రాష్ట్రీయం

Chinese Manjha: మాంజా మెడ‌కు చుట్టుకొని జ‌వాన్ మృతి, చైనా మాంజాల కార‌ణంగా హైద‌రాబాద్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు మృతి, వంద‌ల్లో ప‌క్షులు మ‌ర‌ణం

VNS

మృతుడిని పేట్‌ బషీర్‌భాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్‌ఐ తనయుడు ఆకాశ్‌గా గుర్తించారు. పతంగుల కారణంగా గత రెండురోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. చైనా మాంజాపై నిషేధం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పలువురు విక్రయిస్తున్నారు. పతంగులను ఎగురవేస్తూ ఇష్టారాజ్యంగా వదిలివేస్తుండడంతో మాంజాదారం

CBN Meets Pawan Kalyan: చంద్ర‌బాబు ఇంటికి భోజనానికి వెళ్లిన ప‌వ‌న్ క‌ల్యాణ్, టీడీపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ దాదాపు ఖ‌రారైన‌ట్లే

VNS

త్వ‌ర‌లో ఏపీ అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో (Pawan kalyan) చంద్ర‌బాబు డిన్న‌ర్ భేటీకి హాజ‌ర‌య్యారు. ఈ భేటీలో జ‌న‌సేన సీనియ‌ర్ నేత నాదేండ్ల మ‌నోహ‌ర్ కూడా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చ‌ర్చ‌ల్లో త్వ‌ర‌లో అభ్య‌ర్థుల తొలి జాబితా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

SCR Special Trains: సంక్రాంతికి ట్రైన్ టికెట్లు దొర‌క‌లేదా? మీకోస‌మే ప్ర‌త్యేక రైళ్లు న‌డిపిస్తున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, స్పెష‌ల్ ట్రైన్స్ షెడ్యూల్ ఇదే!

VNS

ఈ నేపథ్యంలో మరిన్ని రైళ్లను పట్టాలెక్కించింది. సికింద్రాబాద్‌-తిరుపతి, సికింద్రాబాద్‌-కాకినాడ, సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్‌ -తిరుపతికి (07489) ప్రత్యేక రైలు 15న సోమవారం రాత్రి 20.10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది

MP Balashauri Resign: ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా..టిక్కెట్ రాదనే మనస్తాపమే కారణం..జనసేన వైపు అడుగులు..

sajaya

మచిలిపట్నం వైసీపీ పార్లమెంట్‌ సభ్యుడు బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన సీట్ల మార్పుల కారణంగా టికెట్‌ రాని వారు నిరాశతో వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశానని, తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Advertisement

YS Sharmila Meets Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో వైఎస్ షర్మిల భేటీ, కుమారుడి వివాహానికి రమ్మని ఆహ్వానం...గంట సేపుపైగా ఏకాంతంగా చర్చలు..

sajaya

కాంగ్రెస్ నాయకురాలు వై.ఎస్.షర్మిల శనివారం టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడుని ఆయన నివాసంలో కలిసి వచ్చే నెలలో జరిగే తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. షర్మిల ఇక్కడి జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆహ్వానం పలికారు. ఆమె కుమారుడు వై.ఎస్.రాజా రెడ్డి తన ప్రియురాలు అట్లూరి ప్రియతో ఫిబ్రవరి 17న వివాహం చేసుకోనున్నారు.

Governor Tamilisai: రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుకలు.. పాయ‌సం వండిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ తమిళిసై సౌందర్ రాజన్.. వీడియో

Rudra

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి సంబ‌రాల్లో పాల్గొన్నారు. ఇవాళ ఆమె హైద‌రాబాద్‌ లోని రాజ్‌ భ‌వ‌న్‌ లో భోగి వేడుక‌ల్ని నిర్వ‌హించారు.

Madras High Court About Porn Videos: అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. వీడియోలు చూసినవారిపై నిందలు మానేసి వారిని ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని హితవు

Rudra

స్మార్ట్ ఫోన్‌ లో చిన్నారుల పోర్న్ వీడియోలను చూసినట్టు నమోదైన ఓ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది.

Prabhas Video Viral: దుర్గా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. పక్కనే డార్లింగ్ ఉన్నప్పటికీ గుర్తుపట్టని అభిమానులు.. నటుడు వెళ్లిపోయాక ఫొటోను విడుదల చేసిన ఆలయ అధికారులు.. తమ పక్కన ఇప్పటివరకూ ఉన్నది బాహుబలినా? అని ముక్కున వేలేసుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Rudra

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన ఉన్నప్పటికీ అభిమానులు ఎవరూ గుర్తుపట్టలేదు.

Advertisement

Mother Killed Children: పండుగ‌కు బ‌ట్ట‌లు కొనివ్వ‌లేద‌ని భ‌ర్త‌పై కోపంతో ఇద్ద‌రు పిల్ల‌ల్ని చంపిన త‌ల్లి, క్ష‌ణికావేశంలో తాను కూడా ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డ మ‌హిళ‌

VNS

ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భర్త ఎంత నచ్చజెప్పినా వినకుండా అతనితో గొడవకు దిగింది. ఆ క్షణికావేశంలో ముక్కపచ్చలారని ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా (Mother Killed Children) చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య (Suicide) చేసుకుంది.

Traffic Restrictions: హైద‌రాబాద్ లో మూడు రోజుల పాటూ ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్ల‌లో వెళ్లేవారు ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల‌ని పోలీసుల సూచ‌న‌

VNS

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌కు నగరంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు 6వ ఇంటర్నేషనల్‌ కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివెల్‌-2024 (International Kite Festival) సందర్భంగా ప‌రేడ్ గ్రౌండ్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic restrictions) ఉంటాయని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

Notification For TSPSC Chairman: ఎట్ట‌కేల‌కు టీఎస్ పీఎస్సీ బోర్డు నియామ‌కంపై ముంద‌డుగు, నోటిఫికేష‌న్ విడుదల, ఈ నెల 18 వ‌ర‌కు అప్లై చేసుకోవ‌చ్చు

VNS

టీఎస్‌పీఎస్సీలో (TSPSC) ఖాళీగా ఉన్న చైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ (Notification) విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ రిలీజ్‌ (Notification) చేసింది. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది

Student Dies by Suicide: హన్మకొండ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య, ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని అనుమానాలు

Hazarath Reddy

హన్మకొండ జిల్లాలోని ఎస్‌ఆర్‌ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థిని దీప్తి హాస్టల్‌ రూమ్‌లో సూసైడ్‌ చేసుకుంది. ఇక, ఆమె ఆత్మహత్యకు ప్రేమ, పరీక్షల ఫలితాలే కారణమని తెలుస్తోంది. దీప్తి తన క్లాస్‌మేట్‌ వ్యక్తిని ప్రేమిస్తున్నట్టు తోటీ విద్యార్థులు చెబుతున్నారు.

Advertisement

Video: వీడియో ఇదిగో, బస్సులు ఆపట్లేదని బస్సు ముందు పడుకొని నిరసన తెలిపిన ప్రయాణికుడు, కరీంనగర్ చౌరస్తా వద్ద ఘటన

Hazarath Reddy

తెలంగాణలో లక్షెట్టిపేటలో కరీంనగర్ చౌరస్తా వద్ద 4 గంటల నిలబడ్డ బస్సులు ఆపడం లేదంటూ ఆర్టీసీ బస్సుకు అడ్డంగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన ప్రయాణికుడు. ఇదిలా ఉంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో మగవాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. సీట్లు దొరకడం లేదని బస్సు ఎక్కే అవకాశం కూడా కనపడటం లేదని పలువురు వాపోతున్నారు.

Fighter Rooster Auction: సజ్జనార్ సార్ దయచేసి నా పందెం కోడి వేలాన్ని ఆపండి, వీడియో ద్వారా వేడుకున్న కోడి యజమాని

Hazarath Reddy

దానిని తీసుకు వెళ్లేందుకు యజమాని వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో నేడు వేలానికి ముహూర్తం నిర్ణయించారు. తాజాగా పందెం కోడి యజమాని బయటకు వచ్చాడు. ఓ వీడియో ద్వారా వేలం ఆపాలని టీఎస్ఆర్టీసీ ఎండీకి విన్నవించుకున్నారు.

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రాలో తన్నుకున్న కబడ్డీ ప్లేయర్లు, నందికొట్కూరు కళాశాల మైదానంలో ఘర్షణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్‌ 2023 ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి విదితమే. అయితే అక్కడక్కడా క్రీడాకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు కళాశాల మైదానంలో కబడ్డీ మైదానంలో లెట్స్ ప్లే ఆంధ్రా లెట్స్ ఫైట్ ఆంధ్రగా మారింది.

Chicken Auction on Today: ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి.. కోడి తమదని మూడు రోజులు గడిచినా ఎవరూరాని వైనం.. నేడు వేలం వేయనున్న ఆర్టీసీ అధికారులు (వీడియోతో)

Rudra

మూడు రోజుల క్రితం కరీంనగర్‌ లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని నేటి మధ్యాహ్నం 3 గంటలకు డిపో-2 ఆవరణలో అధికారులు వేలం వేయనున్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: అనూహ్య మార్పులతో వైసీపీ మూడో జాబితా విడుదల, పెడన నుంచి పెనమలూరుకు మారిన జోగి రమేష్, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం

Hazarath Reddy

మొత్తం 175కు 175 సీట్ల గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ పార్టీ తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27 స్థానాలకు ఇన్‌ఛార్జిలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో జాబితాలో ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.

Andhra Pradesh Elections 2024: ఇది ఆరంభమేనంటూ టీడీపీకి చురకలు అంటించిన కేశినేని నాని, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు విషెస్

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు ఆయన ఎక్స్‌(ట్విట్టర్‌) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనంటూ టీడీపీకి చురకలు అంటించారు. మనల్ని అవమానించిన వాళ్లకు గుణపాఠం చెబుదాం అంటూ స్వామిదాసును ఉద్దేశించి కేశినేని ట్వీట్‌ చేశారు.

Andhra Pradesh Elections 2024: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..

Hazarath Reddy

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్‌ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది.

MP Raghurama Petition in High Court: నన్ను అరెస్ట్ చేయకుండా ఏపీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి, ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పారంటే..

Hazarath Reddy

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సంక్రాంతికి మా ఊరు వెళ్తానని నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement
Advertisement