడు, కాని తరువాతి కస్టమరన్ దిగడానికి నిరాకరించాడు

CM Revanth Reddy vs Harish Rao: కొడంగల్‌ ప్రజలు తరిమితే మల్కాజ్‌గిరిలో పడ్డావు, కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

Hazarath Reddy

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసమని, అలాంటి చర్చ సందర్భంగా అపొజిషన్ పార్టీ లీడర్ కేసీఆర్ సభలో లేకుండా ఫామ్ హౌస్‌లో పడుకున్నారని, కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ వచ్చారని ఏద్దేవా చేశారు.

CM Revanth Reddy vs Harish Rao: వాటర్ మీద చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా, ఘాటుగా బదులిచ్చిన హరీష్ రావు

Hazarath Reddy

Hyd, Feb 8: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Sessions 2024) హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు’ పేరుతో నోట్ విడుదల చేసింది.

ICU Patient Bitten by Rats: కామారెడ్డిలో ఐసీయూ పేషెంట్‌పై ఎలుకలు దాడి ఘటన, ఇద్దరు వైద్యాధికారులతో సహా నర్సింగ్‌ ఆఫీసర్‌ సస్పెండ్, ఉత్తర్వులు జారీ చేసిన వైద్య శాఖ

Hazarath Reddy

కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వసంత్‌ కుమార్‌, కావ్య తో పాటు నర్సింగ్‌ ఆఫీసర్‌ మంజులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement